అన్వేషించండి

బిహార్‌ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్‌ 2025

(Source:  Poll of Polls)

TS Gurukula Exams: గురుకుల రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా

తెలంగాణలోని గురుకుల విద్యాలయాల్లో 9,210 టీచర్లు, లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన కంప్యూటర్‌ ఆధారిత నియామక పరీక్షల (సీబీఆర్‌టీ) హాల్‌టికెట్లను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది.

తెలంగాణలోని గురుకుల విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన కంప్యూటర్‌ ఆధారిత నియామక పరీక్షల (సీబీఆర్‌టీ) హాల్‌టికెట్లను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను మాత్రమే అందుబాటులో ఉంచారు. త్వరలోనే మిగతా పరీక్షల హాల్‌టికెట్లను విడుదల చేయనున్నారు.
Hall-ticket for Art, Craft & Music exams

పరీక్ష షెడ్యూలులో గురుకుల నియామక బోర్డు స్వల్ప మార్పులు చేసింది. కొన్ని విడతల్లోని సబ్జెక్టులను ఇతర విడతలకు బదిలీ చేసింది. తొలుత ఆగస్టు 1 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపిన బోర్డు... తాజాగా ఆగస్టు 23 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. పోస్టుల కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ప్రతిరోజూ మూడు షిప్టుల్లో పరీక్షలు ఉంటాయి. మొదటి షిఫ్టు పరీక్ష ఉదయం 8.30 నుంచి 10.30 వరకు, రెండో షిప్టు పరీక్ష మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు, మూడో షిఫ్టు పరీక్ష సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు జరుగుతాయి.

తెలంగాణలో గురుకుల నియామ‌క ప‌రీక్షల షెడ్యూలులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగ‌స్టు 1 నుంచి 22 వ‌ర‌కు కంప్యూట‌ర్ ఆధారిత రాత ప‌రీక్షలు జరగాల్సి ఉండగా.. ఆగస్టు 23 వరకు నిర్వహించనున్నారు. ఈ ప‌రీక్షల‌కు సంబంధించిన హాల్‌టికెట్లను జులై 24న విడుదల కానున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 9 నోటిఫికేషన్లను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. ఈ పోస్టుల‌కు సంబంధించిన రాత ప‌రీక్షల‌ను ఆగ‌స్టు 1 నుంచి 23 వ‌ర‌కు మూడు షిఫ్ట్‌ల్లో నిర్వహించ‌నున్నారు. మొద‌టి షిఫ్ట్ ఉద‌యం 8:30 నుంచి 10:30 వ‌ర‌కు, రెండో షిఫ్ట్ 12:30 నుంచి మ‌ధ్యాహ్నం 2:30 వ‌ర‌కు, మూడో షిఫ్ట్ సాయంత్రం 4:30 నుంచి 6:30 గంట‌ల వ‌ర‌కు నిర్వహించ‌నున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.66 లక్షల మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా టీజీటీ, పీజీటీ పోస్టులకు కలిపి 1.6 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. టీజీటీ పోస్టులు నాలుగు వేలు ఉండగా.. ఈ పోస్టులకు మాత్రమే వచ్చిన దరఖాస్తులు లక్షకు చేరువలో ఉన్నాయి. మరోవైపు  పీజీటీ పోస్టులకు దరఖాస్తుల సంఖ్య 60 వేలు దాటాయి. ఒకే అభ్యర్థి గరిష్ఠంగా ఏడు పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించడంతో.. కొందరు అభ్యర్ధులు తాము అర్హత కలిగిన అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉద్యోగాలకు ఓటీఆర్‌ల సంఖ్య 1.5 లక్షలకుపైగా వచ్చాయి.

గురుకుల నియామక పరీక్షల కొత్త షెడ్యూలు ఇలా..

TS Gurukula Exams: గురుకుల రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలాTS Gurukula Exams: గురుకుల రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా

TS Gurukula Exams: గురుకుల రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా

 

 

పోస్టుల వివరాలు..

