అన్వేషించండి

Cows Milk: ఆవు ఆకుపచ్చని గడ్డి తింటే పాలు మాత్రం తెల్లగా ఉంటాయి ఎందుకు?

ఎంతోమందికి ఉన్న సందేహం ఇది. పాలు తెలుపు రంగులో ఎందుకు ఉంటాయి? అని.

ప్రపంచంలో కొన్ని ప్రశ్నలు వినోదభరింగా అనిపించవచ్చు, కానీ దానికి సైన్స్ కచ్చితంగా ఒక జవాబును కనిపెట్టే ఉంటుంది. అలాంటి వాటిల్లో ఒకటి... ఆవు ఆకుపచ్చని గడ్డి తింటే పాలు తెల్లగా ఉంటాయి ఎందుకు? అనేది. ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగించే పానీయాలలో పాలు ఒకటి. ఇది గొప్ప పోషక విలువలను కలిగి ఉంటుంది. చాలా వంటల్లో దీన్ని ఉపయోగిస్తారు. ప్రపంచంలోని ప్రతి ఇంట్లో రోజు వాడే ఆహారంలో పాలు ఒకటి. అయితే ఈ పాలను అందించే గేదెలు, ఆవులు పసుపుగా ఉండే గడ్డి లేదా ఆకుపచ్చని గడ్డిని తింటాయి. అలా తింటున్నప్పుడు పాలు పసుపు రంగులో లేదా ఆకుపచ్చ రంగులో రావాలి. కానీ తెల్లగా ఉంటాయి. దీనికి సైన్స్ వివరణాత్మకమైన జవాబును అందించింది.

ఆవు పొట్టలో పాలు ప్రధానంగా నీటితోనే తయారవుతాయి. పాల రకాన్ని బట్టి కొవ్వు, ప్రోటీన్, చక్కెర వంటివి ఉంటాయి. పాలల్లో ఉండే ప్రోటీన్లలో ముఖ్యమైనది కేసైన్. ఆవు పాలలో 80 శాతం కేసైన్ ఉంటుంది. ఇది ఒక ఫాస్పో ప్రొటీన్. దీనిలో భాస్వరం అణువులు ఉంటాయి. ఈ ప్రొటీన్ తెలుగు రంగులో ఉంటాయి. ఈ భాస్వరం అణువులు పాలల్లో మైకెల్స్ అని పిలిచే చిన్న అణువుల సమూహాలు ఏర్పడడానికి సహకరిస్తాయి. పాలపై కాంతి పడినప్పుడు సహజంగానే తెలుపు రంగులో ఉండే కేసైన్ అణువులు చెల్లాచెదురుగా అవుతాయి. అవి పాలల్లో 80 శాతం ఉంటాయి కాబట్టి వాటి తెలుపు రంగునే పాలు కూడా ప్రతిబింబిస్తుంది. పాలల్లో నీరు కలిసినప్పుడు పాలు దాని రంగును కోల్పోవడం మొదలుపెడుతుంది. ఎందుకంటే పాలల్లో ఉండే కేసైన్ రేణువులు తగ్గిపోతూ ఉంటాయి. అందుకే నీళ్ల పాలు పలచగా ఉంటాయి. నీళ్ల కలపని పాలు కేసైన్‌‌‌లతో నిండుగా ఉండి తెల్లగా ఉంటాయి. 

ప్రతిరోజూ పిల్లలు, పెద్దలు పాలు తాగితే ఎంతో బలం. మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు నిండుగా ఉంటాయి. పాలల్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. పాలు రోజూ గ్లాసుడు తాగితే ఎలాంటి ప్రొటీన్ లోపం లేకుండా శరీరం బలంగా మారుతుంది. నిద్ర పోవడానికి పాలు సహకరిస్తాయి. నిద్రలేమి సమస్య ఉన్న వారు రోజూ రాత్రి పాలు తాగితే మంచిది. మానసిక సమస్యలు ఉన్న వారు పాలు తాగితే మంచిది. ఇది డోపమైన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవడానికి సహకరిస్తుంది. ఇది ఉత్పత్తి అయితే మెదడు ప్రశాంతంగా ఉంచుతుంది. 

రోగనిరోధక శక్తిని పెంచేందుకు పాలు ఎంతో సహకరిస్తాయి. పాలల్లో కాస్త పసుపు కలిపి తాగితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. వేడి వేడి పాలు తాగడం వల్ల గొంతునొప్పి తగ్గుతుంది. 

Also read: నా భార్య రోజంతా టీవీ చూస్తూ నా చేతే పనులు చేయిస్తోంది, నాకేమో చెప్పే ధైర్యం లేదు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Election 2025:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
Advertisement

వీడియోలు

Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Zohran Mamdani won Newyork Mayor Election |  న్యూయార్క్ మేయర్ గా గెలిచిన జోహ్రాన్ మమ్ దానీ | ABP Desam
పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Election 2025:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
YSRCP Leader Roja: తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
Mexican president kiss: మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
India Test Team Against South Africa : దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
Embed widget