అన్వేషించండి

Life Expectancy: ఇప్పుడు మన సగటు ఆయుర్ధాయం 70 ఏళ్లు, కానీ 1947లో ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

మనదేశం ఎన్నో బాధలను ఓర్చి స్వాతంత్య్రాన్ని పొందింది. ప్రస్తుతం బలమైన దేశంగా ఎదుగుతోంది.

ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ ఆర్ధిక రంగంపైనే కాదు ఆరోగ్య రంగంపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఆర్ధికంగా ఎంత బలంగా ఉన్న దేశమైన ఆరోగ్యపరంగా కుదేలైతే ఎకానమీ పరంగా కూడా కూడా వెనకడుగు వేయకతప్పదు. అందుకు ఆరోగ్యవంతమైన ప్రజలను కలిగి ఉన్న దేశమే త్వరగా అభివృద్ధి చెందుతుందని చెబుతారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఆరోగ్య రంగంలో ఎన్నో సవాళ్లను ధీటుగా ఎదుర్కొని ముందుకు సాగింది మనదేశం. ప్రజల సగటు ఆయుర్ధాయాన్ని పెంచేందుకు ఎంతో కృషి చేసింది. ఆ తీయని ఫలితాల్నే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం.

సగటు ఆయుర్ధాయం ఎంత?
1947లో స్వాతంత్య్రం అయితే వచ్చింది కానీ ఆరోగ్యపరంగా మాత్రం భారతీయులు చాలా దీనస్థితిలో ఉన్నారు. వాటిరి సగటు ఆయుర్ధాయం కేవలం 32 ఏళ్లు. అంటే ఆ కాలంలో చాలా మంది బతికిన సగటు వయసు 32 ఏళ్లేనన్నమాట. యుక్త వయసులోనే రకరకాల రోగాల బారిన పడి మరణించేవారు ప్రజలు. దేశం మన చేతికి చిక్కాక నాయకులంతా ఆరోగ్య సంస్కరణలు చేపట్టారు.  వాటి ఫలితంగా ఇప్పుడు మన సగటు ఆయుర్ధాయం 70 ఏళ్లు. ఇది మనదేశ ఆరోగ్య రంగంలో సాధించిన ఘనవిజయంగా చెప్పుకోవచ్చు. 

పోలియో మాయం
లక్షలాది మంది పిల్లల కాళ్లు, చేతులను పనికి రాకుండా చేసిన పోలియో మహమ్మారిని అంతమొందించడం కచ్చితంగా చెప్పుకోవాల్సిన విజయం. మనదేశంలో పోలియో చివరి కేసు 2010లో పశ్చిమబెంగాల్‌లో నమోదైంది. 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పోలియోరహిత దేశంలో భారతదేశాన్ని ప్రకటించింది. 1990ల వరకు పోలియో మనదేశాన్ని వణికించింది. ఇక మశూచిని కూడా కాలగర్భంలో కలిపేశాయి మన ఆరోగ్య సంస్కరణలు. ఈ రెండు మహమ్మారులను అంతం చేసేందుకు వ్యాక్సిన్లు వేయించుకోవాలంటూ గ్రామగ్రామాన ప్రచారాలు చేశారు. వ్యాక్సిన్లు వేసుకుంటే తమకేదో అయిపోతుందని భావించే గ్రామీణ ప్రజలను ఒప్పించడం అప్పట్లో చాలా పెద్ద సమస్యగా మారింది. అయినా పట్టువదలకుండా మన ఆరోగ్య వ్యవస్థ వ్యాక్సిన్లను అందరికీ అందేలా చేసి పోలియో, మశూచి వంటి వాటి అంతానికి పూనుకుంది. 

ప్రసూతి మరణాలు తగ్గాయి
ఐక్యరాజ్యసమితి చెప్పిన ప్రకారం మన దేశంలో శిశు, ప్రసూతి మరణాల రేటు కూడా చాలా తగ్గింది. 2022లో శిశు మరణాల రేటు ప్రతి 1000 జననాల్లో 27.695గా ఉంది. అంటే 1000 మంది జన్మిస్తే వారిలో 27 మంది దాకా పురిట్లోనే మరణిస్తున్నారు. కానీ 1940లలో ఈ పరిస్థితి  మరీ అధ్వానంగా ఉండేది. 2000 మంది జన్మిస్తే వారిలో 1000 శిశువులు మరణించేవారు. ప్రసూతి మరణాలు, శిశు మరణాలు తగ్గించడంలో భారత ఆరోగ్య వ్యవస్థ చాలా ప్రభావవంతంగా పనిచేసింది. 2030 నాటికి లక్ష జననాలకు 70 కంటే తక్కువ మరణాలు నమోదయ్యేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. 

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులతో పాటూ ఎయిడ్స్, క్షయ వంటి అంటువ్యాధులు తగ్గించేందుకు చాలా కష్టపడింది భారత ఆరోగ్య వ్యవస్థ. అంటు వ్యాధుల నివారణకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఒకప్పుడు మలేరియా  బారిన లక్షల మంది పడేవారు. ఇప్పుడు ఆ సంఖ్య వందల్లోనే ఉంది. కుష్టువ్యాధిని కూడా నిర్మూలించే దిశలో చాలా వరకు విజయవంతమయ్యారు. ప్రస్తుతం పదివేల మందిలో నలుగురి నుంచి అయిదు మంది వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఒకప్పటి పరిస్థతితో పోల్చుకుంటే ఇది చాలా మెరుగైన పరిస్థితి. 

Also read: రక్షా బంధనానికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలుగులోనే చెప్పేయండిలా

Also read: ‘పిచ్చెక్కించే తేనే’ దీన్ని తాగితే మామూలుగా ఉండదు, మద్యాన్ని మించిన కిక్కు, అతిగా తాగితే మరణమే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABPMadhavi Latha vs Asaduddin Owaisi |  పాతబస్తీలో కొడితే దేశవ్యాప్తంగా రీసౌండ్ వస్తుందా..? | ABPAllari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Embed widget