అన్వేషించండి

Alzheimers : కడుపులో గడబిడా? గజినీలు అయిపోతారు జాగ్రత్త!

Alzheimers : మన పొట్టలో ఉండే బ్యాక్టీరియా అల్జీమర్స్ వ్యాధికి కారణమవుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. 50 ఏళ్లు లేదంటే అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో ఈ ప్రమాదం పెరుగుతుందని అధ్యయనంలో తేలింది.

Alzheimers : మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని మనందరికీ తెలిసిందే. బయటకు కనిపించే శరీర భాగాలను మనం బాగానే చూసుకున్నప్పటికీ.. శరీరం లోపలి భాగాల సంగతి పట్టించుకోము. స్కానింగ్ చేస్తే తప్పా శరీరం లోపల ఏం జరుగుతుందో తెలియదు. కడుపులో అనారోగ్యం ఉన్నప్పుడు మాత్రమే కొన్ని లక్షణాలు బయటకు కనిపిస్తాయి. కడుపులో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా రెండూ ఉంటాయి. మంచి బ్యాక్టీరియా గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ కొన్ని బగ్స్ వల్ల అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని తాజా ఆధ్యయనం పేర్కొంది.

గట్ బ్యాక్టీరియా అల్జీమర్స్ వ్యాధికి కారణం అవుతుందా?

ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మందిలో కనిపించే సాధారణ గట్ బ్యాక్టీరియా అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని మెక్‌గిల్ విశ్వవిద్యాలయ పరిశోధకుల కొత్త అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం గురించి పూర్తి సమాచారాన్ని  అల్జీమర్స్ & డిమెన్షియా: ది జర్నల్ ఆఫ్ ది అల్జీమర్స్ అసోసియేషన్‌లో ప్రచురించింది. వైద్యపరంగా స్పష్టంగా కనిపించే హెలికోబాక్టర్ పైలోరీ (H pylori) ఇన్‌ఫెక్షన్ 50 ఏళ్లు లేదంటే అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందా అనే అంశంపై పరిశోధన చేసింది. పొట్టలో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నట్లయితే.. అజీర్ణం, పొట్టలో పుండ్లు, అల్సర్లు పేగు లేదా పొట్ట క్యాన్సర్ కు కారణం అవుతాయని అధ్యయనం పేర్కొంది. 

H. పైలోరీ ఇన్‌ఫెక్షన్:

మెక్‌గిల్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల బృందం, 1988, 2019 మధ్య 50 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న యునైటెడ్ కింగ్‌డమ్‌లోని 4 మిలియన్ల మంది వ్యక్తుల ఆరోగ్య డేటాను సేకరించింది. రోగ లక్షణ H. పైలోరీ ఇన్‌ఫెక్షన్ ఉన్న వ్యక్తులకు అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం 11 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుందని, జనాభా పెరుగుతున్నా ఈ వ్యాధి బారినపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. “ప్రపంచ వృద్ధాప్య జనాభా దృష్ట్యా, వచ్చే 40 ఏళ్లలో మతిమరుపు సమస్య మూడు రెట్లు పెరుగుతుందని భావిస్తున్నారు.

అల్జీమర్స్ వ్యాధిని తగ్గించే ఆహారం: 

మరొక అధ్యయనంలో, అల్జీమర్స్ వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించడంలో ఏ ఆహారం ప్రభావంతంగా ఉంటుందో పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్‌లో ప్రచురించారు. మెడిటరేనియన్ ఆహారం, సాంప్రదాయ చైనీస్, జపనీస్, భారతీయ వంటకాలు వంటి మొక్కల ఆధారిత ఆహారాలు ముఖ్యంగా పాశ్చాత్య ఆహారంతో పోల్చినప్పుడు ప్రమాదాన్ని తగ్గించగలవని అధ్యయనం తెలిపింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ,ఊబకాయం  మధుమేహం ప్రమాదాన్ని పెంచడంతోపాటు అల్జీమర్స్ కు కారణం అవుతాయని అధ్యయనం పేర్కొంది. 

Also Read : ఈజీగా, టేస్టీగా రెడీ చేసుకోగలిగే పాలకూర వడలు.. రెసిపీ ఇదే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Game Changer Second Single Promo : కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
UK : అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
Telangana News: అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
Pushpa 2: షెకావత్‌ సార్ సెట్‌లోకి వచ్చేశాడు... నాన్‌ స్టాప్‌గా ‘పుష్ప 2’ షూటింగ్
షెకావత్‌ సార్ సెట్‌లోకి వచ్చేశాడు... నాన్‌ స్టాప్‌గా ‘పుష్ప 2’ షూటింగ్
Embed widget