అన్వేషించండి

UPSC: యూపీఎస్సీ- ఐఈఎస్‌/ ఐఎస్‌ఎస్‌ఈ - 2024 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

UPSC: భారత ప్రభుత్వ ఎకనామిక్స్‌, స్టాటిస్టికల్‌ సర్వీసుల్లో జూనియర్‌ టైమ్ స్కేల్‌ పోస్టుల భర్తీకి సంబంధించి IES, ISS ఎగ్జామినేషన్- 2024 నోటిఫికేషన్‌ను UPSC ఏప్రిల్ 10న విడుదల చేసింది.

UPSC IES/ISS 2024 Notification: భారత ప్రభుత్వ ఎకనామిక్స్‌, స్టాటిస్టికల్‌ సర్వీసుల్లో జూనియర్‌ టైమ్ స్కేల్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌(IES), ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ (ISSE)- 2024 నోటిఫికేషన్‌ను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(UPSC) ఏప్రిల్ 10న విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌లో 18 పోస్టులను, ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌‌లో 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పోస్టుల వివరాలు.. 

➥ ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌: 18 పోస్టులు 

➥ ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌: 30 పోస్టులు

అర్హత: ఎకనామిక్‌ సర్వీసుకు పీజీ డిగ్రీ (ఎకనామిక్స్‌/అప్లైడ్‌ ఎకనామిక్స్‌/బిజినెస్‌ ఎకనామిక్స్‌/ఎకనామెట్రిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. ఇక స్టాటిస్టికల్‌ సర్వీసుకు డిగ్రీ(స్టాటిస్టిక్స్‌/మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌/అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌) లేదా పీజీ(స్టాటిస్టిక్స్‌/మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌/అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 01.08.2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

రాతపరీక్ష విధానం..

➥ మొత్తం 1000 మార్కులకు ఎకనామిక్స్‌, స్టాటిస్టిక్స్ విభాగాలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తారు. 

➥ ఎకనామిక్స్‌ విభాగంలో జనరల్ ఇంగ్లిష్-100 మార్కులు, జనరల్ స్టడీస్-100 మార్కులు, జనరల్ ఎకనామిక్స్(1)-200 మార్కులు, జనరల్ ఎకనామిక్స్(2): 200 మార్కులు, జనరల్ ఎకనామిక్స్(3)-200 మార్కులు, ఇండియన్ ఎకనామిక్స్-200 మార్కులకు పరీక్షలు ఉంటాయి. ఒక్కో సబ్జెక్టుకు 3 గంటల సమయం కేటాయించారు.

➥ ఇక స్టాటిస్టిక్స్ విభాగంలో జనరల్ ఇంగ్లిష్-100 మార్కులు, జనరల్ స్టడీస్-100 మార్కులు, స్టాటిస్టిక్స్-1(ఆబ్జెక్టివ్)-200 మార్కులు, స్టాటిస్టిక్స్-2(ఆబ్జెక్టివ్)-200 మార్కులు, స్టాటిస్టిక్స్-3(డిస్క్రిప్టివ్): 200 మార్కులు, స్టాటిస్టిక్స్-4(డిస్క్రిప్టివ్)-200 మార్కులకు పరీక్షలు ఉంటాయి. ఒక్కో సబ్జెక్టుకు 3 గంటల సమయం కేటాయించారు.

➥ తర్వాత దశలో 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైనవారికి డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, కటక్, ఢిల్లీ, డిస్పూర్, జైపూర్, జమ్మూ, కోల్‌కతా, లక్నో, ముంబయి, పాట్నా, ప్రయాగ్‌రాజ్, షిల్లాంగ్, సిమ్లా, తిరువనంతపురం.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.04.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.04.2024.

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 01 - 07.05.2024.

➥ రాతపరీక్ష తేదీ: 21.06.2024.

Notification

Online Application

Website

ALSO READ:

UPSC CMS 2023: యూపీఎస్సీ సీఎంఎస్-2024 నోటిఫికేషన్ విడుదల, వివిధ విభాగాల్లో 827 పోస్టుల భర్తీ
కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్-2024 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏప్రిల్ 10న విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 827 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలకు కలిగి ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 30న సాయంత్రం 6 గంటల వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 200 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. యూపీఎస్సీ సీఎంఎస్ పరీక్ష జులై 14న దేశవ్యాప్తంగా 41 సెంటర్లలో నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Viveka Case: వివేకా సాక్షుల మరణాలతో సంచలన నిర్ణయం - 16 మందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు
వివేకా సాక్షుల మరణాలతో సంచలన నిర్ణయం - 16 మందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు
NTR Fan : ప్రాణాలు నిలిపేందుకు లక్షలు ఖర్చు పెట్టి జూ ఎన్టీఆర్ - కోలుకున్నాక విషాదం- తిరుపతి కౌశిక్ హఠాన్మరణం  !
ప్రాణాలు నిలిపేందుకు లక్షలు ఖర్చు పెట్టి జూ ఎన్టీఆర్ - కోలుకున్నాక విషాదం- తిరుపతి కౌశిక్ హఠాన్మరణం !
Champions Trophy 2025 Final: 37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
Kishan Reddy Letter to Bhatti Vikramarka: అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Viveka Case: వివేకా సాక్షుల మరణాలతో సంచలన నిర్ణయం - 16 మందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు
వివేకా సాక్షుల మరణాలతో సంచలన నిర్ణయం - 16 మందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు
NTR Fan : ప్రాణాలు నిలిపేందుకు లక్షలు ఖర్చు పెట్టి జూ ఎన్టీఆర్ - కోలుకున్నాక విషాదం- తిరుపతి కౌశిక్ హఠాన్మరణం  !
ప్రాణాలు నిలిపేందుకు లక్షలు ఖర్చు పెట్టి జూ ఎన్టీఆర్ - కోలుకున్నాక విషాదం- తిరుపతి కౌశిక్ హఠాన్మరణం !
Champions Trophy 2025 Final: 37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
Kishan Reddy Letter to Bhatti Vikramarka: అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
AP Politics: ఏపీ మంత్రి తండ్రి పెత్తనం, క్యాడర్‌‌లో అసంతృప్తి..! రామచంద్రపురంలో ఏం జరుగుతోంది..
ఏపీ మంత్రి తండ్రి పెత్తనం, క్యాడర్‌‌లో అసంతృప్తి..! రామచంద్రపురంలో ఏం జరుగుతోంది..
Megastar Chiranjeevi: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి, ఆ క్షణం ఇప్పటికే బాధే అంటూ ఎమోషన్
'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి, ఆ క్షణం ఇప్పటికే బాధే అంటూ ఎమోషన్
3 Roses Season 2 Web Series: మరో 2 కొత్త రోజెస్ వచ్చేస్తున్నాయ్! - ఓటీటీలోకి వచ్చేస్తోన్న '3 రోజెస్' సిరీస్ సీజన్ 2.. ఈసారి ఫన్ మామూలుగా ఉండదంతే..
మరో 2 కొత్త రోజెస్ వచ్చేస్తున్నాయ్! - ఓటీటీలోకి వచ్చేస్తోన్న '3 రోజెస్' సిరీస్ సీజన్ 2.. ఈసారి ఫన్ మామూలుగా ఉండదంతే..
Womens Day Special: భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
Embed widget