అన్వేషించండి

Vitamins for Health : రోజుకు ఎన్ని విటమిన్లు తీసుకోవాలో తెలుసా? WHO మార్గదర్శకాలు ఇవే

Essential Vitamins : నేటి కాలంలో చిన్న వయసులోనే చాలా రోగాలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆహారంపై శ్రద్ధ లేకపోవడం. డైట్‌లో విటమిన్లు ఎంత ఉండాలో.. ఎంత తీసుకోవాలో తెలుసుకుందాం.

Vitamins for Health : రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పిన ఓ మాట మీరు వినే ఉంటారు. వినని వారికోసం.. 'శరీరానికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో, దీపానికి నూనె కూడా అంతే ముఖ్యం' అని చెప్పారు. అంటే ఒక వ్యక్తి సంతోషంగా జీవితాన్ని గడపడానికి ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ఆరోగ్యంగా లేకపోతే.. వివిధ రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. దానివల్ల జీవితాన్ని ఆనందించలేకపోతారు. కాబట్టి మంచి జీవితాన్ని గడపాలనుకుంటే.. తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు తగినంతగా అందుతాయి. ఒక వ్యక్తి రోజుకు ఎన్ని విటమిన్లు తీసుకోవాలో.. ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకుందాం? WHO మార్గదర్శకాలు ఏంటో చూసేద్దాం. 

రోజులో ఎన్ని విటమిన్లు అవసరం?

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి విటమిన్లు చాలా అవసరం. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు హార్మోన్ల సమతుల్యత, కణాల మరమ్మత్తు, శక్తి ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కానీ మనం రోజుకు ఎన్ని విటమిన్లు తీసుకోవాలి? WHO విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. సమతుల్య ఆహారం ద్వారా చాలా వరకు విటమిన్ల అవసరాలు తీర్చుకోవచ్చు. కానీ ఆహారం సరిగ్గా లేకపోతే లేదా ఆరోగ్య పరిస్థితి ప్రత్యేకంగా ఉంటే విటమిన్ల లోపం ఏర్పడవచ్చు. అలాంటి పరిస్థితిలో అవసరానికి అనుగుణంగా సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.

ఒక వ్యక్తికి ఒక రోజులో ఎన్ని విటమిన్లు అవసరమనేది అది వ్యక్తి వయస్సుపై ఆధారపడి ఉంటుంది. WHO, ఇతర ఆరోగ్య సంస్థల నివేదికల ప్రకారం.. పెద్దలకు ప్రతిరోజూ 10 మైక్రోగ్రాముల విటమిన్ D అవసరం. ఇది ఎముకలు, రోగనిరోధక వ్యవస్థకు అవసరం. తరువాత విటమిన్ A వస్తుంది. మహిళలకు రోజుకు కనీసం 600 మైక్రోగ్రాములు, పురుషులకు 700 మైక్రోగ్రాములు ఉండాలి. ఇది కళ్లు, చర్మం ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. విటమిన్ E రోజుకు దాదాపు 10 మిల్లీగ్రాములు తీసుకోవాలి. ఇది యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.

విటమిన్ K విషయానికి వస్తే.. మహిళలు రోజుకు 90 మైక్రోగ్రాములు, పురుషులు 120 మైక్రోగ్రాముల వరకు తీసుకోవాలి. విటమిన్ B6 మోతాదు దాదాపు 1.6 నుంచి 1.8 మిల్లీగ్రాములు, విటమిన్ B2 (రైబోఫ్లేవిన్) రోజుకు దాదాపు 1.6 నుంచి 2.0 మిల్లీగ్రాములు తీసుకోవాలి.

దీని కంటే ఎక్కువ విటమిన్లు తీసుకోవచ్చా?

