అన్వేషించండి

AP Police: కోర్టుకెక్కిన ఎస్‌ఐ అభ్యర్థులు, డిజిటల్‌ మీటర్‌తో ఎత్తు కొలవడంపై అభ్యంతరం

ఏపీలో ఎస్‌ఐ నియామక ప్రక్రియలో ఛాతీ, ఎత్తు డిజిటల్‌ మీటర్‌ ద్వారా లెక్కించడంతో అనర్హులయ్యామని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆంధప్రదేశ్‌లో పోలీసు నియామకాల భర్తీ ప్రక్రియలో అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఎస్‌ఐ నియామక ప్రక్రియలో ఛాతీ, ఎత్తు డిజిటల్‌ మీటర్‌ ద్వారా లెక్కించడంతో అనర్హులయ్యామని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిజిటల్‌గా కాకుండా మాన్యువల్‌గానే ఫిజికల్ పరీక్షలు నిర్వహించేలా పోలీసు నియామక బోర్డును ఆదేశించాలని వారు కోర్టును కోరారు. ఈ పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుజాత అక్టోబర్‌ 12న విచారణ జరిపారు. 

విచారణలో భాగంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 56 వేల మంది ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలకు హాజరయ్యారని.. వారిలో సరిపడా ఎత్తు లేరనే కారణంగా 5 వేల మందిని తిరస్కరించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది జడ శ్రవణ్‌ కోర్టుకు తెలిపారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులందరూ 2019లో క్వాలిఫై అయినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. 2019లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఇప్పుడెందుకు తిరస్కరణకు గురయ్యారని ధర్మాసనం ప్రశ్నించింది. 2019లో నిర్వహించిన పరీక్షల్లో ఎత్తు విషయంలో అర్హత సాధించిన పిటిషనర్లు ప్రస్తుతం డిజిటల్‌ మీటర్‌ను వినియోగించడంతో అనర్హులయ్యారన్నారు.

ప్రతి అభ్యర్థి విషయంలో చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అక్టోబరు 14, 15 తేదీల్లో జరిగే మెయిన్స్‌ను తాత్కాలికంగా వాయిదా వేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాల వల్ల నోటిఫికేషన్‌ రద్దు చేయాలని కోరారు. నిబంధనల మేరకే వ్యవహరించామని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. 

ALSO READ:

మెయిన్ పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ అక్టోబరు 14న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.

➥ అక్టోబరు 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-3 పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-4 పరీక్ష నిర్వహిస్తారు.

🔰 మెయిన్ పరీక్ష విధానం: 

➨ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.

➨  సివిల్ ఎస్‌ఐ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.

➨  ఏపీఎస్‌పీ ఎస్‌ఐ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.

➨ ఇంగ్లిష్, తెలుగు, ఉర్డూ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

➨ ఎస్‌ఐ తుది పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1 ఇంగ్లిష్ (డిస్క్రిప్టివ్), పేపర్-2 తెలుగు/ఉర్దూ (డిస్క్రిప్టివ్), పేపర్-2 అరిథ్‌మెటిక్ & రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్), పేపర్-4 జనరల్ స్టడీస్(ఆబ్జెక్టివ్) ఉంటాయి. వీటిలో పేపర్-1, పేపర్-2 కేవలం అర్హత పరీక్షలు మాత్రమే.

ఏ కేంద్రంలో ఎంత మంది?

ఫిజికల్ ఈవెంట్లలో మొత్తం 31,193 మంది అభ్యర్థులు సాధించారు. వీరిలో పురుషులు-27,590 మంది, స్త్రీలు-3603 మంది పరీక్షకు హాజరుకానున్నారు. వీరికి రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 

➥ విశాఖపట్నం కేంద్రంలో మొత్తం 11,365 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో పురుషులు-9913, స్త్రీలు-1452 మంది పరీక్షలు రాయనున్నారు.

➥ ఏలూరు కేంద్రంలో మొత్తం 4162 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో పురుషులు-3649, స్త్రీలు-513 మంది పరీక్షలు రాయనున్నారు.

➥ గుంటూరు కేంద్రంలో మొత్తం 7145 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో పురుషులు-6384, స్త్రీలు-761 మంది పరీక్షలు రాయనున్నారు.

