అన్వేషించండి

Swallowing Mucus: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?

గొంతులో కిచ్‌కిచలాడే.. శ్లేష్మాన్ని నోట్లోకి తెచ్చుకుని మళ్లీ మింగేస్తున్నారా? అయితే, మీరు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.

ఛాతిలో కఫం లేదా శ్లేష్మం పట్టిందంటే తప్పకుండా జ్వరం వస్తుంది. ఒక వేళ జ్వరం రాకపోయినా.. అది మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది. కొందరికి కఫం వల్ల దగ్గు కూడా విపరీతంగా వస్తుంది. మరికొందరు.. మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడతారు. కొందరికి ఛాతి భారంగా ఉంటుంది. ఆ కఫాన్ని గొంతులోకి తెచ్చుకుని బయటకు ఊసేస్తే పర్వాలేదు. కానీ, దాన్ని చాలామంది నోట్లోకి వచ్చిన తర్వాత మింగేస్తుంటారు. అలా చేయడం చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ కఫం అంటే ఏమిటీ? అది ఎలా ఏర్పడుతుంది? అది ఎందుకంత ప్రమాదకరం? 

కఫం అంటే?: కఫం అనేది శ్వాసకోశ మార్గాల శ్లేష్మ స్రావం. శ్లేష్మంలో 95% నీరు, 3% మ్యూకిన్-యాంటీబాడీస్‌తో వంటి ప్రోటీన్లు, 1% ఉప్పు తదితరాలు ఉంటాయి. మ్యూకిన్ బిందువులు నీటిని గ్రహిస్తాయి. అది శ్లేష్మ గ్రంథుల నుంచి విడుదలైన మూడు సెకన్లలో వందల రెట్లు ఉబ్బుతాయి. శ్లేష్మ తంతువులు క్రాస్ లింక్‌లను ఏర్పాటు చేయడం వల్ల కఫం సాగే జెల్‌గా మారుతుంది. అందుకే అది కఫం అంత చిక్కగా జిగటలా కనిపిస్తుంది.  

మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు.. మీ కఫం పలుచగా, నీరులా ఉంటుంది. రోజూ మీకు తెలియకుండానే 1.5 లీటర్ల కఫాన్ని మింగేస్తారు. మీకు జలుబు లేదా ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉన్నా, లేదా స్మోకింగ్ అలవాటు ఉన్నా.. మీ కఫం చిక్కగా, ముదురు రంగులో ఉండవచ్చు. బ్యాక్టీరియా, వైరస్‌లు, తెల్ల రక్త కణాల, యాంటీబాడీల వల్ల కఫం అలా మారుతుంది. అయితే, శ్లేష్మాన్ని మింగడం మంచిదా? కాదా అనే సందేహంపై భిన్న వాదనలు ఉన్నాయి.

శ్లేష్మం ఏం చేస్తుంది?: శ్లేష్మం ఒక్కోసారి మేలు కూడా చేస్తుంది. అది లైంగిక అవయవాలు, ప్రేగులతో సహా మన అంతర్గత అవయవాలను రక్షిస్తుంది. కానీ, ఊపిరితీత్తుల్లోని వాయు మార్గానికి మాత్రం ఇది సమస్యాత్మకమే. ఎందుకంటే.. మన ముక్కులోని రెండు నాసిక కుహరాలు కలిపి 150 చదరపు సెంటీమీటర్లు ఉంటాయి. వాటి గోడలపై మడతలు ఉంటాయి. మనం పీల్చే గాలిలో 80 శాతం మలినాలు ఇక్కడే పిల్టర్ అవుతాయి. గోడలపై వెంటుకల తరహాలో ఉండే సిలియా మలినాలను అడ్డుకుంటుంది. శ్లేష్మాన్ని క్లియర్ చేస్తుంటుంది. కాబట్టి, ప్రమాదకర దుమ్మూ, దూళి శ్లేష్మానికి అంటుకోవు. శ్లేష్మం నిరంతరం ఉత్పత్తి అవుతుంది. నిద్రలో తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతుంది. శ్లేష్మంలో మృతకణాలు, దుమ్ము, శిధిలాలు ఉంటాయి. అది కడుపులోకి వెళ్లిన తర్వాత రీసైక్లింగ్ అవుతుంది. ముక్కు రోజుకు 100 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఊపిరితిత్తులు రోజుకు దాదాపు 50 మిల్లీలీటర్ల కఫాన్ని ఉత్పత్తి చేస్తాయి.

కఫం పడితే.. జ్వరం, దగ్గు ఎందుకు వస్తాయి?: శ్లేష్మంలో తెల్ల రక్త కణాలు, యాంటీబాడీలు ఉంటాయి. ఇన్ఫెక్షన్, చికాకులు లేదా అలెర్జీ కారకాలను తొలగించడానికి శ్లేష్మం పెరుగుతుంది. అయితే, కొన్ని వైరస్‌లు సిలియాను కూడా దెబ్బతీస్తాయి. దానివల్ల శ్లేష్మం ముదురుతుంది. దాని వల్ల దగ్గు, తుమ్ములు, ముక్కు కారడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కొందరిలో జ్వరం కూడా ఏర్పడుతుంది. క్రానిక్ బ్రోన్కైటిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారిలో శ్లేష్మ గ్రంథులు సాధారణ స్థాయిల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు కఫాన్ని ఉత్పత్తి చేస్తాయి. దాన్ని సిలియా సులభంగా క్లీన్ చేయలేదు. దగ్గు వల్ల సిలియా అలసిపోతుంది. దానివల్ల అది శ్లేష్మాన్ని నెమ్మదిగా కదిలిస్తుంది. ఫలితంగా శ్లేష్మం మరింత జిగటగా మారుతుంది. అందుకే చాలామందికి జలుబు, గవత జ్వరం వస్తాయి. అయితే, శ్లేష్మం ఏర్పడినప్పుడు ఉప్పు ద్రవణాన్ని తీసుకుంటే ఫలితం ఉంటుందని తేలింది. కానీ, బీపీ, డయాబెటిస్ ఇతరాత్ర వ్యాధులు ఉన్నవారు.. వైద్యుడి సూచనలు లేకుండా ఉప్పు నీటిని తాగరాదు. 