క్ర.సం. పోస్టు పేరు పోస్టుల సంఖ్య
1. డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్‌ 868
2. జూనియ‌ర్ లెక్చరర్‌, లైబ్రేరియన్‌, ఫిజికల్ డైరెక్టర్ 2008
3. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ) 1276
4. ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (టీజీటీ) 4020
5. లైబ్రేరియ‌న్ స్కూల్ 434
6. ఫిజిక‌ల్ డైరెక్టర్స్‌ ఇన్ స్కూల్ 275
7. డ్రాయింగ్ టీచ‌ర్స్ ఆర్ట్ టీచ‌ర్స్ 134
8. క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్‌ క్రాఫ్ట్ టీచ‌ర్స్ 92
9. మ్యూజిక్ టీచ‌ర్స్ 124
  మొత్తం ఖాళీలు 9210

ALSO READ:

ఎఎస్‌ఐ అభ్యర్థులకు అలర్ట్, 'స్టేజ్-2' దరఖాస్తు తేదీలు వెల్లడి!
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికైన అభ్యర్థులకు స్టేజ్-2 దరఖాస్తు ప్రక్రియ షెడ్యూలు వెలువడింది. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ)లకు అర్హత సాధించిన అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాలని ఏపీ పోలీసు నియామక మండలి జులై 19న వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎస్‌ఐ (సివిల్), రిజర్వ్ ఎస్సై(ఏపీఎస్సీ) అభ్యర్థుల పీఎంటీ/ పీఈటీ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ జులై 21న ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 3న సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని బోర్డు తెలిపింది. అభ్యర్థులందరూ సంబంధిత సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని సూచించింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
YS Jagan:  వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
Bihar News: బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
Delhi Blasts Case: షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
Advertisement

వీడియోలు

Bihar Election 2025 Exit Poll Results | బీహార్‌లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆశ్చర్యకర ఫలితాలు | ABP Desam
PM Modi First Reaction on Delhi Blast | ఢిల్లీ బ్లాస్ట్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్
Drone in Jubilee Hills Bypoll | ఎన్నికల్లో ఇదే మొదటిసారి డ్రోన్ ప్రయోగం
White Collar Terror Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
White Collar Terror Attack Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills By-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
YS Jagan:  వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
Bihar News: బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
Delhi Blasts Case: షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
Priyanka Jawalkar: అరెరే ప్రియాంక... కుర్రకారు గుండెలు అదిరేలా... లేటెస్ట్ ఫోటోలు చూశారా?
అరెరే ప్రియాంక... కుర్రకారు గుండెలు అదిరేలా... లేటెస్ట్ ఫోటోలు చూశారా?
Ande Sri Last Rites: అందెశ్రీ పాడె మోసిన రేవంత్‌ రెడ్డి.. పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్న  సీఎం
అందెశ్రీ పాడె మోసిన రేవంత్‌ రెడ్డి.. పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్న సీఎం
Gopi Galla Goa Trip: నిరుద్యోగ నటులు నుంచి గోవాకు... పర్మిషన్స్ లేకుండా అవుట్‌ డోర్‌లో... సినిమా ఎలా చేశారంటే?
నిరుద్యోగ నటులు నుంచి గోవాకు... పర్మిషన్స్ లేకుండా అవుట్‌ డోర్‌లో... సినిమా ఎలా చేశారంటే?
Surendra Koli: ఉరిశిక్ష పడినా నిర్దోషిగా బయటకు వస్తున్న కోలీ - మరో సారి హాట్ టాపిక్ గా మారిన నిథారీ హత్యల కేసు
ఉరిశిక్ష పడినా నిర్దోషిగా బయటకు వస్తున్న కోలీ - మరో సారి హాట్ టాపిక్ గా మారిన నిథారీ హత్యల కేసు
Embed widget