అన్వేషించండి

Fairness Creams Leading to Kidney Issues : అమ్మాయిలు ఫెయిర్​నెస్ క్రీములు వాడుతున్నారా? అయితే మీ కిడ్నీలు జాగ్రత్త

Skin Fairness Creams are Increasing Kidney Problems : అందం కోసం ఫెయిర్​నెస్​ క్రీమ్​లు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అవే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి అంటోంది తాజా అధ్యయనం.

Cancer with Fairness Creams : మెరిసే చర్మం, ఫెయిర్​గా కనిపించేందుకు చాలామంది స్కిన్ ఫెయిర్​నెస్ క్రీమ్​లు ఉపయోగిస్తారు. ఇవి రాసుకుంటే తెల్లగా కనిపిస్తారంటూ.. మీ స్కిన్ బ్రైట్​గా అవుతుందంటూ.. హెల్తీ స్కిన్ మీ సొంతమవుతుందంటూ కంపెనీలు కూడా ఫెయిర్​నెస్ క్రీమ్​లను ప్రమోట్ చేస్తున్నాయి. అయితే వారు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి చూస్తున్నారు తప్పా.. స్కిన్​కు హానీ చేయని కెమికల్స్​ ఉపయోగించకూడదనే విషయాలు మరిచిపోతున్నారు. ఈ విషయాన్నే తాజా అధ్యయనం తెలిపింది. ఫెయిర్​నెస్ క్రీములతో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయని వెల్లడించింది. 

కిడ్నీ ఫిల్టర్లను దెబ్బతీస్తుందట..

స్కిన్​ ఫెయిర్​నెస్ క్రీమ్​ల వాడకం వల్ల ఇండియాలో కిడ్నీ సమస్యల కేసులు పెరుగుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ క్రీమ్​లలో అధిక మొత్తంలో పాదరసం ఉంటుందని.. అది మూత్రపిండాలకు హాని కలిగిస్తుందని చెప్తున్నారు. కిడ్నీ ఇంటర్నేషనల్ అనే మెడికల్ జర్నల్​లో ఈ అధ్యయనం గురించి ప్రచురించారు. అధిక మెర్క్యూరీ కంటెంట్ ఉన్న ఫెయిర్​నెస్​ క్రీములను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెంబ్రానస్ నెఫ్రోపతీ కేసులు పెరుగుతున్నాయని వెల్లడించింది. ఈ సమస్య కిడ్నీ ఫిల్టర్​లను దెబ్బతీస్తుందని తెలిపింది. 

చర్మం ద్వారా పాదరసం లోపలికి పోతుంది..

మెంబ్రానస్ నెఫ్రోపతీ MN అనేది ఒక స్వయం ప్రతిరక్షక వ్యాధి. ఇది ప్రోటీన్​ లీకేజికి కారణమవుతుంది. దీని ఫలితంగా నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఏర్పడి మూత్రపిండ సమస్యలకు దారి తీస్తుంది. దీనివల్ల శరీరం నుంచి మూత్రం రూపంలో ప్రోటీన్​ను విసర్జించేలా చేస్తుంది. మాయిశ్చరైజర్​లోని పాదరసం చర్మం ద్వారా లోపలికి వెళ్లిపోతుంది. ఇది మూత్రపిండాల ఫిల్టర్​లను నాశనం చేస్తుంది. ఇది నెఫ్రోటిక్ సిండ్రోమ్​ కేసుల పెరుగుదలకు దారితీస్తుందని స్టడీలో పాల్గొన్న పరిశోధకులు తెలిపారు. 

ఉపయోగించి మానేస్తే.. చర్మం రంగు మారిపోతుందట..

ఇండియాలో లభించే బ్యూటీ ఫెయిర్​నెస్​ క్రీమ్​లు త్వరిత ఫలితాలను ఇస్తాయి. వాటి ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయినా సరే వాటి ఫలితాలు బాగున్నాయనే ఉద్దేశంతో చాలామంది వాటిని రెగ్యూలర్​గా ఉపయోగిస్తూ ఉంటారు. పైగా ఒకసారి క్రీమ్​ను ఉపయోగించి వాటిని ఆపేస్తే చర్మం మరింత ముదురు రంగులోకి మారుతుంది. అందుకే వీటిని వాడడం ఆపరు. వాటివల్ల వినియోగం పెరిగి.. అది మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. జూలై 2021 నుంచి సెప్టెంబర్ 2023 మధ్య మెంబ్రానస్ నెఫ్రోపతి కేసులను అధ్యయనం చేసి ఈ ఫలితాలు వెల్లడించారు. 

లక్షణాలు ఎలా ఉంటాయంటే.. 

మేకప్ వల్ల కిడ్నీ సమస్యలు వస్తే.. అలసట, నురుగతో కూడిన మూత్రం వంటి లక్షణాలు ఉంటాయి. మూత్రంలో ప్రోటీన్​ స్థాయిలు పెరుగుతాయి. రోగి మెదడులో రక్తం గడ్డకట్టే సెరిబ్రల్​ వెయిన్​ థ్రాంబోసిస్​ను అభివృద్ధి చేస్తుంది. మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది. కొన్ని సందర్భరాల్లో ఇది ప్రాణాంతకం కూడా అవుతుంది. అందుకే ఫెయిర్​నెస్​ క్రీముల వాడకాన్ని నిలిపివేయాలని సూచిస్తున్నారు నిపుణులు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని అరికట్టాలంటే ఈ ఫెయిర్​నెస్​ క్రీముల వినియోగాన్ని తగ్గించాలి అంటున్నారు. 

Also Read : టైప్​ 2 డయాబెటిస్​ను దూరం చేసే ఫుడ్ ఇదే.. రెగ్యూలర్​గా తీసుకుంటే చాలా మంచిదంటున్న తాజా అధ్యయనం

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget