అన్వేషించండి

BEL Recruitment 2021: ఎలాంటి పరీక్షలు లేకుండానే బెల్‌లో ఉద్యోగాలు... రూ.50 వేల వరకు జీతం...

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 511 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ట్రెయినీ ఇంజనీర్, ప్రాజెక్టు ఇంజనీర్ పోస్టులను దీని ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు స్వీకరణ ఆగస్టు 15తో ముగుస్తుంది.

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్), బెంగళూరు యూనిట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 511 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు స్వీకరణ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు ఆగస్టు 15వ తేదీతో ముగియనుంది. దరఖాస్తులను ఆన్‌లైన్‌ విధానంలో స్వీకరిస్తోంది. ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.

దీని ద్వారా ట్రెయినీ ఇంజనీర్ 1, ప్రాజెక్టు ఇంజనీర్ 1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బెల్ తెలిపింది. అకడమిక్ మార్కుల్లో మెరిట్, పోస్టులకు సంబంధించిన రంగాల్లో అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అర్హులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. మరిన్ని వివరాల కోసం https://bel-india.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని సూచించింది. 

విద్యార్హత వివరాలు.. 
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి బీఈ/ బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్/ టెలీ కమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ట్రెయినీ ఇంజనీర్‌ పోస్టులకు ఫ్రెషర్‌ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులకు రెండేళ్ల అనుభవం తప్పనిసరి. 

వయో పరిమితి, దరఖాస్తు ఫీజు..
ట్రెయినీ ఇంజనీర్ పోస్టులకు 2021 ఆగస్టు 1 నాటికి గరిష్టంగా 25 ఏళ్ల వయసు ఉండాలి. ప్రాజెక్టు ఇంజనీర్ పోస్టులకు 2021 ఆగస్టు 1 నాటికి 28 ఏళ్ల వయసు మించకూడదు. రిజర్వేషన్ల ఆధారంగా.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయో పరిమితి ఉంది. 
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు.. ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 పోస్టులకు రూ.500, ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు రూ.200 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: SSB Head Constable Recruitment 2021: ఎస్ఎస్‌బీలో హెడ్ కానిస్టేబుల్ జాబ్స్.. రూ.81 వేల వరకూ జీతం..

రిజర్వేషన్ల వారీగా పోస్టుల వివరాలు.. 
1. ట్రెయినీ ఇంజనీర్ 1 పోస్టులు (308)
జనరల్- 124 
ఈడబ్ల్యూఎస్- 31
ఓబీసీ- 83
ఎస్సీ- 47
ఎస్టీ- 23
2. ప్రాజెక్టు ఇంజనీర్ 1 పోస్టులు (203)
జనరల్- 84
ఈడబ్ల్యూఎస్- 21
ఓబీసీ- 54
ఎస్సీ- 30
ఎస్టీ- 14

రూ.50 వేల వరకూ జీతం..
ట్రెయినీ ఇంజనీర్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.25000, రెండో సంవత్సరం నెలకు రూ.28000, మూడో సంవత్సరం నెలకు రూ.31000 వేతనం చెల్లించనున్నారు. 
ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మొదటి ఏడాది నెలకు రూ. 35000, రెండో సంవత్సరం నెలకు రూ. 40,000, మూడో సంవత్సరం నెలకు రూ. 45,000, నాలుగో సంవత్సరం నెలకు రూ.50,000 వేతనంగా అందిస్తారు.

Also Read: BEL Recruitment 2021: బెల్ కంపెనీలో ఇంజనీర్‌ ఉద్యోగాలు..

టాప్ హెడ్ లైన్స్

How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
TG TET 2026 Results: తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget