అన్వేషించండి

Dal: పప్పు వండడానికి ముందు నీళ్లలో నానబెట్టమని చెబుతుంది ఆయుర్వేదం, ఎందుకు?

ప్రోటీన్ కోసం పప్పు తినేవాళ్లు ఎంతోమంది. వారి కోసమే ఈ కథనం.

శాకాహారులు, మాంసాహారులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తినే ఆహారం పప్పు. కందిపప్పు, పెసరపప్పు సెనగపప్పు ఇలా అన్ని రకాల పప్పులతో రకరకాల ఆహార పదార్థాలు, కూరలు వండుకునే వాళ్ళు ఎంతోమంది. పప్పును ఉడకబెట్టి, పోపు వేసి చేసే వంటకం ప్రతి ఇంట్లో సాధారణంగా కనిపిస్తూనే ఉంటుంది. ప్రోటీన్ కోసం ఇలా పప్పును తినేవాళ్లు ఎంతోమంది. మాంసాహారులకు చికెన్ నుంచి ప్రోటీన్ అధికంగా అందుతుంది. శాకాహారులకు మాత్రం పప్పే ప్రధాన ఆధారం. అయితే ఇప్పుడు పప్పును కుక్కర్లో పెట్టి ఉడికించి వెంటనే వండేస్తున్నారు. కానీ ప్రాచీన కాలంలో కుక్కర్లు లాంటివి ఉండేవి కాదు. అప్పుడు గంటల తరబడి పప్పును నీళ్లలో నానబెట్టి, ఆ తర్వాత ఉడికించి ఉండేవాళ్ళు. అయితే అప్పటి సాంప్రదాయ వంట ఉత్తమమైనది. పోషకాహార నిపుణులు కుక్కర్లో ఉడకబెట్టడానికి ముందు పప్పును కనీసం రెండు నుంచి మూడు గంటలు నీళ్లలో నానబెట్టడం మంచిదని సూచిస్తున్నారు. 

ఎందుకు నానబెట్టాలి?
కుక్కర్లో ఉడికిస్తే సరిపోతుంది కదా పప్పును ఎందుకు ముందుగా నీళ్లలో నానబెట్టాలి? అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. పప్పును ముందుగా నానబెట్టడం వల్ల వండిన తర్వాత ఆ వంటకానికి మృదుత్వం, అధిక రుచి వస్తుంది. అంతేకాదు వంట సమయం కూడా తగ్గుతుంది. ఆయుర్వేదం ప్రకారం పప్పును ముందుగా నీళ్లలో నానబెట్టడం వల్ల అందులో ఉండే ఫైటిక్ ఆసిడ్లు, టానిన్ల శాతం తగ్గుతుంది. ఈ ఫైటిక్ ఆసిడ్లు, టానిన్లు ఉంటే పప్పు తిన్నాక మన శరీరం పోషకాలను గ్రహించడాన్ని అడ్డుకుంటాయి.  అలాగే కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తాయి. కాబట్టి నీళ్లలో నానబెట్టి పప్పు వండడం వల్ల అలాంటి సమస్యలు రావు. ముఖ్యంగా నీళ్లలో నానబెట్టని పప్పును తినే వారిలో చాలామందికి పొట్ట అసౌకర్యంగా ఉండడం లేదా బరువు పెరగడం వంటివి జరుగుతాయి. కాబట్టి నీళ్లలో నానబెట్టి పప్పును వండితే ఇలాంటి సమస్యలు రావు. 

అంతేకాదు పప్పులు ముందుగా నీళ్లలో నానబెట్టడం వల్ల వాటిలోని ఆమ్ల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం పప్పు... నీళ్లలో నానితే వాటికి జీవం వస్తుందని అంటారు. శరీరానికి పప్పు అందించే ఆరోగ్య గుణాలు పెరుగుతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఈ నానబెట్టిన పప్పులు ఎంతో సహాయపడతాయి. నీళ్లలో పప్పును నానబెట్టడం వల్ల అమైలేస్ ప్రేరేపించడంలో సహాయపడుతుంది. వీటిలో ఉండే సంక్లిష్ట పిండిని పదార్థాలను విచ్ఛిన్నం అయ్యేలా చేస్తాయి. దీనివల్ల శరీరం ఆ పప్పును సులభంగా జీర్ణం చేసుకుంటుంది. పోషకాలను శరీరం గ్రహించేలా చేయడానికి, జీర్ణక్రియ మృదువుగా జరిగేలా చూసుకోవడానికి పప్పులను నీళ్లలో నానబెట్టి ఆ తర్వాతే ఉడకబెట్టడం మంచిది. 

Also read: గర్భిణులు జాగ్రత్త, దంత సమస్యలు ఉంటే ముందస్తు ప్రసవం అయ్యే అవకాశం - చెబుతున్న కొత్త అధ్యయనం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Night Sweats : రాత్రుళ్లు చెమట వల్ల నిద్ర రావట్లేదా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
రాత్రుళ్లు చెమట వల్ల నిద్ర రావట్లేదా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Thyroid Weight Loss Tips : థైరాయిడ్ ఉంటే బరువు తగ్గడం కష్టమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
థైరాయిడ్ ఉంటే బరువు తగ్గడం కష్టమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Joining in Hostel : మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget