అన్వేషించండి

TGPSC Group 3 Key: 'గ్రూప్‌-3' అభ్యర్థులకు అలర్ట్ - వెబ్‌సైట్‌లో ఆన్సర్ ‘కీ’లు అందుబాటులో, అభ్యంతరాల నమోదుకు అవకాశం

Telangana: తెలంగాణలో గ్రూప్‌-3 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షల ఆన్సర్ కీలు విడుదలయ్యాయి. ఆన్సర్ కీలపై అభ్యంతరాలకు టీజీపీఎస్సీ అవకాశం కల్పించింది. ఆన్‌లైన్ విధానంలో అభ్యంతరాలు తెలపాలి.

TGPSC Group3 Answer Key: తెలంగాణలో గ్రూప్-3 పోస్టుల భర్తీకి నిర్వహించిన పేపర్-1, పేపర్-2, పేపర్-3 రాతపరీక్షల ఆన్సర్ కీలను టీజీపీఎస్సీ (TGPSC) జనవరి 8న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ ఐడీ, తమ గ్రూప్-3 హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి సమాధానాలు సరిచూసుకోవచ్చు. ఆన్సర్ కీలు జనవరి 12 వరకు అందుబాటులో ఉండనున్నాయి. అన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు కమిషన్ అవకాశం కల్పించింది. అభ్యర్థులు జనవరి 8 నుంచి జనవరి 12న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు నమోదుచేయవచ్చు. ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది.

గ్రూప్-3 ఆన్సర్ కీ అభ్యంతరాల నమోదు కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ 1365 గ్రూప్-3 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు అదనంగా 13 పోస్టులు జతచేయడంతో.. మొత్తం ఖాళీల సంఖ్య 1388కి చేరింది. వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో 2024, నవంబర్‌ 17,18 తేదీల్లో పేపర్-1, పేపర్-2, పేపర్-3 పరీక్షలను కమిషన్ విజయవంతంగా నిర్వహించింది. నవంబర్ 17న జరిగిన గ్రూప్-3 పేపర్-1 పరీక్షకు 2,73,847 (51.1%) మంది హాజరయ్యారు. పేపర్-2కు 2,72,173 (50.7%) మంది మాత్రమే హాజరయ్యారు. అంటే తొలిరోజు మొత్తం కలిపి 50.70 శాతం హాజరు నమోదైందని టీజీపీఎస్సీ తెలిపింది. ఇక నవంబరు 18న నిర్వహించిన పేపర్-3 పరీక్షకు 50.24 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

పరీక్షా విధానం..
గ్రూప్-3 పరీక్షలో మెుత్తం మూడు పేపర్లకు పరీక్షలు నిర్వహించారు. ప్రతి పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి. అలా మూడు పేపర్లకు కలిపి మొత్తం 450 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్ రాసేందుకు రెండన్నర గంటల సమయం కేటాయించారు. ఒక ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మూడు పేపర్లకు 450 మార్కులు ఉంటాయి. ఇక పరీక్షలు మూడు భాషల్లో నిర్వహించారు. తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో పరీక్షలు ఉంటాయి. గ్రూప్-3 పోస్టులకు ఎలాంటి ఇంటర్వూ ఉండదు. అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులు కొలువు సాధిస్తారు. మూడు పేపర్లలోనూ జనరల్ నాల్జెడ్, భారత రాజ్యాంగం, భారత చరిత్ర, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, రాష్ట్ర ఏర్పాటు, భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

రెండ్రోజుల్లో గ్రూప్‌ -2 ‘కీ’..
తెలంగాణలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాతపరీక్షల ఆన్సర్ కీలు రెండురోజుల్లో విడుదల కానుంది. ఈ మేరకు టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం ఫలితాలు వచ్చేలా పనిచేస్తున్నామని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. జనవరి 11, 12 తేదీల్లో బెంగళూరులో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల సదస్సు ఉంటుందని, ఉద్యోగ పరీక్షల విధానాలపై ఆ సదస్సులో చర్చించనున్నట్టు ఛైర్మన్ తెలిపారు. 

* గ్రూప్-3 పోస్టుల వివరాలు..

ఖాళీల సంఖ్య: 1388

1) జూనియర్ అసిస్టెంట్: 680 పోస్టులు

2) సీనియర్ అకౌంటెంట్: 436 పోస్టులు

3) ఆడిటర్: 126 పోస్టులు

4) సీనియర్ ఆడిటర్: 61 పోస్టులు

5) అసిస్టెంట్ ఆడిటర్: 23 పోస్టులు

6) జూనియర్ అకౌంటెంట్: 61 పోస్టులు 

7) అకౌంటెంట్: 01 పోస్టు

TGPSC Group 3 Key: 'గ్రూప్‌-3' అభ్యర్థులకు అలర్ట్ - వెబ్‌సైట్‌లో ఆన్సర్ ‘కీ’లు అందుబాటులో, అభ్యంతరాల నమోదుకు అవకాశం

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Rising Summit: PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
Advocate Rakesh Kishore: సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన

వీడియోలు

Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Irfan Pathan Comments on Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Rising Summit: PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
Advocate Rakesh Kishore: సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Akhanda 2 Release Updates: 'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
Amaravati Farmers: అమరావతి రైతులు ముందుకొచ్చి తమ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: మంత్రి నారాయణ
అమరావతి రైతులు ముందుకొచ్చి ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: మంత్రి నారాయణ
Embed widget