అన్వేషించండి

UPSC: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 దరఖాస్తుకు నేటితో ముగియనున్న గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ను సెప్టెంబరు 6న విడుదల చేసిన సంగతి తెలసిందే. సెప్టెంబరు 26తో గడువు ముగియనుంది

యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ను సెప్టెంబరు 6న విడుదల చేసిన సంగతి తెలసిందే. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 6న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. సెప్టెంబరు 26తో గడువు ముగియనుంది. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. 

వివరాలు..

* ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2024

పోస్టుల సంఖ్య: 167

విభాగాలు: సివిల్, మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీక‌మ్యూనికేష‌న్.

సంస్థలు: ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్, సర్వే ఆఫ్ ఇండియా, బోర్డర్ రోడ్ ఇంజినీరింగ్ సర్వీసెస్, ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్, ఎంఈఎస్ సర్వేయర్ క్యాడర్, నావెల్ అర్మామెంట్ సర్వీసెస్, జూనియర్ టెలికమ్ ఆఫీసర్ (టెలికమ్ సర్వీసెస్).

విద్యార్హతలు: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ డిగ్రీ/ రేడియో రెగ్యులేటరీ సర్వీసెస్‌లో పోస్టులకు ఫిజిక్స్ లేదా రేడియో ఫిజిక్స్/ వైర్‌లెస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.

వ‌యోప‌రిమితి:
 01.01.2024 నాటికి నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం:
 యూపీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం..

➦ రాత‌ప‌రీక్ష,  ఇంటర్వ్యూ/పర్సనల్ టెస్ట్, మెడికల్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

➦ ప‌రీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. ప్రిలిమిన‌రీ (స్టేజ్‌-1), మెయిన్స్ (స్టేజ్-2).

➦ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన‌వారిని మెయిన్‌ ప‌రీక్షకు ఎంపిక చేస్తారు.

➦ మెయిన్స్ వచ్చిన మార్కులను ఆధారంగా స్టేజ్-3 పర్సనాలిటి టెస్ట్(ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. 

పరీక్ష ఇలా...

➦ ప్రిలిమినరీ పరీక్ష: మొత్తం 500 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో 200 మార్కులకు పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ ఇంజినీరింగ్ ఆప్టిట్యూడ్), 300 మార్కులకు పేపర్-2 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్) పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1 పరీక్షకు 2 గంటలు, పేపర్-1 పరీక్షకు 3 గంటల సమయం కేటాయిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి.

➦ మెయిన్ పరీక్ష: మొత్తం 600 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో 300 మార్కులకు పేపర్-1 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్), 300 మార్కులకు పేపర్-2 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్) పరీక్ష నిర్వహిస్తారు.  ఒక్కో పేపర్‌కు 3 గంటల చొప్పున సమయం కేటాయిస్తారు. కన్వెన్షల్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నంలో పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➦ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 06.09.2023.

➦ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివ‌రితేదీ: 26.09.2023.

➦ దరఖాస్తుల సవరణ తేదీలు: 27.09.2023 - 03.10.2023.

➦ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేదీ: 18.02.2024.

Notification

Online Application

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
Chandrababu Visits Tirumala: దేవాన్ష్ బర్త్‌డే- కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
దేవాన్ష్ బర్త్‌డే- కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
Hyderabad Metro Rail: ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్ కేసుల ఎఫెక్ట్, హైదరాబాద్ మెట్రో ఎండీ కీలక నిర్ణయం
ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్ కేసుల ఎఫెక్ట్, హైదరాబాద్ మెట్రో ఎండీ కీలక నిర్ణయం
Ram Charan: రామ్ చరణ్ 'పెద్ది' రిలీజ్ డేట్ ఫిక్స్... నెక్స్ట్ ఇయర్ పుట్టినరోజుకు స్పెషల్ గిఫ్ట్!
రామ్ చరణ్ 'పెద్ది' రిలీజ్ డేట్ ఫిక్స్... నెక్స్ట్ ఇయర్ పుట్టినరోజుకు స్పెషల్ గిఫ్ట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return to Earth | సునీత సాహసంపై Cousin Dinesh Rawal మాటల్లో | ABP DesamSSMB29 Location | ఒడిశా అడవుల్లో జక్కన్న | ABP DesamBRS MLAs Supreme Court Affidavit | వేటు పడకుండా..10మంది BRS ఎమ్మెల్యేల రహస్య వ్యూహం..! | ABPNara Lokesh Holds Jr NTR Flexi | లోకేశ్ చర్యల వెనుక రీజన్ ఇదేనా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
Chandrababu Visits Tirumala: దేవాన్ష్ బర్త్‌డే- కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
దేవాన్ష్ బర్త్‌డే- కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
Hyderabad Metro Rail: ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్ కేసుల ఎఫెక్ట్, హైదరాబాద్ మెట్రో ఎండీ కీలక నిర్ణయం
ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్ కేసుల ఎఫెక్ట్, హైదరాబాద్ మెట్రో ఎండీ కీలక నిర్ణయం
Ram Charan: రామ్ చరణ్ 'పెద్ది' రిలీజ్ డేట్ ఫిక్స్... నెక్స్ట్ ఇయర్ పుట్టినరోజుకు స్పెషల్ గిఫ్ట్!
రామ్ చరణ్ 'పెద్ది' రిలీజ్ డేట్ ఫిక్స్... నెక్స్ట్ ఇయర్ పుట్టినరోజుకు స్పెషల్ గిఫ్ట్!
Betting Apps Promotion Case: విష్ణుప్రియను బుక్ చేసిన రీతూ చౌదరి- 25న మళ్లీ విచారణకు పిలిచిన పోలీసులు  
విష్ణుప్రియను బుక్ చేసిన రీతూ చౌదరి- 25న మళ్లీ విచారణకు పిలిచిన పోలీసులు  
Chhattisgarh Encounters: తుపాకుల మోతతో దద్దరిల్లిన బస్తర్- ఎన్‌కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మృతి, ఓ జవాన్ వీరమరణం
తుపాకుల మోతతో దద్దరిల్లిన బస్తర్- ఎన్‌కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మృతి, ఓ జవాన్ వీరమరణం
నల్లగా ఉందని అవమానించారు... ఆవిడ ప్లేస్‌లో కుక్క... తెలుగు స్టార్‌కు రెండో భార్యగా... ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు చేసే స్థాయికి!
నల్లగా ఉందని అవమానించారు... ఆవిడ ప్లేస్‌లో కుక్క... తెలుగు స్టార్‌కు రెండో భార్యగా... ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు చేసే స్థాయికి!
CM Revanth Reddy: తిరుమల శ్రీవారి దర్శనాలకు ఏపీ వాళ్లను అడుక్కోవడం అవసరమా ? సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తిరుమల శ్రీవారి దర్శనాలకు ఏపీ వాళ్లను అడుక్కోవడం అవసరమా ? సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Embed widget