అన్వేషించండి

Pregnancy: గర్భంతో ఉన్నప్పుడు ఈ మందులు వాడితే ఎంత ప్రమాదమో తెలుసా? వీలైనంత వరకు వాడకపోతేనే మంచిది

గర్భంతో ఉన్న సమయంలో కొన్ని రకాల మందులు వాడడం వల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీసే అవకాశం ఉన్నట్టు ఒక అధ్యయనం చెబుతోంది.

గర్భం ధరించాక  తినే ఆహారం నుంచి మందుల వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నచ్చినట్టు పెయిన్ కిల్లర్స్ వాడడం చాలా ప్రమాదకరం. బ్రిటన్ కు చెందిన అబెర్డీన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఈ అంశంపై భారీ పరిశోధన నిర్వహించారు. దాదాపు 30 ఏళ్ల పాటూ 151,000 మంది గర్భం ధరించిన వారి డేటాను విశ్లేషించారు. దాని ప్రకారం గర్భం ధరించిన సమయంలో అధికంగా పారాసెటమాల్, ఐబూఫ్రూఫెన్ వంటి మందులు వాడిన తల్లుల్లో ప్రసవం కష్టతరంగా మారినట్టు గుర్తించారు. కొందరికి పుట్టిన బిడ్డ చనిపోవడం లేదా, గర్భంలోనే మరణించడం వంటి కేసులు కూడా బయటపడ్డాయి. మరికొందరిలో నెలలు నిండకుండానే బిడ్డ పుట్టిన సందర్భాలనూ గుర్తించారు. అందుకే గర్భం ధరించిన సమయంలో పారాసెటమాల్, ఐబూ ప్రూఫెన్ మందులను అధికంగా వాడకూడదని సూచిస్తున్నారు. 

ఇవి కూడా...
పారాసెటమాల్, ఐబూఫ్రూఫెన్ మాత్రమే కాదు ఆస్పిరిన్, నాన్ స్టెరాయిడ్ యాంటి ఇన్ ఫ్లమ్మేటరీ డ్రగ్స్, డైక్లోఫెనాక్, న్యాప్రోక్సెన్ వంటి సమ్మేళనాలు కలిగినవి కూడా ప్రసూతి సమయంలో వినియోగించకూడదని సూచిస్తున్నారు పరిశోధకులు. గర్భధారణ సమయంలో పారాసెటమాల్, ఇబుప్రోఫెన్ వంటి పెయిన్ కిల్లర్లు తీసుకున్న తల్లులలో 37 వారాల కంటే ముందుగా ప్రసవం అయ్యే అవకాశం 50 శాతం ఉండగా, ప్రసవసమయంలో బిడ్డ చనిపోయే అవకాశం 33 శాతంగా ఉంది. 

ఎంతో రిస్క్
ఇలాంటి మందులను వాడడం వల్ల పుట్టే పిల్లల్లో న్యూరల్ ట్యూబ్ లోపాలు వచ్చే అవకాశం 64 శాతం, నియోనాటల్ యూనిట్లో చేర్చాల్సిన ప్రమాదం 57 శాతం, ప్రసవసమయంలో మరణించే అవకాశం 56 శాతం ఉన్నట్టు అధ్యయనంలో బయటపడింది. అలాగే పుట్టే బిడ్డ రెండున్నర కిలోల కన్నా తక్కువ బరువుతో పుట్టే అవకాశం 28 శాతం ఉన్నట్టు తేలింది. అందుకే మరీ అవసరం అయినప్పుడు తప్ప గర్భిణిలు పారాసెటమాల్, ఐబూప్రూఫెన్ల జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు. 

జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి సాధారణ లక్షణాలు కనిపించినా కూడా ప్రపంచవ్యాప్తంగా 30 శాతం నుంచి 80 శాతం మహిళలు వైద్యుల వద్దకు వెళ్లకుండానే పారాసెటమాల్ వాడేస్తున్నారు.దాదాపు పదిమంది గర్భిణిలలో ముగ్గురు అధికంగా ఈ మందులను వాడుతున్నట్టు అధ్యయనం చెబుతోంది. గత ఏడేళ్లుగా ఈ మందుల వాడకం మరింతగా ఎక్కువైంది.  ఇలా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డకు ప్రమాదమన్న సంగతి తల్లులు గ్రహించాలి. వైద్యుల సూచన మేరకు మాత్రమే మందులు వాడాలి. 

Also read: ఏ పండ్లు తింటే ఏ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చో తెలుసా?

Also read: పచ్చిబఠానీ దోశె, చూస్తేనే నోరూరిపోతుంది

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Scrolling Social Media for Hours : గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
Foods for Bone Health : ఎముకలను డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఇవే.. బోన్స్ హెల్తీగా ఉండాలంటే ఇవి తినేయండి
ఎముకలను డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఇవే.. బోన్స్ హెల్తీగా ఉండాలంటే ఇవి తినేయండి
Excessive Typing Side Effects : రోజంతా టైపింగ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీకు చేతి, మణికట్టు సమస్యలు రావచ్చు
రోజంతా టైపింగ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీకు చేతి, మణికట్టు సమస్యలు రావచ్చు
Right Time to Drink Water : నీళ్లు ఏ సమయంలో తాగితే మంచిది? ఇలా తాగితేనే బెస్ట్, లేదంటే సమస్యలు రావచ్చు
నీళ్లు ఏ సమయంలో తాగితే మంచిది? ఇలా తాగితేనే బెస్ట్, లేదంటే సమస్యలు రావచ్చు

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Embed widget