WHO ప్రకారం.. కొవ్వులో కరిగే విటమిన్లు A, D, E, K వంటివి అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అవి శరీరంలో పేరుకుపోతాయి. అది ఆరోగ్యానికి హానికరం. దీని మోతాదును భర్తీ చేయడానికి ఆకుకూరలు, పండ్లు, పప్పులు, తృణధాన్యాలు, పాల ఉత్పత్తులను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. కాబట్టి మీరు ఎలాంటి వ్యాధులు లేకుండా.. విటమిన్ల లోపం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు రాకుండా హెల్తీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: వెబ్‌సైట్‌లో  అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు - పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
వెబ్‌సైట్‌లో అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు - పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
Adilabad Tiger Fear: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులులు -  ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్న అధికారులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులులు - ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్న అధికారులు
Madanapalle kidney Scam: పేదల అవయవాలే వారి వ్యాపార పెట్టుబడి - మదనపల్లె కిడ్నీ ముఠా వెనుక భయంగొలిపే వాస్తవాలు
పేదల అవయవాలే వారి వ్యాపార పెట్టుబడి - మదనపల్లె కిడ్నీ ముఠా వెనుక భయంగొలిపే వాస్తవాలు
Priyanka Chopra - Globetrotter First Look: మందాకినీగా ప్రియాంక చోప్రా... మహేష్ - రాజమౌళి సినిమాలో ఫస్ట్ లుక్ రిలీజ్!
మందాకినీగా ప్రియాంక చోప్రా... మహేష్ - రాజమౌళి సినిమాలో ఫస్ట్ లుక్ రిలీజ్!
Advertisement

వీడియోలు

Bihar Election 2025 Exit Poll Results | బీహార్‌లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆశ్చర్యకర ఫలితాలు | ABP Desam
PM Modi First Reaction on Delhi Blast | ఢిల్లీ బ్లాస్ట్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్
Drone in Jubilee Hills Bypoll | ఎన్నికల్లో ఇదే మొదటిసారి డ్రోన్ ప్రయోగం
White Collar Terror Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
White Collar Terror Attack Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: వెబ్‌సైట్‌లో  అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు - పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
వెబ్‌సైట్‌లో అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు - పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
Adilabad Tiger Fear: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులులు -  ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్న అధికారులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులులు - ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్న అధికారులు
Madanapalle kidney Scam: పేదల అవయవాలే వారి వ్యాపార పెట్టుబడి - మదనపల్లె కిడ్నీ ముఠా వెనుక భయంగొలిపే వాస్తవాలు
పేదల అవయవాలే వారి వ్యాపార పెట్టుబడి - మదనపల్లె కిడ్నీ ముఠా వెనుక భయంగొలిపే వాస్తవాలు
Priyanka Chopra - Globetrotter First Look: మందాకినీగా ప్రియాంక చోప్రా... మహేష్ - రాజమౌళి సినిమాలో ఫస్ట్ లుక్ రిలీజ్!
మందాకినీగా ప్రియాంక చోప్రా... మహేష్ - రాజమౌళి సినిమాలో ఫస్ట్ లుక్ రిలీజ్!
Patanjali Gurukulam: తొలి జాతీయ క్రీడా పోటీలో డబుల్ స్వర్ణం - పతంజలి గురుకులం హరిద్వార్ విద్యార్థుల ఘనత
తొలి జాతీయ క్రీడా పోటీలో డబుల్ స్వర్ణం - పతంజలి గురుకులం హరిద్వార్ విద్యార్థుల ఘనత
Bank Loan on Silver Jewelry:  వెండి ఆభరణాలపై కూడా బ్యాంకు లోన్‌ తీసుకోవచ్చు! నిబంధనలను తెలుసుకోండి?
వెండి ఆభరణాలపై కూడా బ్యాంకు లోన్‌ తీసుకోవచ్చు! నిబంధనలను తెలుసుకోండి?
Adilabad News: ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రచ్చరచ్చ  కొట్టకున్న బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు 
ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రచ్చరచ్చ  కొట్టకున్న బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు 
Vizag Investors Summit: ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఏర్పాట్లు పూర్తి - వందల మంది పారిశ్రామికవేత్తల రాక -  ముందుగానే విశాఖకు చంద్రబాబు
ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఏర్పాట్లు పూర్తి - వందల మంది పారిశ్రామికవేత్తల రాక - ముందుగానే విశాఖకు చంద్రబాబు
Embed widget