అన్వేషించండి

Golden Rice: బంగారంలా మెరిసిపోతున్న బియ్యం, ఏంటీ గోల్డెన్ రైస్? తినడం వల్ల ఉపయోగాలేంటి?

వరిలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో ప్రత్యేకమైనది గోల్డెన్ రైస్.

మనదేశంలో ప్రధాన ఆహారం బియ్యమే. దీనిలో 75 శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి. బియ్యంలో ఇప్పటికే చాలా రకాలు ఉన్నాయి. ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, బ్రౌన్ బియ్యం... ఇలా. బియ్యాన్ని ఎంత తక్కువగా పాలిష్ చేస్తే అంత ఆరోగ్యం. అధికంగా పాలిష్ చేసిన బియ్యంతో మధుమేహం వచ్చే అవకాశం అధికం. బ్రౌన్ రైస్ ముతకగా ఉన్నా కూడా మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుంది. అందుకే బాగా తెల్లగా ఉన్న బియ్యాన్ని కాకుండా, ముతకగా ఉన్న బియ్యాన్ని తినడమే మంచిది. ఇక చైనాలో నల్లబియ్యాన్ని విపరీతంగా వాడతారు. మనదేశంలో నల్ల బియ్యాన్ని తినడానికి పెద్దగా ఎవరూ ఇష్టపడడం లేదు. వీటితో పాటూ గోల్డెన్ రైస్ కూడా ఈ భూమిపై పండుతోంది. ఇది కృత్రిమంగా సృష్టించి పండించినది. 

గోల్డెన్ రైస్ అంటే ఏమిటి? 
పేరుకు తగ్గట్టే ఇవి బంగారం రంగులో మెరిసిపోతుంటాయి. అన్నం వండితే పసుపు రంగులో ఉంటుంది. దీనికి ఈ రంగు రావడానికి కారణం బీటా కెరాటిన్. బీటా కెరాటిన్ ఉన్నందుకే క్యారెట్లు అలా ఆరెంజ్ రంగులో ఉంటాయి. ఈ బియ్యం జన్యు ఇంజనీరింగ్ ద్వారా అభివృద్ధి చేశారు. ఇదొక బయోఫోర్టిఫైడ్ పంట. బయోఫోర్టిఫికేషన్ పంటల పోషక విలువలను పెంచుతుంది. సాధారణంగా బియ్యంలో బీటా కెరాటిన్ ఉండదు. కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే అందుతాయి. కానీ గోల్డెన్ రైస్‌లో బీటా కెరాటిన్ పుష్కలంగా లభిస్తుంది. బీటా కెరాటిన్ శరీరంలో చేరాక విటమిన్ Aగా మారుతుంది. విటమిన్ ఎ మన శరీరానికి ఎంత అవసరమో తెలిసిందే. 

ఎవరు పండించారు?
ఇది ఇద్దరు శాస్త్రవేత్తల అద్భుత సృష్టి. వీరిద్దరూ జర్మనీకి చెందిన మొక్కత శాస్త్రవేత్తలు. వీరు 1990లలో ఈ గోల్డెన్ రైస్‌కు ప్రాణం పోశారు. విటమిన్ ఎ లోపాన్ని అరికట్టేందుకు, దీని ద్వారా వచ్చే అంధత్వాన్ని అడ్డుకునేందుకు వీరు ఈ బియ్యాన్ని సృష్టించారు. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మంది ప్రజలు విటమిన్ ఏ లోపం వల్ల ఇబ్బంది పడుతున్నట్టు అప్పట్లో అంచనా వేశారు. దీంతో ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ బియ్యాన్ని కనిపెట్టారు. కానీ ఈ బియ్యాన్ని ఆమోదించేందుకు ఎంతో సమయాన్ని తీసుకున్నాయి ప్రపంచ దేశాలు.  

ఏఏ దేశాల్లో...
ఈ బియ్యాన్ని పండించేందుకు ఫిలిప్పీన్స్‌లో ఉన్న ‘ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్సిట్యూట్’ 2001లో మొదటిసారి లైసెన్సు ఇచ్చింది. దీంతో ఫిలిప్పీన్స్ లో దీని వాడకం మొదలైంది.  గోల్డెన్ రైస్ వాణిజ్య ఉత్పత్తిని ఆమోదించిన మొదటి దేశంగా ఫిలిప్పీన్స్ మారింది. తరువాత మెల్లగా ఇతర దేశాలు కూడా ఈ బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకున్నాయి. 2018లో కెనడా, అమెరికా కూడా ఈ బియ్యాన్ని దేశంలోకి ఆమోదించాయి. బంగ్లాదేశ్ రైతులు ఈ బియ్యాన్ని పండించేందుకు సిద్ధపడ్డారు. 

Also read: వారానికోసారి నువ్వులన్నం ఇలా చేసుకుని తినండి చాలు - ఎంతో బలం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: 'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
YS Sharmila Bus : మహిళలకు ఉచిత  బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని  వినూత్నంగా  ప్రశ్నించిన షర్మిల
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని వినూత్నంగా ప్రశ్నించిన షర్మిల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణహమాస్ చీఫ్ సిన్వర్ హతం, కీలక ప్రకటన చేసిన ఇజ్రాయేల్సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు, వాట్సాప్‌లో మెసేజ్‌అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: 'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
YS Sharmila Bus : మహిళలకు ఉచిత  బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని  వినూత్నంగా  ప్రశ్నించిన షర్మిల
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని వినూత్నంగా ప్రశ్నించిన షర్మిల
Andhra BJP : మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
Ratan Tata Death Reason: రతన్‌ టాటా ఎలా చనిపోయారు, డాక్టర్ రిపోర్ట్‌లో ఏం ఉంది?
రతన్‌ టాటా ఎలా చనిపోయారు, డాక్టర్ రిపోర్ట్‌లో ఏం ఉంది?
Embed widget