అన్వేషించండి

Mirchi Powder: కారంపొడి వాడకాన్ని తగ్గించమని పోషకాహార నిపుణులు ఎందుకు చెబుతారు?

మన భారతీయ వంటల్లో ఎర్ర కారానికి ప్రత్యేక స్థానం ఉంది.

భారతీయ వంటల్లో కూర, బిర్యాని వంటివి రెడీ అవ్వాలంటే కచ్చితంగా ఎర్ర కారం పడాల్సిందే. వివిధ వంటకాల్లో ఉపయోగించే సాధారణ మసాలాగా ఇది మారిపోయింది. ఎర్ర కారం పొడి అయితే పోషకాహార నిపుణులు మాత్రం రోజూ అధిక మొత్తంలో మిరపపొడిని తినవద్దని చెబుతున్నారు. ఎర్రకారానికి బదులుగా పచ్చిమిర్చిని వాడమని సలహా ఇస్తున్నారు. ఎర్ర కారాన్ని అధికంగా తినడం వల్ల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాలు పడతాయని చెబుతున్నారు. ఎవరైతే కారాన్ని అధికంగా తింటారో వారి పొట్టలో పుండ్లు, అల్సర్లు, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ అని హెచ్చరిస్తున్నారు. మిరపపొడికి  కారంగా ఉండే రుచిని ఇచ్చే సమ్మేళనం క్యాప్సైసిన్. ఈ సమ్మేళనం పొట్టలోని పై పొరను చాలా చికాకు పెడుతుంది. మంట పుట్టిస్తుంది. ఇలా తరచూ జరగడం వల్ల ఆ పొర పై పుండ్లు వచ్చే అవకాశం ఉంది.

ఎందుకు హానికరం?
కారం అనేది పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్ల (PAH) మూలం. వీటిని క్యాన్సర్ కారకాలుగా కూడా చెబుతారు. ఏదైనా వస్తువులను కాల్చినప్పుడు ఈ PAH ఉత్పత్తి అవుతాయి. మిరపకాయలను తరచుగా పొగ పెట్టి లేదా పొడిగా మార్చే ముందు ఎండబెట్టడం వంటివి చేస్తారు. అలా చేయడం వల్ల ఆ మిరపకాయల్లో PAHలు అధికంగా ఉంటాయి. మిరపపొడి చేశాక కూడా ఈ PAH అలాగే ఉంటుంది. కారాన్ని అధికంగా తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు ఇదివరకే కొన్ని అధ్యయనాలు చెప్పాయి. అలాగే కారంలో కాస్త ఉప్పు, పంచదార కూడా కలుపుతూ ఉంటారు. అలాగే ఇతర ప్రిజర్వేటివ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీటిని అధిక మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమే.

కారంతో నిండిన ఆహారాలు తిన్న తరువాత పొట్టలో ఇబ్బందిగా అనిపించడం ఖాయం. గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ వంటివి కూడా ఏర్పడతాయి. కొంతమంది వ్యక్తుల్లో అధిక కారంతో తిన్న ఆహారం వల్ల ఆస్తమా వచ్చే అవకాశం ఉంది. ఇక చర్మ ఆరోగ్యం విషయానికి వస్తే  ఎక్కువగా  కారం కలిపిన ఆహారాన్ని తినేవారిలో చర్మం ఎరుపుగా, పొడిగా మారుతుంది. రోజూ కారాన్ని ఎక్కువగా తినే వారికి పొట్ట క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే దీనివల్ల DNA దెబ్బతినే ఛాన్సులు కూడా ఉన్నాయి. 

కూరలకు మంచి రంగును ఇవ్వడంలో కారం పాత్ర ముఖ్యమైనది. అందుకే ఎంతోమంది ఈ మిరపపొడిని వాడుతూ ఉంటారు. అయితే దీన్ని మితంగా తీసుకుంటే మంచిది. ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. కారానికి బదులుగా పచ్చిమిర్చిని వాడడం అలవాటు చేసుకోండి. 

Also read: బ్లాక్ టీ రోజూ తాగే అలవాటు ఉందా? జాగ్రత్త, గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Election 2025:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
Advertisement

వీడియోలు

Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Zohran Mamdani won Newyork Mayor Election |  న్యూయార్క్ మేయర్ గా గెలిచిన జోహ్రాన్ మమ్ దానీ | ABP Desam
పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Election 2025:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
YSRCP Leader Roja: తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
Mexican president kiss: మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
India Test Team Against South Africa : దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
Embed widget