అన్వేషించండి

Dehydration: పెద్దలూ జాగ్రత్త! ఎక్కువగా డీహైడ్రేట్ అయితే మూర్చలు రావొచ్చు

నీరు జీవనాధారం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు తీసుకోవడం చాలా అవసరం.

శరీరానికి నీరు చాలా అవసరం. ఆహారం లేకుండా అయినా కొన్ని రోజులు ఉండగలుగుతారేమో కానీ నీళ్ళు తాగకుండా బతకడం చాలా కష్టం. అందుకే శరీరం డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. శరీరం సాధారణ రోజువారీ విధులు నిర్వహించాలంటే తగినంత నీరు కావాలి. వృద్ధుల్లో సాధారణంగా శరీరంలో నీటి పరిమాణం తక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళు త్వరగా డీహైడ్రేట్ అవుతారు.

 ఎందుకు ఎక్కువగా డీహైడ్రేట్ అవుతారు?

వయస్సు పెరిగే కొద్ది వారి శరీరంలో ద్రవ నిల్వలు తక్కువగా ఉంటాయి. ఇదే కాదు దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా మందులు వాడుతూ ఉంటే మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్ది కిడ్నీ పనితీరు కూడా మందగిస్తుంది. వీటి వల్ల వృద్ధుల్లో ఎక్కువగా డీహైడ్రేట్ సమస్య ఎదుర్కొంటారు. ఇవే కాదు అనేక అంశాలు కూడా దోహదపడతాయి. అవేంటంటే..

వాతావరణ మార్పులు: వాతావరణం వేడిగా లేదా తేమగా ఉంటే చెమట లేదా మూత్రం రూపంలో శరీరంలోని నీరు అధిక మొత్తంలో కోల్పోతారు. కదల్లేని స్థితిలో ఉన్న వృద్ధులు కూడా తరచూ లేచి నీళ్ళు తాగడం కష్టంగా ఉండటం కూడా మరొక కారణంగా చెప్పుకోవచ్చు.

అనారోగ్యం: విరోచనాలు ఎక్కువగా అయినప్పుడు అనారోగ్యం కారణంగా శరీరంలోని ద్రవాలను కోల్పోతారు. వాటిని తిరిగి పొడటం చాలా కష్టం.

డీహైడ్రేట్ గురైనట్టు చెప్పే సంకేతాలు

పెద్దలు నీరు ఎక్కువగా తీసుకోవాలి. లేదంటే అవి ఇతర అనారోగ్య సమస్యలకి దారి తీసే అవకాశం ఉంది. శరీరం డీహైడ్రేట్ కి గురైనట్టు చెప్పి కొన్ని సంకేతాలు..

☀ తక్కువగా మూత్ర విసర్జన లేదా మూత్రం ముదురు రంగులో రావడం

☀ అలసట

☀ చర్మం దురద పెట్టడం

☀ చర్మం పొడిబారిపోవడం

☀ మైకం, వికారం

☀ మతిమరుపు, కన్ఫ్యూజన్

☀ పెదవులు ఎండి పోవడం, పొడిగా అనిపించడం

వృద్ధుల్లో డీహైడ్రేషన్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే దీర్ఘకాలికంగా ప్రమాదకరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని ప్రభావం కాలేయం, గుండెమ్ మూత్రపిండాలు సహాయ ఇతర అవయవాల పనితీరు మీద చూపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో విపరీతమైన డీహైడ్రేట్ వల్ల మరణం కూడా సంభవించే అవకాశం ఉందని అంటున్నారు. మయో క్లినిక్ ప్రకారం ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.

☀ శరీరానికి తగినంత నీరు ఇవ్వకపోవడం వల్ల తీవ్ర అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. వ్యాయామం, ఎక్కువగా శారీరక శ్రమ చేసే వాళ్ళు నీటిని తీసుకోకపోవడం వల్ల అనారోగ్యాల బారిన పడతారు.

☀ కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. రోజుకి కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలని వైద్యులు సూచిస్తారు. నీరు తక్కువగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు వస్తాయి. ఎక్కువగా డీహైడ్రేట్ అవడం వల్ల మూత్ర నాళాల ఇన్ఫెక్షన్స్, మూత్ర పిండాల వైఫల్యం కూడా సంభవించవచ్చు.

