అన్వేషించండి

Nipah Virus: మళ్ళీ విజృంభిస్తోన్న నిఫా వైరస్- లక్షణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ వల్ల ఇద్దరు మృతి చెందినట్టు తెలుస్తోంది.

ఏవైనా కొత్త వైరస్ లు వచ్చాయంటే వాటికి సంబంధించిన కేసులు మొదటగా కేరళలోని బయట పడతాయి. తాజాగా కేరళలో మరొక వైరస్ కి సంబంధించి మరణాలు నమోదయ్యాయి. కోజికోడ్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మరణించినట్టు కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అక్కడి వైద్యుల సమాచారం ప్రకారం నిఫా వైరస్ వల్లే వాళ్ళు మరణించినట్టు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేరళలో 2018 లో మొదటి సరిగా నిఫా వైరస్ కి సంబంధించి తొలి కేసు నమోదైంది. మళ్ళీ 2021 లో ఈ వైరస్ కి సంబంధించిన కేసులు బయట పడ్డాయి. మరోసారి ఈ వైరస్ కేరళలో ప్రవేశించి భయాందోళనలు కలిగిస్తుంది.

నిఫా వైరస్ అంటే ఏంటి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం నిఫా ఇన్ఫెక్షన్ జంతువుల నుంచి ప్రజలకి సంక్రమాయించే జునోటిక్ వ్యాధిగా పరిగణిస్తారు. కలుషితమైన ఆహారం లేదా నేరుగా వ్యక్తి నుంచి వ్యక్తికి ఇది వ్యాపిస్తుంది. మలేషియాలో మొదటి సారిగా నిఫా వ్యాప్తి చెందింది. జబ్బుపడిన పందులు లేదా వాటి కలుషితమైన కణజాలాలతో ప్రత్యక్ష సంబంధం కార్ణాంగాయి అంటువ్యాధులు సంభవించాయి. బంగ్లాదేశ్, భారత్ లో గబ్బిలాల మూత్రం లేదా లాలాజలంతో కలుషితమైన పండ్లు లేదా వాటి ఉత్పత్తుల నుంచి వ్యాధి వ్యాప్తి జరిగిందని WHO పేర్కొంది.

ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు

వ్యాధి సోకిన వారికి జ్వరం, తలనొప్పి, వాంతులు, గొంతు నొప్పి ఉంటాయి. మైకం, మగత, స్పృహ కోల్పోవడం, తీవ్రమైన ఎన్సెఫాలిటీస్ ను సూచించే నరాల సంకేతాలు కూడా కనిపించాయి. ఈ వైరస్ సోకిన 4 నుంచి 14 రోజుల్లో లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

చాలా మంది వ్యక్తులు దీని నుంచి పూర్తిగా కోలుకుంటారు. కానీ కొంతమందికి మాత్రం ఎన్సెఫాలిటిస్ వస్తే నాడీ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని సార్లు తగ్గినా మళ్ళీ వైరస్ సోకినట్టుగా వచ్చిన కేసులు నివేదించబడ్డాయి. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం వీటి మరణాల రేటు 40-75 శాతంగా ఉంది. తీవ్రమైన సందర్భాల్లో ప్రజలు న్యుమోనియా, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు అనుభవిస్తారు. ఎన్సెఫాలిటిస్ వస్తే మాత్రం 24 గంటల నుంచి 48 గంటల్లో రోగి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది.

ఎలా వ్యాపిస్తుంది?

గబ్బిలాలు, పందులు, వైరస్ వల్ల కలుషితమైన ఆహారం తీసుకుంటే మానవులకు ఇది వ్యాపిస్తుంది. నేరుగా మనిషి నుంచి మనిషికి కూడా సంక్రమిస్తుంది. భారత్ లో ఈ వైరస్ గబ్బిలాల నుంచి వ్యాపించింది. ఇప్పటి వరకు నిఫా వైరస్ కు ఎలాంటి మందులు అందుబాటులో లేవు. దీన్ని నివారించాలంటే భద్రతా చర్యలు అనుసరించాలి. వైరస్ సోకిన జంతువుల అవశేషాలు ముట్టుకోకుండా వాటిని తగులబెట్టాలి. వాటి మృతదేహాలు కాల్చడం చేయాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

శుభ్రమైన పండ్లు తీసుకోవాలి. గబ్బిలాల కాటుకు గురయిన పండ్లు తీసుకోవడం తప్పనిసరిగా విస్మరించాలి. అప్పుడే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలము. జంతువులని తాకే ముందు చేతికి గ్లౌజులు ధరించడం తప్పనిసరి. వ్యాధి సోకిన వారికి దూరంగా ఉండాలి. వ్యాధి వాప్తి అరికట్టేందుకు చేతులని క్రమం తప్పకుండా సబ్బు లేదా శానిటైజర్ తో వాష్ చేసుకోవాలి.

 గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: ఈ బ్రేక్ ఫాస్ట్‌తో మీ రోజుని అసలు స్టార్ట్ చేయొద్దు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Advertisement

వీడియోలు

Kavitha Janambata Interview | ఆదిలాబాద్ జిల్లాలో కవిత జనం బాట వెనుక మతలబు ఇదేనా.? | ABP Desam
Smrithi Mandhana Jemimah Gesture | ఆడి వరల్డ్ కప్ సాధించారు..ప్రత్యర్థులను ఓదార్చి హృదయాలు గెలిచారు | ABP Desam
Tribute to Mithali Raj Jhulan Goswami | ప్రపంచకప్ గెలిచి మిథాలీ, ఝులన్ గోస్వామికి ట్రిబ్యూట్ | ABP Desam
India vs South Africa Final | Deepti Sharma | మ్యాచ్‌ని మలుపు తిప్పిన దీప్తి శర్మ
Women's ODI Final | Smriti Mandhana | చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Pawan Kalyan: ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
Youngest Self Made Billionaires: ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
Embed widget