అన్వేషించండి

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అది స్మోకింగ్ కంటే ప్రమాదకరమట, ఎందుకంటే?

ఎక్కువ గంటలు కూర్చొని పని చేయడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణలు. ఊబకాయం, గుండె సమస్యలతో పాటు మానసిక ఉల్లాసం తగ్గుతుందంటున్నారు.

రోజుల్లో చాలా మంది కంప్యూటర్ ముందు కూర్చొని గంటల తరబడి పని చేస్తున్నారు. అయితే, ఎక్కువ సమయం కదలకుండా కూర్చొని పని చేయడం వల్ల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది స్మోకింగ్ కంటే ప్రమాదకరమట. ఇంతకీ ఆ సమస్యలు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఉల్లాసంగా ఉండలేరు

కదలకుండా కూర్చొని పని చేయడం వల్ల ప్రవర్తన మానసిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. డిప్రెషన్, యాంగ్జయిటీ పెరిగే ప్రమాదం ఉంది. నిరాశ, ఆందోళన లాంటి లక్షణాలు ఏర్పడుతాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు  వీలైనంత వరకు వ్యాయామం చేయాలి. తరచుగా విరామం తీసుకోవడం వల్ల కూడా ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది.  

2. ఆయుష్షు తగ్గిపోతుందట

చాలా గంటల పాటు కూర్చోవడం వల్ల శారీరక శ్రమ తగ్గి ఆయుష్షు మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీలైనంత వరకు ఎక్కువ సేపు కూర్చోవడాన్ని తగ్గించాలంటున్నారు నిపుణులు. లేదంటే ఆరోగ్యంతో పాటు దీర్ఘాయువును పెంచేందుకు సరిపడ శారీరక శ్రమను కల్పించాలి. వీలైనంత వరకు మధ్య మధ్యలో లేచి నడవడం ఉత్తమం. తరచుగా కాసేపు బ్రేక్ తీసుకోవడం మంచిది. ఈ గ్యాప్ లో కాసేపు వర్కౌట్స్ చేయడం కూడా ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది.  

3. ఊబకాయం

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల క్యాలరీల ఖర్చు తగ్గి ఈజీగా బరువు పెరుగుతారు. ఫలితంగా ఒబేసిటీ ఏర్పడుతుంది.  అందుకే, తరచుగా లేచి నడుస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల ఊబకాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. 

4. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం

ఎక్కువ సేపు కూర్చోని వర్క్ చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గడం, బలహీనమైన గ్లూకోజ్ జీవక్రియ కారణంగా ఈ ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే, ఇన్సులిన్ సెన్సిటివిటీతో పాటు  గ్లూకోజ్ మెటబాలిజంను మెరుగుపరచడానికి మధ్య మధ్యలో కాస్త వ్యాయామాలు చేయడం మంచిది.  

5. మస్క్యులోస్కెలెటల్ నొప్పి

ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల వెన్నునొప్పి, మెడ నొప్పి, కీళ్ల నొప్పి, కండరాల నొప్పి ఏర్పడుతుంది. అందుకే, మధ్య మధ్యలో లేచి నడుస్తూ ఉండాలి. కంఫర్టుగా కూర్చునేలా ఎర్గోనామిక్ ఫర్నిచర్ ఉపయోగించాలి.

6. గుండె సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల గుండె జబ్బులు ఏర్పడే అవకాశం ఉంటుంది. హైబీపీ, హార్ట్ స్ట్రోక్‌ తో సహా పలు  హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ, జీవక్రియ తగ్గి గుండె సమస్యలు తలెత్తుతాయి. రెండు, మూడు గంటలకు ఓసారి కొన్ని నిమిషాల పాటు లేచి తిరడం, సైకిల్ తొక్కడం లాంటివి చేస్తే హృదయ సంబంధ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది.     

Read Also: ఏమీ చేయకుండా ఉండడం బద్ధకం కాదు బాసూ, అదో ఆర్ట్ - డచ్ ఫిలాసఫీకి ఫిదా అవుతారంతే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

JanaSainiks on Pithapuram Sabha | నాలుగు కాదు పవన్ కళ్యాణ్ కోసం 40కిలోమీటర్లైనా నడుస్తాం | ABP DesamRayapati Aruna on Pithapuram Sabha | నాగబాబుకు MLC పదవి ఎందుకో చెప్పిన రాయపాటి అరుణ | ABP DesamFood Items Menu Janasena Pithapuram Sabha | పిఠాపురం సభలో 10వేల మందికి భోజనాలు | ABP DesamJanasena Pithapuram Sabha Arrangements | పిఠాపురంలో భారీ రేంజ్ లో జనసేన సభ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Tamannaah - Vijay Varma: ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Viral News: చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
Tirumala Letters Issue: తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
Embed widget