అన్వేషించండి

Brain Eating Amoeba: స్విమ్మింగ్ పూల్‌లో దిగుతున్నారా? జాగ్రత్త, మెదడు తినే అమీబాలు ఉంటాయి

స్విమ్మింగ్ పూల్‌లో కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు ఎన్నో ఉంటాయి.

Brain Eating Amoeba: అమెరికాలోని రెండేళ్ల బాలుడు ఏడు రోజులపాటు మెదడు తినే అమీబాతో ఇబ్బంది పడ్డాడు. అది అతడి ప్రాణాలనే తీసింది. ఇలాంటి మెదడు తినే అమీబాలను నేగ్లేరియా ఫౌలేరి అంటారు. ఇది సాధారణంగా కలుషితమైన చెరువులు, మంచినీటి సరస్సులు, నదులు, కలుషితమైన స్విమ్మింగ్ పూల్ వంటి వాటిలో ఉంటాయి. ఈ అమీబాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. కేవలం మైక్రోస్కోప్‌తో మాత్రమే ఇవి కనిపిస్తాయి.

అమీబాలాంటి సూక్ష్మ క్రిములు నీటితో పాటూ ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈత కొట్టడం, డైవింగ్ చేయడం వంటి సమయాల్లో ఈ అమీబాలు ముక్కు నుంచి మెదడుకు చేరుతాయి. అక్కడ మెదడు కణజాలాన్ని నాశనం చేస్తాయి. దీనివల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ వస్తుంది. మెదడు తినే అమీబాలను 1965లో కనిపెట్టారు. ఇవి మంచినీటి వనరుల్లోనే ఉంటాయని చెబుతారు. శుద్ధి చేయని, కలుషితమైన నీటిలో ఇవి అధికంగా ఉంటాయి. కాబట్టి కలుషితమైన లేదా శుద్ధి చేయని స్విమ్మింగ్ పూల్స్ ఉంటే వాటిలో దిగకండి. ఇలాంటి అమీబాలు మెదడులో చేరి అరుదైన ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. చివరకు మెదడులోని కణజాలాన్ని తినేస్తాయి.

ఇవి మెదడులో చేరితే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి వస్తుంది. మెడ గట్టిగా మారిపోతుంది. ఆకలి వేయదు. మూర్ఛలు వస్తూ పోతుంటాయి. జ్వరం పెరుగుతుంది. వికారంగా అనిపిస్తుంది. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం, అస్పష్టంగా దృష్టి కనిపించడం, రుచి తెలియకపోవడం కూడా జరగవచ్చు. ఇది ఒకసారి మెదడులో చేరితే ఆ వ్యక్తిని కాపాడుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇలాంటి సమస్యలకు చికిత్సలు ఎలా చేయాలో ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి స్విమ్మింగ్ పూల్స్ కనిపించగానే దూకేయకండి. ఆ నీటిని ఎన్ని రోజుల నుంచి స్టోర్ చేశారో, ఎప్పుడు మార్చారో వంటి విషయాలు తెలుసుకోండి. లేకుంటే ఇలాంటి అమీబాలు మెదడులో చేరే అవకాశం ఉంది.

మనదేశంలో కూడా ఈ మెదడు తినే అమీబా కారణంగా ఒక టీనేజర్ మరణించాడు. కేరళలో వాగులో ఈతకొట్టిన పదిహేనేళ్ల బాలుడికి ఈ అమీబా సోకింది. అది శరీరంలో చేరిన కాసేపటికి ఆ పిల్లాడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.  సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లినా కూడా లాభం లేకపోయింది. అరుదైన మెదడు వ్యాధితో అతను మరణించినట్టు చెప్పారు వైద్యులు. మెదడు తినే అమీబా చాలా ప్రమాకరమైనది. దీని వల్ల మరణించే రేటు 97 శాతం. అంటే ఈ అమీబా సోకాక జీవించే అవకాశం కేవలం 3 శాతమేనన్న మాట. 

Also read: వానాకాలంలో జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే ఆయుర్వేదం చెబుతున్న ఈ రసాన్ని వండుకోండి

Also read: గేమింగ్ డిజార్డర్ ఉందా? అయితే జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది జాగ్రత్త

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fine Rice Price Down: సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
Fine Rice Price Down: సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
Supreme Court Serious: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
BYD Plant In Telangana: తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Shreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP DesamShreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP DesamShashank Singh on Shreyas Iyer 97 Runs | GT vs PBKS మ్యాచ్ లో అయ్యర్ బ్యాటింగ్ పై శశాంక్ ప్రశంసలుShreyas Iyer 97 Runs vs GT IPL 2025 | గుజరాత్ బౌలర్లను చెండాడిన శ్రేయస్ అయ్యర్ | GT vs PBKS | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fine Rice Price Down: సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
Fine Rice Price Down: సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
Supreme Court Serious: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
BYD Plant In Telangana: తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
Telangana Latest News:ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
Jr NTR: ఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!
ఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!
Property Tax: ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
CM Chandrababu: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Embed widget