అన్వేషించండి

Cancer Risk in Women : అమ్మాయిలకు మందు, సిగరెట్ తాగే అలవాటు ఉంటే.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం మగవారికంటే ఎక్కువట

Cancer Causes in Women : ధూమపానం, మద్యపానం చేసే మహిళలకు క్యాన్సర్, గుండె జబ్బులు పురుషుల కంటే ఎక్కువగా వస్తాయని కనుగొన్నారు. మగవారికంటే ఎందుకు ఈ ప్రమాదం ఎక్కువో ఇప్పుడు చూసేద్దాం.

Double Cancer Risk in Women : సిగరెట్లు, మందు తాగడం వంటి అలవాట్లు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి. ఈ రెండూ క్యాన్సర్ ప్రమాదానికి ప్రధాన కారణాలుగా చెప్తారు. ఈ అలవాట్ల కారణంగా పురుషులలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. అయితే ఈ అలవాట్లు మగవారు, ఆడవారితో పోలిస్తే.. షాకింగ్ విషయాలు తెలిశాయి. పురుషులతో పోలిస్తే.. మందు, సిగరెట్లు మహిళల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని గుర్తించారు నార్వే, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. 

సిగరెట్లు, మద్యం సేవించే మహిళల్లో పురుషులపై పెద్ద ఎత్తున అధ్యయనం చేశారు. అలా పోల్చినప్పుడు క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదం ఆడవాళ్లల్లో ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. ఇద్దరూ ఒకే మోతాదులో తీసుకున్నా.. ఆడవారికి క్యాన్సర్ ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

మందు, సిగరెట్లు తాగే మహిళలకు క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ

ఈ సెన్సిటివ్ అంశంపై నార్వే పరిశోధకులు.. దాదాపు 6 లక్షల మంది వైద్య రికార్డులను అధ్యయనం చేశారు. మద్యం, సిగరెట్లు తాగే మహిళల్లో.. పురుషులతో పోలిస్తే ఊపిరితిత్తులు, పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనల్లో దాదాపు 4,000 మందికి పెద్దపేగు క్యాన్సర్ వచ్చింది. ముఖ్యంగా 16 సంవత్సరాల వయస్సు లేదా అంతకంటే తక్కువ వయస్సులో సిగరెట్లు తాగడం ప్రారంభించి.. ఎక్కువ కాలం కొనసాగించే మహిళల్లో ఈ క్యాన్సర్ ప్రమాదం మరింత పెరుగుతుందని చెప్తున్నారు. మహిళల శరీరం పొగాకు వంటి హానికరమైన పదార్థాలకు సెన్సిటివ్​గా రియాక్ట్ అవుతుందని గుర్తించారు. 

ఆడవారికి క్యాన్సర్ ప్రమాదం ఎందుకు ఎక్కువ..

మద్యం, సిగరెట్లు తాగే మహిళల్లో క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉండటానికి జీవసంబంధమైన కారణాలు కూడా ఓ కారణమంటున్నారు. ఉదాహరణకు మహిళల్లో ఈస్ట్రోజెన్ వంటి కొన్ని ఎంజైమ్‌లు, హార్మోన్లు పొగాకు పొగ నుంచి విడుదలయ్యే హానికరమైన మూలకాలు జీవక్రియను ప్రభావితం చేస్తాయి. అందుకే మహిళల్లో తక్కువ సిగరెట్లు తాగినా పురుషులతో పోలిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అధ్యయనం ప్రకారం.. ఇతరుల పొగకు గురికావడం వల్ల కూడా మహిళలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. 

తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, నివారణ చర్యలు

మద్యం, సిగరెట్లు తాగే బాలికల్లో ఊపిరితిత్తులు, పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉండడమే కాకుండా.. గుండె జబ్బులు, ఎంఫిసెమా, ఇతర తీవ్రమైన వ్యాధుల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటాయట. అంతేకాకుండా మహిళల్లో పురుషులతో పోలిస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెట్టింపు ఉంటుందని చెప్తున్నారు. సిగరెట్లను వదిలేయడం ఆరోగ్యానికి అత్యంత ప్రభావవంతమైన మార్గమని ఈ పరిశోధన స్పష్టం చేసింది. 30 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి మద్యం, సిగరెట్లు తాగడం మానేసిన మహిళల్లో పొగాకు సంబంధిత వ్యాధుల ప్రమాదం దాదాపుగా ఉండదని చెప్తున్నారు నిపుణులు.

మందు, సిగరెట్లు తాగే అలవాటు ఉంటే క్రమం తప్పకుండా స్క్రీనింగ్ టెస్ట్​లు చేయించుకోవడం ముఖ్యం. పొగతాగేవారికి దగ్గరగా ఉండేవాళ్లు కూడా రెగ్యులర్​గా మెడికల్ టెస్ట్​లు చేయించుకోవాలి. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, హానికరమైన రసాయనాలకు దూరంగా ఉండడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని చెప్తున్నారు. జీవితంలో ఈ మార్పులు ఫాలో అయితే ఆరోగ్యం, భవిష్యత్తు కూడా మెరుగ్గా ఉంటుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Advertisement

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget