అన్వేషించండి

Cancer Detection : ఇంజెక్షన్, రేడియేషన్ లేకుండా క్యాన్సర్ గుర్తింపు.. సరికొత్త సాంకేతికతను తెరపైకి తెచ్చిన తాజా అధ్యయనం

Cancer : కొత్త సాంకేతికతతో ఇంజెక్షన్లు, రేడియేషన్ లేకుండానే క్యాన్సర్ గుర్తించవచ్చని చెప్తోంది తాజా అధ్యయనం. క్యాన్సర్ రోగులకు ఇది మంచి శుభవార్త కానుంది.

New Study on Cancer Detection : క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వారికి ఇప్పుడు ఓ మంచి వార్త వచ్చింది. క్యాన్సర్ పేషెంట్లకు మేలు చేసే విధంగా శాస్త్రవేత్తలు ఒక కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఎలాంటి ఇంజెక్షన్లు వేయాల్సిన అవసరం లేకుండా.. ఎటువంటి రేడియేషన్ కూడా అవసరం లేకుండా క్యాన్సర్ పేషెంట్లకు హెల్ప్ చేసే ఓ కొత్త పద్ధతిని కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ వల్ల క్యాన్సర్ రోగుల ప్రాణాలను కాపాడటమే కాకుండా.. క్యాన్సర్ చికిత్సలో మంచి ఫలితాలు చూడొచ్చు.

ప్రారంభ దశలోనే క్యాన్సర్ గుర్తింపు

బ్రిటన్​లోని రాయల్ మార్స్డెన్ NHS ఫౌండేషన్ ట్రస్ట్, లండన్​లోని క్యాన్సర్ పరిశోధన సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు కలిసి ఒక కొత్త సాంకేతికతను కనుగొన్నారు. ఈ సాంకేతికతలో భాగంగా.. క్యాన్సర్ రోగుల మొత్తం శరీరాన్ని MRI ద్వారా స్కాన్ చేస్తారు. ఈ స్కాన్ ద్వారా MRD అంటే మైలోమా అవశేషాలను కూడా గుర్తిస్తారు. మిగిలిన పరీక్షలన్నీ సాధారణంగా ఉన్నప్పటికీ క్యాన్సర్ గుర్తించడానికి ఇది సాధ్యమవుతుందిన వారు పరిశోధనలో కనుగొన్నారు.

పరిశోధనలో ఏమి జరిగిందంటే..

పరిశోధనలో 70 మంది మైలోమా రోగులను చేర్చారు. వీరికి స్టెమ్ సెల్ మార్పిడి చేశారు. మార్పిడికి ముందు, తరువాత అందరికీ MRI స్కాన్ చేశారు. పరిశోధనలో.. ప్రతి ముగ్గురిలో ఒక రోగికి చికిత్స తర్వాత కూడా క్యాన్సర్ స్వల్పంగా ఉన్నట్లు తేలింది. దీనిని కేవలం ఈ స్కాన్ ద్వారానే గుర్తించారు. అంతేకాకుండా ఈ వ్యాధి స్కాన్​లో కనిపించిన రోగుల మొత్తం మనుగడ రేటు కంటే తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు..

MRI సాంకేతికత ఎందుకు ప్రత్యేకమైనదంటే

ఈ స్కానింగ్ టెక్నిక్ రేడియేషన్ రహితమైనది. దీనిలో భాగంగా ఎలాంటి ఇంజెక్షన్లు లేదా సూది ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే.. ఇది పూర్తిగా సురక్షితం. ముఖ్యంగా ఎక్కువ కాలం పాటు పర్యవేక్షణలో ఉంచబడే రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

రాయల్ మార్స్డెన్ కథ ఏమిటి?

ఈ క్యాన్సర్ స్కాన్​లో పద్ధతి ద్వారా  57 ఏళ్ల క్యాన్సర్​ రోగిని గుర్తించారు. అతని పేరు రాయల్ మార్స్డెన్. అతను మాట్లాడుతూ.. ఈ స్కానింగ్ కారణంగా క్యాన్సర్ సకాలంలో గుర్తించి.. చికిత్స త్వరగా ప్రారంభించినట్లు తెలిపాడు. ఈ సాంకేతికత తన ప్రాణాలను కాపాడటమే కాకుండా.. మళ్లీ ఫైటర్ జెట్లను నడపడానికి, ఆపరేషనల్ డ్యూటీ చేయడానికి కూడా అవకాశం ఇచ్చిందని ఆయన అన్నారు.

శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..

ప్రొఫెసర్ క్రిస్టినా మెసియు మాట్లాడుతూ.. ఈ స్కానింగ్ టెక్నిక్ చికిత్సకు ప్రతిస్పందనను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు. సాంప్రదాయ పరీక్షలలో మిస్ అయ్యే క్యాన్సర్​ను ఇది గుర్తిస్తుందని అన్నారు. అదే సమయంలో ప్రొఫెసర్ మార్టిన్ కైజర్ దీనిని "గోల్డ్ స్టాండర్డ్ ప్రిసిషన్ ఇమేజింగ్" అని పిలిచారు. ఇది మైలోమా చికిత్సకు కొత్త దిశను ఇస్తుందని తెలిపారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget