అన్వేషించండి

విటమిన్ మాత్రలు సమర్థంగా పనిచేయాలంటే ఎప్పుడు, ఎలా వేసుకోవాలో తెలుసా?

మన శరీరానికి అవసరమైన విటమిన్ మాత్రలు వేసుకుంటూ ఉంటాం. కానీ వాటిని వేసుకునే పద్ధతి మాత్రం చాలా మందికి తెలియదు.

మన శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు, లవణాల వంటి పోషకాలను ఆహారం ద్వారానే అందేలా చూసుకోవాలి. కానీ కొందరిలో పోషకాహార లోపం తలెత్తుతుంది. అలాంటప్పుడు వైద్యులు వారికి విటమిన్ టాబ్లెట్లను సూచిస్తారు. ఎంతోమందికి ఆ విటమిన్ టాబ్లెట్లను ఏ సమయంలో ఎలా వేసుకోవాలి అన్నది అవగాహన లేదు. ఆ విటమిన్లు శరీరానికి తగినంత శక్తిని అందించాలంటే వాటిని వేసుకునే పద్ధతి కూడా సరైనదై ఉండాలి. కొన్ని రకాల విటమిన్ టాబ్లెట్లను వేసుకోవడానికి కొన్ని నిర్దిష్ట సమయాలు ఉంటాయి. కానీ వీటిని పాటించే వారి సంఖ్య తక్కువగానే ఉంది. ఏ విటమిన్ టాబ్లెట్లు ఎప్పుడు వేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం.

విటమిన్ టాబ్లెట్లలో నీటిలో కరిగేవి ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3... వంటి బి విటమిన్ మాత్రలు కూడా నీటిలో కరిగే విటమిన్లు. వీటిలో విటమిన్ బి 12 శరీరం బాగా గ్రహించాలంటే ఆహారం తిన్న వెంటనే వేసుకోవాలి. అదే విటమిన్ సి కూడా వేసుకుంటున్న వారు విటమిన్ బి12 వేసుకున్నాక రెండు గంటల గ్యాప్ ఇచ్చి విటమిన్ సి మాత్ర వేసుకోవాలి. లేకపోతే విటమిన్ బి12ను శరీరం వినియోగించుకోకుండా విటమిన్ సి అడ్డుకునే అవకాశం ఉంది. ఇక మిగతావన్నీ ఆహారం తిన్న వెంటనే వేసుకున్నా మంచిదే.

విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె ఇవన్నీ కూడా కొవ్వులో కరిగే విటమిన్లు. మనం ఆహారం ద్వారా తీసుకునే కొవ్వులో ఇవి కలిసి శరీరం శోషించుకునేలా చేస్తాయి. కాబట్టి ఇలాంటి విటమిన్లను కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలు తిన్న వెంటనే వేసుకుంటే మంచిది. అలా అని మాంసం వంటివి తినమని చెప్పడం లేదు. బాదం, జీడిపప్పు వంటివి తిని ఆ వెంటనే ఈ విటమిన్లను వేసుకుంటే ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి.

విటమిన్ ఏ మనకి అత్యవసరమైన పోషకం. అయితే దీన్ని ఆహారం ద్వారా తీసుకుంటే మంచిదే. కానీ విటమిన్ టాబ్లెట్ రూపంలో తీసుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణులు రోజులో ఎక్కువ డోసులో విటమిన్ ఏను తీసుకోకూడదు. అలా తీసుకుంటే పుట్టబోయే పిల్లల్లో లోపాలు రావచ్చు. అలాగే పొగతాగే అలవాటు ఉన్నవారు, ఒకప్పుడు పొగ తాగి మానేసిన వారు కూడా విటమిన్ ఏను అధిక మొత్తంలో తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఐరన్ టాబ్లెట్లను ఎక్కువ మందికి సూచిస్తారు వైద్యులు. ఐరన్ టాబ్లెట్లను శరీరం బాగా శోషించుకోవాలంటే పరగడుపున వేసుకోవాలి. అంటే పొట్టలో ఏమీ లేనప్పుడే ఈ ఐరన్ మాత్రం తీసుకుంటే శరీరం శోషించుకుంటుంది. అలాగే విటమిన్ సి నిండిన బత్తాయి, నారింజ, నిమ్మ వంటి రసాలతో ఐరన్ టాబ్లెట్ ను వేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఐరన్, విటమిన్ సి రెండింటిని శరీరం సమర్థవంతంగా గ్రహిస్తుంది. కానీ క్యాల్షియం నిండిన పదార్థాలు తిన్నప్పుడు మాత్రం ఐరన్ టాబ్లెట్లను వేసుకోకూడదు. ఎందుకంటే క్యాల్షియం శరీరం ఐరన్ శోషించుకోకుండా అడ్డుకుంటుంది. అంటే ఐరన్ టాబ్లెట్ వేసుకున్నాక ఒక గంట పాటు పాలు తాగకూడదు. అలాగే పాలు లేదా పెరుగు తిన్నాక ఒక గంట పాటు ఐరన్ టాబ్లెట్లను వేసుకోకూడదు.

Also read: తలలో పేలు వేధిస్తున్నాయా? ఇంట్లోనే ఈ చిట్కాలు పాటించండి

Also read: తిన్నది అరగకపోవడం చిన్న సమస్య కాదు, క్యాన్సర్ సంకేతం కావచ్చు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Embed widget