☀ మూర్చలు: పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్ సెల్ నుంచి సెల్ కి విద్యుత్ సంకేతాలు తీసుకెళ్లడంలో సహాయపడతాయి. వాటిలో అసమతుల్యత ఏర్పడితే స్పృహ కోల్పోవడం, మూర్చలు రావడం జరగవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also read: వేడి నీటిలో, టీలో తేనె వేసుకుని తాగుతున్నారా? అయితే విషాన్ని తాగుతున్నట్టే

Also read: ఎక్కిళ్లు ఆగకుండా వస్తున్నాయా? ఇలా చేసి చూడండి ఇట్టే ఆగిపోతాయి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
YS Sharmila : YSR, విజయమ్మను  బూతులు తిట్టిన బొత్స తండ్రి సమానులా ?  జగన్‌పై షర్మిల సెటైర్లు
YSR, విజయమ్మను బూతులు తిట్టిన బొత్స తండ్రి సమానులా ? జగన్‌పై షర్మిల సెటైర్లు
TS Inter 2nd Year Results 2024: తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ ఫలితాలు విడుదల- ములుగు జిల్లా టాప్, కామారెడ్డి లాస్ట్
తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ ఫలితాలు విడుదల- ములుగు జిల్లా టాప్, కామారెడ్డి లాస్ట్
Fact Check: భారత్ పాకిస్తాన్‌తో యుద్ధానికి దిగితే 25 కోట్ల ముస్లింలు పాక్ ఆర్మీలో చేరతారని అసదుద్దీన్ అన్నారా? నిజం ఏంటంటే
భారత్ పాకిస్తాన్‌తో యుద్ధానికి దిగితే 25 కోట్ల ముస్లింలు పాక్ ఆర్మీలో చేరతారని అసదుద్దీన్ అన్నారా? నిజం ఏంటంటే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

TDP candidate Pemmasani Chandrasekhar Assets value | దేశంలోనే ధనిక అభ్యర్థి మన తెలుగోడే అని తెలుసా.!Madhavi Latha Nomination Ryally |భాగ్యలక్ష్మీ టెంపుల్ లో పూజలు...నామినేషన్ వేసిన మాధవి లత | ABPPawan kalyan Kakinada | కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ నామినేషన్ ర్యాలీలో అలసిపోయిన పవన్ కళ్యాణ్ | ABPNara Rohit Prathinidhi 2 Interview | డైరెక్టర్ గా మారిన మూర్తితో జర్నలిస్ట్ నారా రోహిత్ ఇంటర్వ్యూ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
YS Sharmila : YSR, విజయమ్మను  బూతులు తిట్టిన బొత్స తండ్రి సమానులా ?  జగన్‌పై షర్మిల సెటైర్లు
YSR, విజయమ్మను బూతులు తిట్టిన బొత్స తండ్రి సమానులా ? జగన్‌పై షర్మిల సెటైర్లు
TS Inter 2nd Year Results 2024: తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ ఫలితాలు విడుదల- ములుగు జిల్లా టాప్, కామారెడ్డి లాస్ట్
తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ ఫలితాలు విడుదల- ములుగు జిల్లా టాప్, కామారెడ్డి లాస్ట్
Fact Check: భారత్ పాకిస్తాన్‌తో యుద్ధానికి దిగితే 25 కోట్ల ముస్లింలు పాక్ ఆర్మీలో చేరతారని అసదుద్దీన్ అన్నారా? నిజం ఏంటంటే
భారత్ పాకిస్తాన్‌తో యుద్ధానికి దిగితే 25 కోట్ల ముస్లింలు పాక్ ఆర్మీలో చేరతారని అసదుద్దీన్ అన్నారా? నిజం ఏంటంటే
Bandi Sanjay :  అభ్యర్ధిని కూడా ప్రకటించుకోలేని అసమర్థులా నన్ను ఓడించేది -  కాంగ్రెస్‌పై బండి సంజయ్ సెటైర్లు
అభ్యర్ధిని కూడా ప్రకటించుకోలేని అసమర్థులా నన్ను ఓడించేది - కాంగ్రెస్‌పై బండి సంజయ్ సెటైర్లు
Nara Rohit: ఏపీ రాజకీయాలపై నారా రోహిత్‌ హాట్‌ కామెంట్స్‌ - 'ప్రతినిధి 2' వాయిదాపై ఏమన్నాడంటే!
ఏపీ రాజకీయాలపై నారా రోహిత్‌ హాట్‌ కామెంట్స్‌ - 'ప్రతినిధి 2' వాయిదాపై ఏమన్నాడంటే!
సుప్రీంకోర్టు దెబ్బకి దిగొచ్చిన పతంజలి, క్షమాపణలు కోరుతూ న్యూస్‌పేపర్‌లలో భారీ ప్రకటనలు
సుప్రీంకోర్టు దెబ్బకి దిగొచ్చిన పతంజలి, క్షమాపణలు కోరుతూ న్యూస్‌పేపర్‌లలో భారీ ప్రకటనలు
YS Jagan Stone Pelting Cace :  జగన్‌పై రాయి  దాడి కేసు నిందితునికి మూడు రోజుల కస్టడీ - థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దన్న  కోర్టు
జగన్‌పై రాయి దాడి కేసు నిందితునికి మూడు రోజుల కస్టడీ - థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దన్న కోర్టు
Embed widget