అన్వేషించండి

RRB Exam schedule: రైల్వే ఉద్యోగాల రాతపరీక్షల షెడ్యూలులో మార్పులు, కొత్త తేదీలు ఇవే

RRB Exams: రైల్వేశాఖలో ఖాళీల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షల తేదీల్లో ఆర్‌ఆర్‌బీ మార్పులు చేసింది. ఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ, టెక్నీషియన్, జేఈ రాతపరీక్ష షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి.

RRB Recruitment Exams 2024 Schedule: దేశంలోని వివిధ రైల్వేజోన్ల పరిధిలో 41,500 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాతపరీక్షల తేదీలను ఇటీవల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆ షెడ్యూలులో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఆర్‌పీఎఫ్‌ ఎస్సై, టెక్నీషియన్, జేఈ రాత పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. పరీక్షల కొత్త షెడ్యూలును రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల షెడ్యూలును అందుబాటులో ఉంచింది. తాజాగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. నవంబరు 25 నుంచి డిసెంబరు 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో నవంబరు 25 నుంచి 29 మధ్య అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షలు, డిసెంబరు 2 నుంచి 12 వరకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఎస్ఐ పోస్టులకు, డిసెంబరు 13 నుంచి 17 వరకు జూనియర్ ఇంజినీర్, ఇతర పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక డిసెంబరు 18 నుంచి 29 మధ్య టెక్నీషియన్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. 

రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలకు పది రోజుల ముందు ఎగ్జామ్‌ సిటీ, పరీక్షల తేదీ వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షకు ఆధార్‌ లింక్‌డ్‌ బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ తప్పనిసరి కాబట్టి అభ్యర్థులు ఒరిజినల్‌ ఆధార్‌ కార్డును తీసుకురావాల్సి ఉంటుంది.

దేశంలోని రైల్వే జోన్లలో మొత్తం 41,500 ఖాళీలను ఈ పరీక్షల ద్వారా భర్తీచేయనున్నారు. ఇందులో 18,799 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు; 452 ఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ పోస్టులు; 14,298 టెక్నీషియన్‌ పోస్టులు; 7,951 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు ఉన్నాయి. అయితే ఇందులో అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్‌పీఎఫ్‌ ఎస్ఐ, జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు గడువు ఇప్పటికే ముగియగా.. టెక్నీషియన్‌ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆయా పోస్టులను అనుసరించి రాత పరీక్షలు, స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రైల్వే రాతపరీక్షల షెడ్యూలు...

➥ అసిస్టెంట్ లోకో పైలట్ (సీబీటీ-1): 25.11.2024 నుంచి 29.11.2024 వరకు.

➥ ఆర్‌పీఎఫ్‌ ఎస్ఐ: 02.12.2024 నుంచి 12.12.2024 వరకు.

➥ టెక్నీషియన్: 18.12.2024 నుంచి 29.12.2024 వరకు.

➥ జూనియర్ ఇంజినీర్, ఇతర పోస్టులకు: 13.12.2024 నుంచి 17.12.2024 వరకు.

ఈ పరీక్షలన్నీ నవంబర్‌, డిసెంబరులోనే నిర్వహించనున్నారు. పరీక్షకు 10 రోజుల ముందు ఎగ్జామ్‌ సిటీ, తేదీ వివరాలు, నాలుగు రోజుల ముందు అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని రైల్వే శాఖ పేర్కొంది. పరీక్షకు ఆధార్‌ లింక్‌డ్‌ బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ తప్పనిసరి కాబట్టి అభ్యర్థులు ఒరిజినల్‌ ఆధార్‌ కార్డును తీసుకురావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అన్ని రైల్వే జోన్లలో 18799 అసిస్టెంట్ లోకో పైలట్; 452 ఆర్‌పీఎఫ్‌ ఎస్సై; 14298 టెక్నీషియన్‌; 7951 జూనియర్‌ ఇంజినీర్‌.. మొత్తంగా 41,500 ఖాళీల భర్తీకి ఈ నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. ఎన్‌టీపీసీ, పారామెడికల్‌, ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు రాత పరీక్ష తేదీలు ప్రకటించాల్సి ఉంది. టెన్త్‌, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఆయా పోస్టులను అనుసరించి రాత పరీక్షలు, స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

RRB Exam schedule: రైల్వే ఉద్యోగాల రాతపరీక్షల షెడ్యూలులో మార్పులు, కొత్త తేదీలు ఇవే

ALSO READ: యూనియన్ బ్యాంకులో 1,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు, ఎంపికైతే రూ.85 వేల వరకు జీతం

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MI vs CSK Highlights: సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
CM Revanth Reddy: త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Retired Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs CSK Match HighLights IPL 2025 | చెన్నై సూపర్ కింగ్స్ పై 9వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీPBKS vs RCB Match Highlights IPL 2025 | పంజాబ్ కింగ్స్ పై 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం | ABP DesamMI vs CSK Match Preview IPL 2025 | నేడు వాంఖడేలో ముంబైని ఢీకొడుతున్న చెన్నై | ABP DesamPBKS vs RCB Match preview IPL 2025 | బెంగుళూరులో ఓటమికి పంజాబ్ లో ప్రతీకారం తీర్చుకుంటుందా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MI vs CSK Highlights: సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
CM Revanth Reddy: త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Retired Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
Ayush Mhatre Record: నిన్న వైభవ్,  నేడు ఆయుష్ మాత్రే.. ఐపీఎల్‌లో మరో యువ సంచలనం అరంగేట్రం
నిన్న వైభవ్, నేడు ఆయుష్ మాత్రే.. ఐపీఎల్‌లో మరో యువ సంచలనం అరంగేట్రం
Odela 3: 'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?
'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
PBKS vs RCB: విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
Embed widget