అన్వేషించండి

Amul MD Jayen Mehta: ఈ ఏడాది రూ. 1 లక్ష కోట్ల టర్నోవర్ బ్రాండ్‌గా అమూల్- ఏబీపీ ఇండియా సమ్మిట్‌లో ఎండీ జయేన్ మెహతా

ABP Network India at 2047 | అమూల్ సంస్థకు రూ.100 వస్తే అందులో రూ.80 రైతుల జేబులోకి వెళ్తుందన్నారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా. ఏబీపీ సదస్సు ఇండియా@2047 కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ABP News India at 2047 | న్యూఢిల్లీ: ఈ ఏడాది రూ. 1 లక్ష కోట్ల టర్నోవర్‌ను సాధించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా తెలిపారు. వినియోగదారులలో బ్రాండ్ తెచ్చుకోవడంతో పాటు దానిని కాపాడుకుంటున్నామని చెప్పారు.  అముల్ కంపెనీ ఎల్లప్పుడూ వినియోగదారుల నగదుకు తగిన విలువైన ఉత్పత్తులను అందించడంపై దృష్టి పెట్టిందని అన్నారు.

ఏబీపీ నెట్‌వర్క్ ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ఇండియా@2047 సమ్మిట్‌లో అమూల్ ఎండీ జయేన్ మెహతా పాల్గొన్నారు. వారి సహకార విధానంలో రైతుల నుంచి పాల సేకరించేవారు. సహకార సంఘాలు నుంచి టోకు వ్యాపారులు, పంపిణీదారుల వరకు అన్ని వాటాదారులను కలిపి సాధారణ లక్ష్యాన్ని సాధించడానికి. బ్రాండ్‌ను విజయవంతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. 

 అమూల్ బ్రాండ్ రెండు మూల స్తంభాలపై ఆధారపడి ఉందని, ఒకరు రైతులు కాగా, మరో పిల్లర్ వినియోగదారులు అని జయేన్ మెహతా పేర్కొన్నారు. విజయాన్ని అందరికీ పంచడానికి తమ ఉత్పత్తులపై వినియోగదారులు ఖర్చు చేసిన డబ్బులో 80 శాతం మేర రైతులకు అమూల్ కంపెనీ చెల్లిస్తుందని తెలిపారు. మీరు అమూల్ ఉత్పత్తులకు ఒక రూ. 100 చెల్లిస్తే, రూ. 80 నేరుగా రైతులకు వెళుతుందన్నారు.

అముల్ 'పూర్తిగా సమగ్ర రైతు యాజమాన్య నిర్మాణం' నమూనాపై పనిచేస్తుందన్నారు. ఈ నమూనాను ఇతర రంగాలలో అమలు చేస్తే రైతులతో పాటు ఆఖరు వినియోగదారులకు ఎంతో మేలు చేస్తుందని సూచించారు. 5 ట్రిలియన్ డాలర్ల భారత ఆర్థిక వ్యవస్థ దృష్టిపై మాట్లాడుతూ.. మరో 3 నుంచి 5 సంవత్సరాలలో, 1 ట్రిలియన్ డాలర్లు సహకార రంగం నుంచి వస్తాయన్నారు. అమూల్ దీనిలో సగం ఉత్పత్తి చేస్తోంది, కానీ ఈ రంగాన్ని మరింత ప్రోత్సహిస్తే సాధ్యమైనంత త్విరగా మనం ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమని  పేర్కొన్నారు.

 

ఏబీపీ ఇండియా@2047 గురించి 

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మే 6న ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహించిన సమ్మిట్, దేశీయంగా, ప్రపంచ వేదికపై భారత్ భవిష్యత్ కోసం చర్చిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాయంత్రం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. దేశం భవిష్యత్తు కోసం తమ లక్ష్యాలు, ఆలోచనలు పంచుకోనున్నారు. సమ్మిట్ చర్చలకు వేదికగా మాత్రమే కాకుండా, రాబోయే సంవత్సరాల్లో భారత్ విజయాలు, లక్ష్యాలు 2047కి ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా దేశం ఉండాలని కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
Gen-Z Budgeting Hacks : జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
Advertisement

వీడియోలు

సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
రికార్డులు బద్దలు కొట్టీన సఫారీలు ఆసీస్, భారత్‌తో టాప్‌ ప్లేస్‌లోకి..
ఆ ఒక్క క్యాచ్ వదలకుండా ఉంటే భారత్ మ్యాచ్ గెలిచేది
సఫారీలతో రెండో వన్డేలో భారత్ ఘోర ఓటమి
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
Gen-Z Budgeting Hacks : జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
Rashmika : విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
Telangana Police website hacked :  తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
Pushpa 2 Japan Release : 'జపాన్'లో 'పుష్ప' గాడి క్రేజ్ - రిలీజ్ ఎప్పుడో తెలుసా?
'జపాన్'లో 'పుష్ప' గాడి క్రేజ్ - రిలీజ్ ఎప్పుడో తెలుసా?
IndiGo Flights canceled: ఇండిగోలో సాఫ్ట్‌వేర్ సమస్యలు-  వందల సంఖ్యలో విమానాలు రద్దు - విమానాశ్రయాల్లో క్యూలు
ఇండిగోలో సాఫ్ట్‌వేర్ సమస్యలు- వందల సంఖ్యలో విమానాలు రద్దు - విమానాశ్రయాల్లో క్యూలు
Embed widget