➥ కర్నూలు కేంద్రంలో మొత్తం 8521 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో పురుషులు-7644, స్త్రీలు-877 మంది పరీక్షలు రాయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్సై పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‌లో పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,51,288 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 57,923 మంది అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. వీరిలో 49,386 మంది పురుషులు, 8537 మహిళలు ఉన్నారు. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన 31,193 మంది అభ్యర్థులకు మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఎస్‌ఐ పోస్టుల నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Movie Ticket Rates: సినిమా టిక్కెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన - కార్మికులకు వాటా ఇస్తేనే ఇక జీవో !
సినిమా టిక్కెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన - కార్మికులకు వాటా ఇస్తేనే ఇక జీవో !
Cyclone Montha Impact In AP: మొంథా తుపాను బీభత్సం.. రైల్వే ట్రాక్స్ ధ్వంసం, పలుచోట్ల నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
మొంథా తుపాను బీభత్సం.. రైల్వే ట్రాక్స్ ధ్వంసం, పలుచోట్ల నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
UPSC aspirant murder case: ప్రేమికుడ్ని మాజీ లవర్స్‌తో కలిసి చంపేసిన కేసులో ట్విస్ట్ - వెబ్ సిరిస్ చూసే ప్లాన్ చేసింది !
ప్రేమికుడ్ని మాజీ లవర్స్‌తో కలిసి చంపేసిన కేసులో ట్విస్ట్ - వెబ్ సిరిస్ చూసే ప్లాన్ చేసింది !
Telugu TV Movies Today: చిరంజీవి ‘కొదమసింహం’, నాగార్జున ‘ఢమరుకం’ TO పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్, ప్రభాస్ ‘మున్నా’ వరకు - ఈ బుధవారం (అక్టోబర్ 29) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..
చిరంజీవి ‘కొదమసింహం’, నాగార్జున ‘ఢమరుకం’ TO పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్, ప్రభాస్ ‘మున్నా’ వరకు - ఈ బుధవారం (అక్టోబర్ 29) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..
Advertisement

వీడియోలు

What is Digital Arrest | డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటీ ? | ABP Desam
India vs Australia Playing 11 | టీ20 మ్యాచ్ కు భారత్ ప్లేయింగ్ 11 ఇదే
Pratika Rawal Ruled Out | ప్ర‌పంచ‌క‌ప్ నుంచి త‌ప్పుకున్న ప్ర‌తీకా రావ‌ల్‌
Australia vs India T20 Preview | రేపే ఇండియా ఆసీస్ మధ్య మొదటి టీ20
India vs South Africa Test Team | టీమ్ ను ప్రకటించిన దక్షిణాఫ్రికా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Movie Ticket Rates: సినిమా టిక్కెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన - కార్మికులకు వాటా ఇస్తేనే ఇక జీవో !
సినిమా టిక్కెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన - కార్మికులకు వాటా ఇస్తేనే ఇక జీవో !
Cyclone Montha Impact In AP: మొంథా తుపాను బీభత్సం.. రైల్వే ట్రాక్స్ ధ్వంసం, పలుచోట్ల నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
మొంథా తుపాను బీభత్సం.. రైల్వే ట్రాక్స్ ధ్వంసం, పలుచోట్ల నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
UPSC aspirant murder case: ప్రేమికుడ్ని మాజీ లవర్స్‌తో కలిసి చంపేసిన కేసులో ట్విస్ట్ - వెబ్ సిరిస్ చూసే ప్లాన్ చేసింది !
ప్రేమికుడ్ని మాజీ లవర్స్‌తో కలిసి చంపేసిన కేసులో ట్విస్ట్ - వెబ్ సిరిస్ చూసే ప్లాన్ చేసింది !
Telugu TV Movies Today: చిరంజీవి ‘కొదమసింహం’, నాగార్జున ‘ఢమరుకం’ TO పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్, ప్రభాస్ ‘మున్నా’ వరకు - ఈ బుధవారం (అక్టోబర్ 29) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..
చిరంజీవి ‘కొదమసింహం’, నాగార్జున ‘ఢమరుకం’ TO పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్, ప్రభాస్ ‘మున్నా’ వరకు - ఈ బుధవారం (అక్టోబర్ 29) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..
World Stroke Day : ప్రపంచ స్ట్రోక్ డే.. FAST టెస్ట్ అంటే ఏమిటి? స్ట్రోక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
వరల్డ్ స్ట్రోక్ డే.. FAST టెస్ట్ అంటే ఏమిటి? స్ట్రోక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Ravi Teja Sreeleela Dance : స్టేజ్‌పై రవితేజ, శ్రీలీల డ్యాన్స్ - మాస్ మహారాజ్ డైలాగ్ రీ క్రియేట్ చేసిన సూర్య... 'మాస్ జాతర' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్
స్టేజ్‌పై రవితేజ, శ్రీలీల డ్యాన్స్ - మాస్ మహారాజ్ డైలాగ్ రీ క్రియేట్ చేసిన సూర్య... 'మాస్ జాతర' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్
Fact Check: అమిత్ షా బీహార్ ఓటర్లను బెదిరించారని చెప్పే  ABP న్యూస్  వైరల్  గ్రాఫిక్ ఫేక్ - ఇదిగో నిజం
అమిత్ షా బీహార్ ఓటర్లను బెదిరించారని చెప్పే ABP న్యూస్ వైరల్ గ్రాఫిక్ ఫేక్ - ఇదిగో నిజం
Montha Cyclone Update: ఏపీ వ్యాప్తంగా సైక్లోన్ మొంథా ప్రభావం -  పలు చోట్ల వర్షాలు గాలులు - అధికారయంత్రాంగం అప్రమత్తం !
ఏపీ వ్యాప్తంగా సైక్లోన్ మొంథా ప్రభావం - పలు చోట్ల వర్షాలు గాలులు - అధికారయంత్రాంగం అప్రమత్తం !
Embed widget