అన్వేషించండి

Rotis Cooking: రోటీలు చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించి చూడండి, మెత్తగా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయ్!

రోటీలు చేసుకోవడానికి పిండి కలిపేటప్పుడు పాటించే చిన్న చిన్న చిట్కాలు వాటికి మరింత రుచిని కలిగిస్తాయి.

రోటీ లేదా చపాతీ అనేది భారతీయులు ప్రధానంగా తీసుకునే ఆహారం. దీన్ని పప్పు లేదా కూరలతో తింటూ ఆనందిస్తారు. అయితే రోటీ లేదా చపాతీలు చేయడం అంత సులభమైన విషయం ఏమి కాదు. కొంతమంది చపాతీలు చేశారంటే వాటి షేప్ చూస్తే ఇలా కూడా ఉంటాయా అని డౌట్ వస్తుంది. మరికొందరి చేస్తే గట్టిగా ఉండి వాటిని తినడం అంటే దవడకి మంచి ఎక్స్సర్ సైజ్ ఇచ్చినట్టే అవుతుంది. మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందా? అంటే మీరు పిండిని సరైన పద్ధతిలో కలపడం లేదని అర్థం. ఈ చిట్కాలు పాటించి పిండి కలిపారంటే చపాతీలను జస్ట్ రెండు వేళ్ళతో తుంచుకుని తినేయచ్చు. నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలా మెత్తగా వచ్చేస్తాయి. అందుకు మీరు చేయాలసింది ఈ సాధారణ చిట్కాలు పాటించడమే.

గోరువెచ్చని నీళ్ళు

పిండి కలపడం కూడా ఒక కళ. పిండి కలిపడానికి చల్లటి నీళ్ళు అసలు వాడకూడదు. గోరు వెచ్చని నీటిని ఉపయోగించి పిండి కలిపితే మెత్తగా వస్తాయి. ఇది మృదువైన రోటీలను తయారు చేయడంలో సహాయపడుతుంది. ఒకేసారి నీళ్ళు పొయ్యకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి బాగా కలుపుకోవాలి.

బాగా కలపాలి

పిండిని హడావుడిగా కలపకూడదు. మెల్లగా ఎక్కువ సమయం తీసుకుంటే అన్ని వైపుల నుంచి పిండి లోపలికి వేసుకుంటూ కలుపుకోవాలి. కలిపిన పిండి గట్టిగా ఉండకూడదు. ఉండలు చేసేటప్పుడు అవి గట్టిగా అనిపిస్తే రోటీలు కూడా గట్టిగా ఉంటాయి. అందుకే మెత్తగా కలుపుకోవాలి. ఉండలు చేసేటప్పుడు మృదువుగా ఉండేలా చూసుకోవాలి. చివర్లో కొద్దిగా నూనె వేసి కలుపుకోవడం వల్ల చక్కగా వస్తాయి. ఇది వాటికి మెత్తదనం ఇస్తుంది.

20 నిమిషాలు నానబెట్టాలి

పిండి కలిపిన వెంటనే ఎప్పుడు రోటీలు చేసుకోకూడదు. పిండి పిసికిన తర్వాత ఒక తడి గుడ్డ కప్పి కనీసం 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేస్తే మెత్తగా వస్తాయి. అంతే కాదు పిండి తడి ఆరిపోకుండా కూడా ఉంటుంది.

మళ్ళీ కలుపుకోవాలి

నానబెట్టిన తర్వాత పిండిని మరొక నిమిషం పాటు మెత్తగా కలపాలి. వాటిని కాల్చే విధానం కూడా సరిగా ఉండేలా చూసుకోవాలి. వేదగా ఉన్న తవా మీద వేసుకుని కాల్చుకోవాలి. పిండి కలిపేటప్పుడు కాస్త పాలు కూడా వేసుకోవచ్చు. అది పిండికి మృదువుగా ఉండేలా చేస్తుంది. అవి ఆరిపోయిన తర్వాత కూడా గట్టిగా అవకుండా మెత్తగా ఉంచుతుంది. కొన్ని గంటల తర్వాత వాటిని వేడి చేసుకుని తిన్నా కూడా మెత్తగానే ఉంటాయి. రుద్దుకునేటప్పుడు కొద్దిగా పిండి వేసుకుని అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా రుద్దుకుంటే వాటికి మంచి ఆకృతి కూడా వస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: క్యాలీఫ్లవర్ ఆకులు పడేస్తున్నారా? దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇక మీదట అలా చెయ్యరు

టాప్ హెడ్ లైన్స్

EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget