అన్వేషించండి

TSPSC Group1 Mains: షెడ్యూలు ప్రకారమే 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పరీక్షలు: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్

రాష్ట్రంలో గ్రూప్-1 ప్రధాన పరీక్షలు (మెయిన్స్) షెడ్యూలు ప్రకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్ రెడ్డి తెలిపారు.

➥ ఇకనుంచి జరిగే అన్ని పరీక్షలకు కొత్త ప్రశ్నపత్రాలు

➥ ప్రిలిమినరీలో ప్రవీణ్‌కు 103 మార్కులే వచ్చాయి

➥ అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షపై మార్చి 15న నిర్ణయం

➥ టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి వెల్లడి

రాష్ట్రంలో గ్రూప్-1 ప్రధాన పరీక్షలు (మెయిన్స్) షెడ్యూలు ప్రకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్ రెడ్డి తెలిపారు. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో అనుమానాలకు తావులేకుండా ఇకనుంచి నిర్వహించే పోటీ పరీక్షలకు కొత్త ప్రశ్నపత్రాలు రూపొందిస్తామని వివరించారు. దీనికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఏప్రిల్ 4 నుంచి జరిగే పరీక్షలన్నీ షెడ్యూలు ప్రకారం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఏఈ పరీక్షపై మార్చి 14న సాయంత్రం సమావేశమై నిర్ణయం తీసుకోవాలని భావించినప్పటికీ పోలీసుల నివేదిక రావడంలో ఆలస్యమైందన్నారు. దీనిపై కమిషన్ బుధవారం (మార్చి 15) నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీలో నమ్మిన ఉద్యోగులే గొంతు కోశారన్నారు. ఏఈ పోస్టుల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, ఉద్యోగ పోటీ పరీక్షలపై వస్తున్న వదంతుల నేపథ్యంలో మార్చి 14న టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో కమిషన్ సభ్యులతో కలిసి జనార్దన్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రశ్నపత్రం లీకేజీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. అందులోనూ, ఫోరెన్సిక్ నివేదికలోనూ మిగతా విషయాలు వెల్లడవుతాయన్నారు.

ప్రిలిమినరీలో ప్రవీణ్‌కు 103 మార్కులు నిజమే, కానీ..
ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు, కమిషన్ కార్యాలయ ఉద్యోగి ప్రవీణ్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాశాడని, అతనికి 103 మార్కులు వచ్చిన మాట వాస్తవమే అని ఛైర్మన్ వెల్లడించారు. పరీక్ష రాసేందుకు ప్రవీణ్ కమిషన్ నుంచి అనుమతి తీసుకున్నాడని తెలిపారు. అతనికి వచ్చిన మార్కులే ఎక్కువంటూ వస్తున్న వదంతులు సరికాదని, అతనికి వచ్చిన మార్కులే ప్రిలిమినరీలో అత్యధికం కాదని జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే ప్రవీణ్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అతను అర్హత సాధించలేదని, గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షపై చాలా వదంతులు వస్తుండటంతో ప్రధాన పరీక్షకు సన్నద్ధమవుతున్న 25 వేల మంది అభ్యర్థుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు. పేద అభ్యర్థులతో పాటు ఉద్యోగాలకు సెలవులు పెట్టి, విదేశాల నుంచి వచ్చి ప్రధాన పరీక్షకు సిద్ధమవుతున్నారు. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన ఆధారాల అనుగుణంగా గ్రూప్-1 మెయిన్ పరీక్షపై షెడ్యూలు ప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ క్లారిటీ ఇచ్చారు. ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా దేశంలోనే అత్యధికంగా 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేశామని, తన పిల్లలు టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాయలేదని, మా మేనల్లుడు రాస్తానంటే ఛైర్మన్ ఉద్యోగం వదిలేస్తానని స్పష్టంగా చెప్పినట్లు జనార్దన్‌రెడ్డి తెలిపారు.