శ్లేష్మాన్ని మింగితే ఏమవుతుంది?: కఫంలో బ్యాక్టీరియా ఉంటుందని, మింగడం వల్ల అది శరీరం మొత్తం పాకేస్తుందని భావిస్తారు. అలాగే, మన ఊపిరితీత్తుల్లో కఫాన్ని మరింత పెంచేస్తుందని అంటున్నారు. అయితే, నిపుణులు దీనిపై స్పందిస్తూ.. కఫం విషపూరితం కాదని, మింగడం వల్ల ఎలాంటి హాని కలగదని తెలిపారు. కడుపులోకి వెళ్లిన కఫాన్ని శక్తివంతమైన యాసిడ్‌లు, ఎంజైమ్‌లు నాశనం చేస్తాయి. కాబట్టి, అందులోని బ్యాక్టీరియా ఇతర శరీర భాగాలకు చేరడం అసాధ్యం. 

ఛాతిలో భారం, దగ్గు: ఛాతిలో భారంగా ఉండి, దగ్గు వస్తున్నట్లయితే.. అది చాతి ఇన్ఫెక్షన్‌కు సంకేతం. గొంతులోని కఫం ఊపిరితిత్తుల నుంచి పుట్టిందా? లేదా నాసికా కుహరం వెనుక నుంచి అక్కడికి జారిందా? అనేది నిర్ధారించడం చాలా కష్టం. గొంతులో కిచకిచలాడే శ్లేష్మం ఎక్కడ నుండి వచ్చినా ఛాతీలో ఉన్నట్లే అనిపిస్తుంది. అయితే, దగ్గు వల్ల సమస్య ఏమిటనేది స్పష్టంగా తెలుసుకోవచ్చట. 

ఆకుపచ్చ కఫం: ఆకుపచ్చ శ్లేష్మం బ్యాక్టీరియా సంక్రమణను సూచిస్తుంది. దీనికి యాంటీబయాటిక్ చికిత్స అవసరం. శ్లేష్మం ఇంకా పసుపు పచ్చ, నారింజ, గోదుమ, బూడిద రంగుల్లో కూడా ఉంటుంది. ఆ రంగును బట్టి కూడా వైద్యులు మందులను సూచిస్తుంటారు. 

పాలు తాగితే కఫం?: చాలా మంది పాలు, పాల ఉత్పత్తులు అదనపు శ్లేష్మానికి కారణమవుతాయని నమ్ముతారు. కాబట్టి గవత జ్వరం, ఆస్తమా ఉన్నవారు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటం మంచిది. 

Also Read: వృద్ధుడి వృషణాల నుంచి విజిల్స్, కారణం తెలిసి షాకైన డాక్టర్లు!
Also Read: పావురాలతో శ్వాసకోశ సమస్యలు? వాటితో ఎలాంటి సమస్యలు వస్తాయి?

గమనిక: వివిధ అధ్యయనాలు, వైద్య నిపుణులు, హెల్త్ ఆర్టికల్స్ నుంచి గ్రహించిన కొన్ని వివరాలను మీ అవగాహన కోసం యథావిధిగా అందించాం. ఇది చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్య ఉన్న మీరు డాక్టర్ సలహా, సూచనలు తీసుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Old Pillow : దిండును ఎన్ని రోజులకు మార్చాలి? పాత దిండును ఎక్కువ కాలం వాడితే కలిగే నష్టాలు ఇవే
దిండును ఎన్ని రోజులకు మార్చాలి? పాత దిండును ఎక్కువ కాలం వాడితే కలిగే నష్టాలు ఇవే
Lychee Health Benefits : వేసవిలో లిచీలు తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు.. కానీ ఆ సమస్య ఉంటే తినకపోవడమే మంచిది
వేసవిలో లిచీలు తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు.. కానీ ఆ సమస్య ఉంటే తినకపోవడమే మంచిది
Online Scams : ఆన్​లైన్​ మోసాల నుంచి తప్పించుకోవాలంటే.. ఈ 5 టిప్స్ గుర్తుంచుకోండి, లేకపోతే భారీ నష్టం తప్పదు
ఆన్​లైన్​ మోసాల నుంచి తప్పించుకోవాలంటే.. ఈ 5 టిప్స్ గుర్తుంచుకోండి, లేకపోతే భారీ నష్టం తప్పదు
Keep Pigeons Away from Your Balcony : పావురాలు ఇంట్లో గూళ్లు కడుతున్నాయా? బాల్కనీ, విండోస్ దగ్గర ఇలా చేస్తే ఎలాంటి బెడదా ఉండదు
పావురాలు ఇంట్లో గూళ్లు కడుతున్నాయా? బాల్కనీ, విండోస్ దగ్గర ఇలా చేస్తే ఎలాంటి బెడదా ఉండదు

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget