అన్వేషించండి

Subhash ChandraBose: మీలో ఎంతమందికి తెలుసు నేతాజీ ఒక ఐఏఎస్ ఉద్యోగి అని? ఉద్యమం కోసం ఉద్యోగాన్ని వదిలేసిన మహానేత

స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి నేడు.

‘మీ రక్తాన్ని ధారపోయండి... మీకు స్వాతంత్య్రాన్ని తెచ్చిస్తాను’జులై 4, 1944లో బర్మాలోని భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో సుభాష్ చంద్రబోస్ చేసిన ఉత్తేజపూరిత వ్యాఖ్యలు ఇవి. వీటిని ఇప్పటికీ ఏ భారతీయుడు మర్చిపోలేడు. అతని జీవితమే కాదు మరణమూ వివాదాస్పదమే... ఇప్పటికీ అంతుపట్టని రహస్యమే. 

అహింసా మార్గాన్నే ఎంచుకున్న గాంధీతో విబేధాలు రావడానికి ఇలాంటి వ్యాఖ్యలే కారణమన్నవాళ్లు ఉన్నారు.  స్వాతంత్య్రం కేవలం ఆయుధంతోనే సాధ్యమవుతుందని నమ్మిన వ్యక్తి బోస్. కానీ గాంధీ రక్తపాతానికి వ్యతిరేకం. ఎదుటివాడు తుపాకులతో కాలుస్తుంటే చేతిలో ఆయుధం లేకుండా వారిని ఎదుర్కోవడం సాధ్యం కాదని, మనం కూడా సాయుధులం అవ్వాల్సిందేనని భావించాడు బోస్. అందుకే గాంధీని వీడి సొంత కుంపటి పెట్టారు. జర్మనీ, జపాన్ దేశాలతో స్నేహం కోపం తపించారు. జపాన్ అందించిన సాయంతో భారత యుద్ధ ఖైదీలు, ఉద్యమకారులు, తన అనుచరులు, రబ్బరు తోటల్లో పనిచేసే భారతీయ కూలీలతో సైన్యాన్ని ఏర్పాటుచేశారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలోనే తన సైన్యాన్ని సిద్ధం చేశాడు బోస్. సింగపూర్లో ఉండి ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేశాడు. ఈ పరిణామాలన్నీ భారత్ దేశానికి చెందిన కొంతమంది ఉద్యమనాయకుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. అయినా వెనక్కి తగ్గలేదు.  

ధనవంతుల బిడ్డ...
బోసు ఒడిశాలోని కటక్ పట్టణంలో 1897లో జన్మించారు. ఆయన చాలా ధనిక కుటుంబంలో పుట్టారు.  తండ్రి జానకీనాథ్ బోస్ లాయరు.  తల్లి ప్రభావతి. బిడ్డను అల్లారుముద్దుగా పెంచారు. దేనికీ లోటు లేదు. తండ్రి తరపు ఆస్తులు ఎక్కువే. అయినా బోస్ సోమరిగా ఇంట్లో కూర్చోలేదు. చదువులో చాలా చురుకుగా ఉండేవాడు బోస్. విద్యాభ్యాసం కటక్, కోల్‌కతాలలో సాగింది. 

సివిల్ సర్వెంట్ ఉద్యోగాన్ని వదిలి...
‘ఇండియన్ సివిల్ సర్వీసెస్’ పేరుతో ఇంగ్లాండులో పరీక్షలను నిర్వహించేంది బ్రిటిస్ ప్రభుత్వం. బోస్ అక్కడికి వెళ్లి పరీక్ష రాసి నాలుగో స్థానంలో నిలిచారు. ఏడాది పాటూ ఉద్యోగం చేశాక 1921 ఏప్రిల్ లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. దానికి కారణం స్వాతంత్య్ర కాంక్ష.  ఉద్యోగాన్ని వదిలేశాక తన అన్నకు లేఖ రాశారు బోస్... అందులో ‘త్యాగం, బాధ నిండిన నేలపై మాత్రమే మనం జాతీయ ప్రేమను పెంచుకోగలం’ అని రాశాడు. దీన్ని బట్టి ఆయనకు ఇంగ్లాండుపై ప్రేమలేదని, తన స్వదేశంపైనే ప్రేమ ఉందని చెప్పకనే చెప్పాడు. 

మరణం ఇప్పటికీ వివాదాస్పదం...
తాను కాంక్షించిన స్వాతంత్య్రాన్ని కళ్లారా చూడకుండానే 1945 ఆగస్టు 18న విమానప్రమాదంలో మరణించినట్టు వార్తలు వచ్చాయి. ఈ ప్రమాదం తైవాన్లో జరిగింది. అయితే అతను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని, కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్నాడని అంటారు. విమాన ప్రమాదంలో ఆయన పార్థివదేహం తాలూకు ఆనవాళ్లు కూడా దొరకలేదు. మరో కథనం ప్రకారం బోస్ సోవియట్ యూనియన్ వారికి బందీగా చిక్కారని సైబీరియా జైల్లోనే మరణించారని అంటారు. దీనిపై కూడా భారత ప్రభుత్వం చాలా కమిటీలు వేసింది. అదెంత వరకు నిజమో ఇంతవరకు ఎవరూ తేల్చలేకపోయారు. కానీ ఎక్కువ మంది నమ్మకం మాత్రం ఆ ప్రమాదంలో బోసు మరణించారనే. 

అయోధ్యలో సన్యాసిగా...
అయోధ్యలోని ఫైజాబాద్ లో 1985లో ఓ సన్యాసి తన పేరు బోసుగా చెప్పుకున్నాడని అతడే నేతాజీ అని నమ్మిన వాళ్లు ఉన్నారు. దాన్ని తేల్చేందుకు కమిషన్ వేసింది ప్రభుత్వం. అది కూడా తప్పని తేలింది. 

Also read: ప్లేటులో బాతు మెడ వంటకం... ఎలా తినాలంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు, లండన్ రెస్టారెంట్ చెత్త ప్రయోగం

Also read: ఎత్తుతోనే ఆత్మవిశ్వాసం... మంచి ఎత్తు పెరగాలంటే పిల్లలకు పెట్టాల్సిన ఆహారాలు ఇవే

Also read: రోజుకు రెండు స్పూన్ల పంచదార తింటే చాలు... భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాల చిట్టా ఇదిగో

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget