అన్వేషించండి

Columbia Tragedy: కల్పనా చావ్లా మరణించి నేటికి 19 ఏళ్లు... భూమిపై చెల్లాచెదురుగా పడిన ఆ స్పేస్ షటిల్ ముక్కలు ఇప్పటికీ భద్రం

భారత సంతతి మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా వర్ధంతి నేడే.

ఆకాశం నుంచి భూమిని చూడాలన్న కోరిక ఎంతోమందికి ఉంటుంది. కానీ కొందరే ఆ కలను నిజం చేసుకుంటారు. అంతరిక్షపు అంచులు దాటడమంటే మన ఊరి పొలిమేర దాటినంత సులువు కాదు,  అలా దాటిన వారంతా చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వ్యక్తి  కల్పనా చావ్లా. భారత సంతతికి చెందిన తొలి మహిళా వ్యోమగామి. సరిగ్గా ఇదే రోజున ఆమె ప్రయాణిస్తున్న కొలంబియా స్పేష్ షటిల్ ఆకాశంలోనే పేలిపోయింది. ఆ ఘటనలో ఆమెతో పాటూ మరో ఆరుగురు మరణించారు. ఈ సంఘటన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు ఎన్నో పాఠాలు నేర్పింది. 

రెండో ప్రయాణంలో అలా...
కల్పనా చావ్లా పుట్టి పెరిగింది హర్యానాలోని కర్నాల్‌లో. చదువంతా ఇండియాలోనే సాగింది. 1982లో ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఉన్నత చదువుల కోసం టెక్సాస్ యూనివర్సిటీలో చేరారు కల్పనా. అక్కడే 1988లో ఏర్ స్పేస్ ఇంజినీరింగ్‌లో డాక్టరేట్ పొందారు. అమెరికా పౌరసత్వాన్ని అందుకున్నాక నాసా రీసెర్చ్ సెంటర్లో పనిచేయడం మొదలుపెట్టారు. 1994లో తొలిసారి అంతరిక్షయానం కోసం ఆమెను ఎంపికచేశారు. శిక్షణ పూర్తయ్యాక మొదటిసారి 1997లో అంతరిక్ష యాత్ర పూర్తి చేశారు. తిరిగి భూమికి క్షేమంగా చేరుకున్నారు. రెండో సారి 2003లో కొలంబియా స్పేస్ షటిల్‌లో అంతరిక్షం చేరారు. తిరిగి ప్రయాణంలో టెక్సాస్ స్పేస్ సెంటర్‌లో అంతరిక్ష నౌక దిగాల్సి ఉండగా, నిర్దేశించని సమయం కన్నా 16 నిమిషాల ముందే కొలంబియా షటిల్ భూమిని చేరే క్రమంలో పేలిపోయింది.  ఈ ఘటన సరిగ్గా 2003, ఫిబ్రవరి 1 రాత్రి  ఏడున్నర గంటల సమయంలో సంభవించింది. జనవరి 16, 2003న ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన కొలంబియా నౌక పదిహేను రోజుల తరువాత తిరుగుప్రయాణంలో ముక్కలుముక్కలుగా చిధ్రం కావడం అంతరిక్షచరిత్రలోనే అత్యంత బాధకర సంఘటనగా మిగిలిపోయింది. Columbia Tragedy: కల్పనా చావ్లా మరణించి నేటికి 19 ఏళ్లు... భూమిపై చెల్లాచెదురుగా పడిన ఆ స్పేస్ షటిల్ ముక్కలు ఇప్పటికీ భద్రం

ముక్కలు ముక్కలుగా...
కొలంబియా అంతరిక్ష నౌక ఇలా పేలిపోవడానికి కారణమేంటో తెలుసుకునేందుకు విచారణ కమిటీని వేశారు. వారు ఏడునెలల పాటూ కష్టపడి చెల్లాచెదురుగా పడిన అంతరిక్ష నౌక ముక్కలను ఏరారు. వందల మైళ్ల పొడవునా టెక్సాస్, లూసియానా, అర్కన్సస్ ప్రాంతాల్లో ఆ ముక్కలు దొరికాయి. దాదాపు 84000 ముక్కలను ఏరి కెన్నడీ స్పేస్ సెంటర్లో భద్రపరిచారు. అంతేకాదు ఆ ప్రమాదంలో చనిపోయిన వారి జ్ఞాపకార్థం  టెక్సాస్‌లో ‘రిమెంబరింగ్ కొలంబియా’పేరుతో చిన్న మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు. 

Columbia Tragedy: కల్పనా చావ్లా మరణించి నేటికి 19 ఏళ్లు... భూమిపై చెల్లాచెదురుగా పడిన ఆ స్పేస్ షటిల్ ముక్కలు ఇప్పటికీ భద్రం

ఘటన జరిగిన అయిదేళ్ల తరువాత 2008లో నాసా ఓ నివేదికను విడుదల చేసింది. వ్యోమగాములు క్యాబిన్లో ఉన్నప్పుడు అక్కడ పూర్తిగా ఒత్తిడి కోల్పోవడం వల్ల వారు కొన్ని సెకన్లలోనే స్పృహ కోల్పోయినట్టు ఆ నివేదిక చెప్పింది. తరువాత షటిల్ పేలిపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయినట్టు వివరించింది.  ఏడుగురిలో అయిదుగురి ముక్కలైన శరీర అవశేషాలను మూడు రోజుల్లోనే గుర్తించారు. మిగతా ఇద్దరికి కనిపెట్టడానికి పదిరోజులు పట్టింది.  గౌరవప్రదంగా వారికి అంత్యక్రియలు నిర్వహించారు. Columbia Tragedy: కల్పనా చావ్లా మరణించి నేటికి 19 ఏళ్లు... భూమిపై చెల్లాచెదురుగా పడిన ఆ స్పేస్ షటిల్ ముక్కలు ఇప్పటికీ భద్రం

ఏంటి కారణం?
కొలంబియా అంతరిక్ష నౌక పేలడానికి కారణం కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కొలంబియా నౌక రెక్కలలో ఒకదానిపై ఒక రంధ్రం పడిందని, దాన్ని పంక్చర్ చేశారని ఇన్వెస్టిగేషన్ బోర్డు చెప్పింది. అది కార్బన్ మిశ్రమంతో తయారైందని, 16 రోజుల క్రితం ప్రయోగసమయంలోనే ఈ రంధ్ర ఏర్పడిందని నిర్ధారించారు. అయితే తిరిగి భూమిని చేరే క్రమంంలో తీవ్రమైన ఒత్తిడి వల్ల వేడి వాయువులు ఆ రెక్క రంధ్రం నుంచి లోపలికి చొచ్చుకుని వెళ్లి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. లోపల ఉన్న హైడ్రాలిక్ వ్యవస్థ నాశనం కావడం వల్ల చివరికి నియంత్రణ కోల్పోయి నౌక పేలిపోయి ఉంటుందని అంచనా వేశారు. 

ఈ ఘటన జరిగిన రెండేళ్ల వరకు ఎలాంటి అంతరిక్ష ప్రయాణాలు, ప్రయోగాలు చేపట్టలేదు నాసా. తగిన జాగ్రత్తలపైనే శ్రద్ధ పెట్టింది. 

Also read: షాకింగ్... నలుపుగా ఉన్న వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ, చెబుతున్న కొత్త అధ్యయనం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
Raj Tarun Case: రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
TGTET: 'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
Embed widget