అన్వేషించండి

Organ Donation: తొలి అవయవదానం ఎప్పుడు జరిగిందో తెలుసా? అవయవదానంపై ఉన్న అపోహలు - వాస్తవాలు ఇవే

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మంచిదని అంటారు. అదే కాదు ఇప్పటి పరిస్థితుల్లో అవయవదానం ఇంకా మంచిది.

క వ్యక్తి చనిపోతూ మరోకరికి ప్రాణం పోయడమంటే విచిత్రంగానే ఉంటుంది. కానీ, అది నిజం. కేవలం ‘అవయవదానం’ వల్లే అది సాధ్యమవుతుంది. చనిపోయిన వ్యక్తి తన అవయవదానాలు చెయ్యడం వల్ల ఏంతో మంది ప్రాణాలు నిలబడతాయి. కిడ్నీలు, గుండె, కళ్ళు, ఊపిరితిత్తులు, బ్రెయిన్ ఇలా అన్ని ఆర్గాన్స్ దానం చేసి.. అవసరాల్లో ఉన్న వాళ్ళ ప్రాణాలు నిలబెట్టవచ్చు. ఇంతక ముందు అయితే అవయవదానం చెయ్యాలంటే అసలు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అవయవదానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే, దీనిపై అవగాహన చాలా అవసరం. అందుకే, ఏటా ఆగస్టు 13న ప్రపంచ అవయవాదానం దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.  అవయవదానం ప్రాముఖ్యతని ప్రజలకు తెలియజేస్తున్నారు. 

అవయవదానం ఎలా మొదలైంది?

1954లో యూఎస్ లో తొలి అవయవదానం విజయవంతంగా జరిగింది. డాక్టర్ జోసఫ్ ముర్రే ఈ ఆపరేషన్ ని చేశారు. కవల సోదరులైన రోనాల్డ్, రిచర్డ్ హెర్రిక్‌లకు విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసి ప్రాణాలు కాపాడినందుకు గాను 1990లో సైకాలజీ, మెడిసిన్ విభాగంలో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు.

అవయవదానం ఎవరు చెయ్యొచ్చు?

హెచ్ ఐవీ, గుండె సంబంధిత జబ్బులు, క్యాన్సర్, ఊపిరితిత్తులకి సంబంధించిన ఎటువంటి దీర్ఘకాలిక జబ్బులు లేని ఎవరైనా అవయవాదానం చెయ్యొచ్చు. దీనికి కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేదు. కానీ అవయవాదానం చేసే వ్యక్తికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

అవయవదానం రకాలు

అవయవదానం రెండు రకాలు. మనిషి ఒక కిడ్నీ, లివర్ తో జీవించగలడు. మనిషి బతికి ఉన్నప్పుడే ఆ అవయవాలను తీసి మరొకరికి అమర్చుతారు. రెండో విధానంలో.. దాత మరణించిన తర్వాత భౌతిక కాయాన్ని దానం చేస్తారు. ఆ శరీరంలో ఉన్న ఆరోగ్యకరమైన అవయవాలను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు మార్చవచ్చు.

❂ ఎవరైనా అవయవదానం చెయ్యొచ్చు. ఇందుకు కులం, మతం ఎటువంటి అభ్యంతరాలు ఉండవు.

❂ ఒక మనిషి చనిపోతే గుండె ఆగిపోయిన తర్వాత అవయవాలు పనికిరాకుండా పోతాయి. కొంతమంది బ్రెయిన్ పని చెయ్యడం ఆగిపోయినప్పుడు గుండె పని చేస్తూనే ఉంటుంది. నిర్ణీత సమయంలో మాత్రమే వాటిని తొలగించి మార్పిడి చెయ్యడానికి వీలవుతుంది.

❂ అవయవాలని తొలగించిన తర్వాత శరీరాన్ని చెల్లాచెదురుగా పడేస్తారని అపోహ ఉంటుంది. కానీ అవసరమైన అవయవాలు తీసుకున్న తర్వాత మానవ శరీరాన్ని చక్కగా కుట్టేస్తారు. దానికి మళ్ళీ సాధారణ రూపం తీసుకొస్తారు.

❂ మన దేశంలో అవయవ మార్పిడి చట్టం ఉంది. ఎవరైనా బయట వ్యక్తులు అ అవయవాలను అమ్మినా, కొనుగోలు చేసినా చట్టరీత్యా నేరం. కేవలం దగ్గర బంధువులు మాత్రమే అవసరమైన వారికి అవయవదానం చెయ్యొచ్చు.

❂ చాలా మంది అవయవదానం చేసిన తర్వాత అనారోగ్యానికి గురవుతారని అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. నిజానికి సాధారణ వ్యక్తులు మాదిరిగానే అవయవదానం చేసిన వ్యక్తులు కూడా మామూలుగానే ఉంటారు. అవయవ మార్పిడి చేసే ముందు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు అన్ని పరీక్షలు చేస్తారు. రిపోర్ట్స్ అన్ని సక్రమంగా ఉంటేనే అవయవదానానికి వైద్యులు అంగీకరిస్తారు.

❂ ఆడవాళ్ళ అవయవాలని పురుషులకి మార్చడం సాద్యం కాదనే అపోహ ఉంది. కానీ అది ఎంతమాత్రం నిజం కాదు. మగ, ఆడవారి కాలేయం, కిడ్నీ ఒకేలా ఉంటాయి అందువల్ల వాటిని సురక్షితంగా మార్పిడి చెయ్యవచ్చు.

❂ 60 ఏళ్లు దాటిన వాళ్ళు అవయవదానం చేయడానికి కుదరదు. కాలానుగుణంగా దాత శరీర అవయవాలు పనితీరు సక్రమంగా ఉండాలి. అప్పుడే దానం చేసేందుకు అవకాశం ఉంటుంది. 60 ఏళ్లు పైబడిన వాళ్ళకి శరీర అవయవాల పనితీరు మందగిస్తుంది.  

Also read: ఆస్తమా ఉన్న వాళ్లు రాత్రి పూట పెరుగు తినవచ్చా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?

Also read: మీరు ఎంత తిన్నా బరువు పెరగని ఆహారాలు ఇవన్నీ,భయపడకుండా నచ్చినంత తినండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget