అన్వేషించండి

TSPSC Paper Leak: వాట్సాప్ ద్వారానే 'గ్రూప్-1' ప్రశ్నపత్రాలు చేరవేశారు! కమిషన్ కార్యాలయం నుంచే మొత్తం వ్యవహారం!

టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష పేపర్లు వాట్సాప్ ద్వారానే చేతులు మారినట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. నిందితులు పకడ్బందీగా ప్రశ్నపత్రాలను పంచుకొని లాభపడే ప్రయత్నం చేశారని గుర్తించారు.

టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష పేపర్లు వాట్సాప్ ద్వారానే చేతులు మారినట్టు దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో నిందితులు పకడ్బందీగా ప్రశ్నపత్రాలను పంచుకొని లాభపడే ప్రయత్నం చేశారని అధికారులు గుర్తించారు. టీఎస్‌పీఎస్సీ కమిషన్ కార్యాలయం కేంద్రంగానే మొత్తం వ్యవహారం కొనసాగించినట్లు అంచనాకు వచ్చారు. ఈ కేసులో తాజాగా అరెస్టయిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, నలగొప్పుల సురేశ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ దామెర రమేష్ కుమార్ రిమాండ్ రిపోర్టులో ఈమేరకు పలు అంశాలను అధికారులు ప్రస్తావించారు. మార్చి 22న దర్యాప్తు అధికారులు, ఈ ముగ్గురి నివాసాల్లో తనిఖీలు నిర్వహించి ఒక ల్యాప్‌టాప్, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారికి వాట్సాప్ ద్వారానే ప్రశ్నపత్రాలు చేరినట్టు మొబైల్ ఫోన్ల విశ్లేషణ ద్వారా నిర్ధారణకు వచ్చారు. ఇక ఈ కేసులో ఏ-12 రమేష్ కుమార్ ఇంట్లో లభించిన ల్యాప్‌టాప్ నుంచి కీలక సమాచారం సేకరించారు.

ఆధారాల సేకరణపై ఫోకస్..
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఏడుగురు నిందితుల కస్టడీ కోరుతూ సిట్ పోలీసులు నగర న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకూ 12 మంది అరెస్టయిన సంగతి తెలిసిందే. తొలుత అరెస్ట్ అయిన 9 మందిని ఇటీవలే కస్టడీకి తీసుకొని విచారణ జరిపారు. వీరిలో ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, డాక్యానాయక్, రాజేంద్రనాయక్‌లను రెండోసారి ప్రశ్నించాలని సిట్ నిర్ణయించింది. వీరితోపాటు... బుధవారం అరెస్టయిన షమీమ్, రమేష్ కుమార్, సురేష్‌లను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. గ్రూప్-1 ప్రశ్నపత్రాలు ఇంకెన్ని చేతులు మారాయనేది రాబట్టేందుకు మరోసారి వీరిని విచారించాలని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై శనివారం న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది.

విచారణలో పొంతనలేని సమాధానాలు...
గ్రూప్‌-1 ప్రిలిమినరీలో 100కు పైగా మార్కులు వచ్చిన 121 మందిని సిట్ దర్యాప్తు అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 24 వరకు మొత్తం 40 మందిని అధికారులు ప్రశ్నించారు. వీరిలో పరీక్ష తీరు, ప్రశ్నల శైలిపై పోలీసులు అడిగిన ప్రశ్నలకు సురేశ్, షమీమ్, రమేష్ కుమార్‌ తడబడ్డారని, పొంతనలేని సమాధానాలిస్తూ దొరికిపోయినట్లు తెలిసింది.

సాక్ష్యాల సేకరణ ఇలా...
* ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కేసులో ప్రధాన సాక్షిగా కమిషన్ కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ బి.శంకరలక్ష్మి నుంచి సిట్ పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. కమిషన్‌లో జూనియర్ అసిస్టెంట్ కె.అనురాజ్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ బి.హరీశ్ కుమార్ నుంచి కూడా సాక్ష్యాలు సేకరించారు. 
* మార్చి 4న హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని ఆర్‌స్క్వేర్ హోటల్‌లో రూమ్ నంబరు 106, 107 గదులను నీలేష్ నాయక్, గోపాల్ నాయక్, డాక్యా నాయక్, రాజిరెడ్డి, మరో ఇద్దరి పేర్లతో అద్దెకు తీసుకుని, మంతనాలు జరిపిన ఆధారాల ఫుటేజిని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఏఈ పేపరు కొనుగోలుకు రూ.7.50 లక్షలకు భేరం?
పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న రేణుక ఇంటిని కూడా మార్చి 24న సిట్ అధికారులు తనిఖీ చేశారు. మహబూబ్‌నగర్ న్యూటౌన్‌లో ఆమె అద్దెకున్న ఇంటి యజమాని నుంచి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే నవాబుపేట మండలంలో ఉపాధి హామీ పథకం ఇంజినీరింగ్ కన్సల్టెంటుగా పనిచేస్తున్న ప్రశాంత్ రెడ్డిని శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని నవాబుపేట ఠాణాలో అర్ధరాత్రి వరకు విచారించారు. నలుగురు వ్యక్తులు రూ.7.50 లక్షల చొప్పున ఇచ్చి ఏఈ ప్రశ్నపత్రాన్ని కొన్నట్లు దర్యాప్తులో తేలడంతో ఈ విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రశాంత్ రెడ్డి మహబూబ్‌నగర్‌లో నివాసం ఉంటుండగా నవాబుపేటలో ఈసీగా పనిచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తి కూడా రూ.7.50 లక్షలకు కొన్నట్లు సమాచారం. అతని కోసం అధికారులు షాద్‌నగర్‌కు వెళ్లగా పరారీలో ఉన్నట్లు తెలిసింది.

పోలీసులను బురిడీ కొట్టించేందుకే..
టీఎస్‌పీఎస్సీ టౌన్‌ప్లానింగ్ ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఫిర్యాదుపై ప్రవీణ్, రేణుకలను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాము ఏఈ పరీక్ష ప్రశ్నపత్రం మాత్రమే లీక్ చేశామని నమ్మించేందుకు వారు ప్రయత్నించారు. పట్టుకోగానే ఏఈ ప్రశ్నపత్రం లీక్ అయిందని ఒప్పుకోవడం ద్వారా సిట్ అధికారులు అక్కడితో ఆగిపోతారని నిందితులు భావించారు. అయితే తవ్వే కొద్దీ గ్రూప్-1తోపాటు మొత్తం నాలుగు పేపర్లు లీక్ అయినట్లు వెల్లడైంది. ఇక విచారణ సమయంలో ఎంత ప్రయత్నించినా ప్రవీణ్ నోరు మెదపలేదు. తనకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎలా వచ్చాయన్న విషయాన్ని రాజశేఖర్ వెల్లడించలేదు. శంకరలక్ష్మి డైరీ నుంచి దొంగిలించినట్లు దర్యాప్తులో పోలీసులే తెలుసుకున్నారు.

రాజశేఖర్ పని ఇలా సులువైంది..
సిస్టమ్‌లో సీక్రెట్‌గా ఉండాల్సిన ఫోల్డర్లకు పటిష్టమైన భద్రతాఏర్పాట్లు చేసుకోకపోవడం, సిస్టమ్‌ అడ్మిన్‌ రాజశేఖర్‌కు అన్ని అంశాలపై అవగాహన ఉండటంతో ఈజీగా ఓపెన్‌ చేసినట్టు విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. ఫిబ్రవరి 27నే కాకుండా పలుమార్లు ఆమె కంప్యూటర్‌ను రాజశేఖర్‌, ప్రవీణ్‌లు ఓపెన్‌ చేశారని విచారణలో తేలినట్టు సమాచారం. ప్రశ్నపత్రాలుండే కస్టోడియన్‌ సిస్టమ్‌ గురించి పూర్తి అవగాహన ఉండటంతో సిస్టమ్‌ అడ్మిన్‌ రాజశేఖర్‌ గతేడాది జూన్‌ నుంచే గ్రూప్‌-1 ప్రశ్నపత్రం కోసం ప్రయత్నించాడు. అప్పటికి ప్రశ్నాపత్రాలు రాకపోవడంతో తిరిగి రెండు మూడు దఫాలుగా ప్రయత్నించి, అక్టోబర్‌ మొదటి వారంలో పేపర్‌ను పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసినట్టు తెలిసింది. అది విజయవంతం కావడంతో ఫిబ్రవరి 27న మరోసారి ఆ సిస్టమ్‌ను ఓపెన్‌ చేసి ఆ ఫోల్డర్‌లో ఉన్న మొత్తం ప్రశ్నలను కాపీ చేశానని నిందితుడు వెల్లడించినట్టు సమాచారం. మరో పక్క ప్రవీణ్‌, రాజశేఖర్‌ ఇండ్లల్లోనూ పోలీసులు తనిఖీలు చేశారు. వారి బ్యాంకు స్టేట్‌మెంట్లు సేకరించారు. మరో మూడు రోజులపాటు నిందితులు సిట్‌ కస్టడీలోనే ఉండనున్నారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

UGC NET 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలివే
UGC NET 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలివే
SSC Results 2026: పదతరగతి ఫెయిల్ అయినా పిలిచి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు! పూర్తి వివరాలు ఇవే!
పదతరగతి ఫెయిల్ అయినా పిలిచి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు! పూర్తి వివరాలు ఇవే!
Oracle layoffs: ఇప్పుడు ఒరాకిల్ వంతు - 20వేల మంది సీనియర్లకు ఊస్టింగ్ - ఏఐ మింగేస్తోంది!
ఇప్పుడు ఒరాకిల్ వంతు - 20వేల మంది సీనియర్లకు ఊస్టింగ్ - ఏఐ మింగేస్తోంది!
8th Pay Commission: కనీస వేతనం 4 రెట్లు పెంచాలని డిమాండ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారా ?
కనీస వేతనం 4 రెట్లు పెంచాలని డిమాండ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారా ?

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష .. తెలంగాణ పోలీసుల ప్రకటన
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష .. తెలంగాణ పోలీసుల ప్రకటన
Sunil Narine 200 IPL Wickets: సునీల్ నరైన్ చరిత్ర.. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన తొలి విదేశీ ప్లేయర్‌గా రికార్డ్!
సునీల్ నరైన్ చరిత్ర.. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన తొలి విదేశీ ప్లేయర్‌గా రికార్డ్! KKR బౌలర్ అరుదైన ఘనత
Akividu Rama Temple: ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
Hyderabad Viral Video: బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
US Iran Tension: అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
Bandla Ganesh Daughter Engagement : బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
Beer in Summer : వేసవిలో బీర్ తాగితే నిజంగా కూల్ అవుతారా? సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
వేసవిలో బీర్ తాగితే నిజంగా కూల్ అవుతారా? సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Telangana Cabinet Expansion: తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరింత సమయం! రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? రేసులో ఉన్నదెవరు?
తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరింత సమయం! రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? రేసులో ఉన్నదెవరు?
Embed widget