త్వరలో మరో 3వేల పోస్టులకు నోటిఫికేషన్లు..
రాష్ట్రంలో త్వరలో మరో 3 వేలకు పైగా పోస్టులకు రెండు, మూడు నెలల్లో ఉద్యోగ ప్రకటనలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. టీఎస్‌పీఎస్సీ గతేడాది నుంచి ఇప్పటివరకు 41 కేటగిరీల్లో 23 వేల ఉద్యోగాలకు సంబంధించి 26 నోటిఫికేషన్లు జారీ చేసిందన్నారు. ఇప్పటికే ఏడు పరీక్షలు నిర్వహించామని, ఎనిమిదో పరీక్ష టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ (టీపీబీవో) జరగాల్సి ఉంది. అప్పటికే హ్యాక్ అయినట్లు అనుమానం రావడంతో దాన్ని వాయిదా వేశామని ఛైర్మన్ తెలిపారు. మొత్తం 175 టీపీబీవో పోస్టులకు 33 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారన్నారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాల కాపీ ప్రవీణ్ వద్ద దొరికిందని వెల్లడించారు. మరో నిందితుడు రాజశేఖర్ టీఎస్‌పీఎస్సీలో ఏడేళ్లుగా సిస్టమ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. అతనికి అన్ని ఐపీ అడ్రస్‌లు తెలుసు. ఇద్దరూ కలిసి పాస్‌వర్డ్ తస్కరించి హ్యాకింగ్‌కు పాల్పడ్డారు. ఉద్యోగులకు సైబర్ భద్రత, సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై పరిజ్ఞానం పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాం. కమిషన్ కార్యాలయంలో సైబర్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు జనార్దన్ రెడ్డి వివరించారు.

Also Read:

గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్‌ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ
 తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించిన టీఎస్ పీఎస్సీ తాజాగా మంగళవారం నాడు మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు జూన్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్‌ 5 నుంచి 12వ తేదీ వరకు అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రూప్-1 మెయిన్స్‌ నిర్వహించాలని టీఎస్ పీఎస్సీ నిర్ణయించింది. 
గ్రూప్-1 మెయిన్స్‌ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షా విధానం ఖరారు! పేపర్లు, మార్కుల వివరాలు ఇలా!
తెలంగాణలో తొలి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా విధానం ఖరారైంది. నిపుణుల కమిటీ సూచన మేరకు పరీక్షా విధానానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 18న ఆమోదం తెలిపింది. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో మెయిన్స్ పరీక్షా విధానం వివరాలను పొందుపరిచింది. మెయిన్స్ పేపర్ విధానం, సెక్షన్ల వివరాలు, ప్రశ్నల ఛాయిస్ తదితర వివరాలకోసం టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని ఉద్యోగార్థులకు సూచించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఉద్యోగ నియామకాలు వేగవంతం చేయండి, అధికారులకు సీఎస్ ఆదేశం!
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై సీఎస్ మార్చి 14న సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో నియామక బోర్డుల అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. టీఎస్పీఎస్సీ భర్తీ చేస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం లీకైందని తేలడంతో ఉద్యోగ నియామకాలపై సీఎస్ సమీక్ష జరిపారు. 
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Tech Layoffs: 2026లో భారీగా లేఆఫ్స్.. ఇప్పటివరకే 1 లక్షకు పైగా ఉద్యోగాలు తొలగింపు
2026లో భారీగా లేఆఫ్స్.. ఇప్పటివరకే 1 లక్షకు పైగా ఉద్యోగాలు తొలగింపు
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
Meta Layoffs 2026: ఫేస్‌బుక్‌లో 8వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ - ఈ సీనియర్ మేనేజర్ వేదన ఏఐ పాపమే !
ఫేస్‌బుక్‌లో 8వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ - ఈ సీనియర్ మేనేజర్ వేదన ఏఐ పాపమే !
Tourist Guide Jobs In Telangana: తెలంగాణలోని ౩౩ జిల్లాల్లో గైడ్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం! అర్హతలు ఇవే! అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలోని ౩౩ జిల్లాల్లో గైడ్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం! అర్హతలు ఇవే!

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Embed widget