అన్వేషించండి

ఆత్రుత ఎక్కువ పడుతున్నారా? ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం

ఆత్రుత పడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

కొంతమందికి ఆత్రుత ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారు. తెలుసుకున్న ఆ విషయం పై చర్చ పెడతారు. ఎవరైనా తమతో విభేదిస్తే గట్టిగా మాట్లాడతారు. త్వరగా చిరాకు పడతారు. అవసరానికి మించి ఆందోళన పడుతుంటారు. వీళ్ళకి ఆత్రుత ఎక్కువ అంటూ ఉంటారు. సాధారణ మనుషులతో పోలిస్తే వీరికి ఉత్సాహం, ఆత్రుత, ఒత్తిడి కూడా ఎక్కువే. అయితే ఇలా ప్రతి విషయానికీ ఆత్రుత పడడం అనేది అంత ఆరోగ్యకరం కాదు అని చెబుతోంది ఒక అధ్యయనం. ఇలా ప్రతిదానికి ఆత్రుత పడే వారి కంటే నెమ్మదిగా పనులు చేసే వారే ఆరోగ్యంగా ఉంటారని వివరిస్తుంది ఈ అధ్యయనం. వన్ పోల్ అనే సంస్థ 2000 మందిపై ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఆత్రుత అధికంగా పడడం వల్ల వారిలో చిరాకు, కోపం వంటి భావోద్వేగాలు అధికంగా వస్తున్నాయని ఈ అధ్యయనం తేల్చింది. 

ఇలా చిరాకు, కోపం తరచూ వస్తూ ఉంటే మానసిక ఆందోళన బారిన పడే అవకాశం పెరుగుతుంది. ఎప్పుడైతే మానసిక ఆందోళన మొదలవుతుందో ఆ పరిస్థితిని తట్టుకునేందుకు మెదడు అడ్రినలిన్,  కార్టిసాల్ వంటి హార్మోన్లను ఉత్పత్తిని పెంచేస్తుంది. అలాగే హృదయ స్పందనను కూడా పెంచుతుంది. దీనివల్ల బీపీ ఎక్కువ అయిపోతుంది. శ్వాస కూడా అధికంగా తీసుకుంటారు. ఇలా తరుచూ జరిగితే ఇతర అనారోగ్యాలు వచ్చే అవకాశం పెరిగిపోతుంది.

కాబట్టి ఆత్రుత పడడం అనేది సాధారణ లక్షణంగా భావించవద్దు. మీకు మీలో ఆత్రుత లక్షణాలు కనిపిస్తే మానసిక వైద్యులను కలవడానికి ప్రయత్నించండి. ఈ ఆత్రుత... మానసిక రోగాలకు కారణం అవుతుంది. అధ్యయనంలో భాగంగా 2000 మందిని రెండు భాగాలుగా విభజించారు పరిశోధనకర్తలు. వీరిలో ఆత్రుత, ఆందోళన, కోపం, చిరాకు వంటి వాటిని అధికంగా పడే వారిని ఒక గ్రూపులో ఉంచారు. పెద్దగా మాట్లాడని వారు, నెమ్మదిగా ఉండేవారు, ఎక్కువగా వినడానికి ఇష్టపడేవారిని మరొక గ్రూపులో ఉంచారు. ఈ రెండు గ్రూపుల వారిని పరిశోధించగా ఎక్కువగా ఆత్రుత పడే వారితో పోలిస్తే, తక్కువగా మాట్లాడే వారిలో 32 శాతం తీవ్రమైన మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం తక్కువగా ఉన్నట్టు తేలింది. 

తరచూ మానసిక ఆందోళన బారిన పడేవారు, డిప్రెషన్ బారిన కూడా త్వరగా పడే అవకాశం ఉంటుంది. మన దేశంలో 14% మంది ప్రజలు డిప్రెషన్ వంటి మానసిక రోగాలతో సతమతం అవుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. వీరిలో పది శాతం మందికి అత్యవసర వైద్య సహాయం అవసరం.  కానీ మానసిక సమస్యలకు చికిత్స పొందుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రతి 10 మందిలో ఒక్కరు మాత్రమే వైద్య సేవలు తీసుకుంటున్నారు. ఇలా అయితే పదేళ్లలో మానసిక సమస్యల బారిన పడే వారి సంఖ్య అత్యధికంగా పెరిగే అవకాశం ఉంది.

Also read: పిల్లలకు చదివింది గుర్తుండాలంటే వారి జ్ఞాపకశక్తిని పెంచే ఈ ఆహారాలు ఇవ్వండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SLBC Tunnel Tragedy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కథ విషాదాంతం, 8 మంది కార్మికులు మృతి, డెడ్ బాడీస్ గుర్తించిన రెస్క్యూ టీమ్
SLBC Tunnel Tragedy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కథ విషాదాంతం, 8 మంది కార్మికులు మృతి, డెడ్ బాడీస్ గుర్తించిన రెస్క్యూ టీమ్
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
Kiara Advani Pregnant: తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pastor Ajay Babu Exclusive Interview | చర్చిల విషయంలో ప్రభుత్వానికి పాస్టర్ అజయ్ సంచలన ప్రతిపాదన | ABP DesamAfg vs Eng Match Highlights | Champions Trophy 2025 | ఐసీసీ టోర్నీల్లో పనికూనల ఫేవరెట్ ఇంగ్లండ్ | ABP DesamAFG vs ENG Match Highlights | Champions Trophy 2025 లో పెను సంచలనం | ABP DesamGV Harsha Kumar on MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై హర్ష కుమార్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SLBC Tunnel Tragedy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కథ విషాదాంతం, 8 మంది కార్మికులు మృతి, డెడ్ బాడీస్ గుర్తించిన రెస్క్యూ టీమ్
SLBC Tunnel Tragedy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కథ విషాదాంతం, 8 మంది కార్మికులు మృతి, డెడ్ బాడీస్ గుర్తించిన రెస్క్యూ టీమ్
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
Kiara Advani Pregnant: తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
EPF Interest Rate: 7 కోట్ల మందికి నిరాశ - 2024-25 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటు ఎంతంటే?
7 కోట్ల మందికి నిరాశ - 2024-25 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటు ఎంతంటే?
Uttarakhand : బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచు చరియలు - రిస్క్‌లో 47 మంది ప్రాణాలు
బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచు చరియలు - రిస్క్‌లో 47 మంది ప్రాణాలు
Andhra Pradesh Budget 2025 Highlights: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ - కూటమి సర్కార్ వార్షిక బడ్జెట్ హైలైట్స్ ఇవే 
రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ - కూటమి సర్కార్ వార్షిక బడ్జెట్ హైలైట్స్ ఇవే 
Meenakshi Natarajan: మీనాక్షి నాటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ కోటి ఆశలు! చేయిదాటిన నేతలను దారిలోకి తెస్తారా ?
మీనాక్షి నాటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ కోటి ఆశలు! చేయిదాటిన నేతలను దారిలోకి తెస్తారా ?
Embed widget