అన్వేషించండి

Covid 19: కరోనా వల్ల కలిగిన మానసిక సమస్యలు ఈ తరం మొత్తాన్ని వేధించచ్చు, చెబుతున్న కొత్త అధ్యయనం

కరోనా మహమ్మారి కేవలం శారీరకంగానే కాదు మానసికంగా అనేక సమస్యలకు కారణమవుతోందని చెబుతోంది కొత్త అధ్యయనం.

గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా నేటి యువతను ఇప్పట్లో  వదిలేట్టు లేదు. కరోనా మానసికంగా చూపించే ప్రభావాల గురించి ప్రపంచస్థాయి మనస్తత్వవేత్తలు, మనోరోగ వైద్యులు ఎన్నో అధ్యయనాలు, పరిశోధనలు చేస్తున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం కరోనా వైరస్ వచ్చి తగ్గిన వారిలో ఆందోళన, నిరాశ అధికంగా పెరుగుతున్నాయి. న్యూయార్క్‌లో పనిచేస్తున్న సైకియాట్రిస్టు వాలెంటైన్ రైటేరి మాట్లాడుతూ ‘నేను, నా సహోద్యోగులు ఎప్పుడూ ఇంత బిజీగా లేము. కరోనా వచ్చాక మేము చాలా బిజీ అయిపోయాం. కరోనా నుంచి తేరుకున్న చాలా మంది డిప్రెషన్ తో మా దగ్గరికి వస్తున్నారు’ అని చెప్పారు. ది లాన్సెట్ మెడికల్ జర్నల్ లో ప్రచురించిన ఒక కథనంలో 2020లో 204 దేశాల్లో కరోనా నుంచి తేరుకున్న వారిలో మానసిక సమస్యల తీవ్రతపై అధ్యయనం జరిగింది.

షాకింగ్ ఫలితాలు
అధ్యయనంలో షాకింగ్ నిజాలు తెలిశాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా దాదాపు 53 మిలియన్ల మంది తీవ్రమైన డిప్రెసివ్ డిజార్డర్ బారిన పడినట్టు తెలిసింది. 76 మిలియన్ల మంది సాధారణ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. కరోనా వల్ల శారీరకంగా, ఆర్థికంగానే కాదు మానసికంగానూ చాలా తీవ్రంగా నష్టపోయినట్టు అధ్యయన నివేదిక వెల్లడిస్తోంది. ఇప్పటికీ ప్రజలు సామాజిక దగ్గర కాలేకపోతున్నట్టు అధ్యయనం వెల్లడించింది.  సైక్రియాటిస్టు వాలెంటైన్ రైటెరి మాట్లాడుతూ ‘ప్రజల్లో సామాజిక దూరం మనుషుల మధ్యే కాదని మనసుల మధ్య కూడా చాలా పెరిగింది. ఎవరు కనిపించినా  కొద్దిసేపు అలా మాట్లాడి వెళ్లిపోతున్నారు. మనసు విప్పి భావాలు పంచుకోవడం తగ్గింది. ఈ పరిస్థితి మనసుపై, మెదడుపై భారాన్ని పెంచేస్తుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. 

యూకేలోని కన్సల్టెంట్ క్లినికల్ సైకాలజిస్టు అలెక్స్ మాట్లాడుతూ యువతలో గత రెండేళ్లలో చాలా మానసిక మార్పులు వచ్చాయి. ఈ పరిస్థితి ఈ తరం మొత్తాన్ని వేధించొచ్చు. కరోనా వల్ల కలిగి మానసిక ఒత్తిడి పూర్తిగా కనుమరుగవ్వాలంటే కనీసం ఒక తరం (Generation) పడుతుందని, కాబట్టి ఆ తరంలోని యువత ఆ సమస్యలను భరించాల్సిందేనని చెప్పుకొచ్చారు. మరో సైకాలజిస్టు మాట్లాడుతు ‘నేటి యువతరమంతా కోవిడ్ ద్వారా ప్రభావితమైంది. రెండేళ్లు తిష్ట వేసుకుని కూర్చంది ఆ మహమ్మారి. దాని ప్రభావం గట్టిగానే ఉంటుంది’ అని వివరించారు. 

Also Read: మరణం తరువాత జీవితం ఉంటుందా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

Also Read: కన్నబిడ్డను ముట్టుకుంటే అలెర్జీ, ఈ తల్లి పరిస్థితి ఎవరికీ రాకూడదు

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget