అన్వేషించండి

Covid 19 India Update: దేశంలో కొత్తగా 42,982 కేసులు, 533 మరణాలు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,11,076కి పెరిగింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 1.29%గా ఉంది. వీక్లీ పాజిటివ్ రేటు 5% లోపే ఉంది.

దేశంలో కొత్తగా 42,982 కేసులు నమోదుకాగా 533 మంది మరణించారు. 41,726 మంది వైరస్ నుంచి రికవరయ్యారు. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,11,076కి పెరిగింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 1.29%గా ఉంది. వీక్లీ పాజిటివ్ రేటు 2.37%గా ఉంది.

  1. మొత్తం కేసులు: 3,18,12,114
  2. యాక్టివ్ కేసులు: 4,11,076
  3. మొత్తం రికవరీలు: 3,09,74,748
  4. మొత్తం మరణాలు: 4,26,290
  5. మొత్తం వ్యాక్సినేషన్: 48,93,42,295

కేరళలో మళ్లీ 20 వేలకు పైనే..

కేరళలో లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తూ నిన్న కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది విజయన్ సర్కార్. కొత్తగా 22,414 కేసులు నమోదయ్యాయి. 108 మంది కరోనాతో మృతి చెందారు. 

  • మొత్తం యాక్టివ్ కేసులు: 1,76,048
  • మొత్తం మరణాలు: 17,211

మార్గదర్శకాలు..

  • దుకాణాలు, మార్కెట్లు, బ్యాంకులు, కార్యాలయాలు, పరిశ్రమలు, పర్యటక ప్రాంతాలు సోమవారం నుంచి శనివారం వరకు తమ కార్యకలాపాలు నడపొచ్చు.
  • పబ్లిక్ సెక్టార్ రంగంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పీఎస్ యూలు, కంపెనీలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, కమిషన్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేయనున్నాయి.
  • రెండు వారాలకు ముందు కొవిడ్ వ్యాక్సిన్ ఒక డోసు అయిన తీసుకున్నవారు, 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చినవారు, కొవిడ్ తగ్గి నెల రోజులు పూర్తయిన వారికి మాత్రమే దుకాణాలు, మార్కెట్లు, బ్యాంకులు, పబ్లిక్, ప్రైవేట్ కార్యాలయాలు, పరిశ్రమల్లో పనిచేయడానికి, అడుగుపెట్టడానికి అర్హత ఉంది. 
  • దుకాణాలు, పర్యటక ప్రాంతాలు సహా ఇతర సంస్థలు తమ కార్యాలయాల ముందు ఉద్యోగుల వ్యాక్సినేషన్ వివరాలు కనిపించేలా ప్రదర్శించాలి.
  • వినియోగదారులు అందర్నీ ఒకేసారి అనుమతించకుండా సమయానుకూలంగా సేవలు అందించాలి. వినియోగదారులు భౌతిక దూరం పాటించకపోతే దానికి పూర్తి బాధ్యత యజమానులదే. మార్గదర్శకాలు పాటిస్తున్నారా లేదా అని తరచూ చెకింగ్ బృందాలు పరీక్షిస్తాయి.
  • ఆగస్చు 8 (ఆదివారం) పూర్తి లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఆగస్టు 15( స్వాతంత్య్ర దినోత్సవం)న మాత్రం ఎలాంటి లాక్ డౌన్ లేదు.
  • పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ సెంటర్లు, సినిమా థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో డైనింగ్లపై నిషేధం.
  • ఆన్ లైన్ డెలివరీ కోసం మాత్రమే మాల్స్ ఓపెన్ చేయాలి. విద్యాసంస్థలు కూడా ఆన్ లైన్ క్లాసుల నిర్వహణ కోసం మాత్రమే తెరవాలి.
  • సాంస్కృతిక, రాజకీయ బహిరంగ సభలకు ఎలాంటి అనుమతి లేదు. పెళ్లి, ఫంక్షన్లలో 20 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనకూడదు.

మహారాష్ట్రలో..

మహారాష్ట్రలో కొత్తగా 6,126 కరోనా కేసులు నమోదుకాగా 195 మంది మృతి చెందారు. 7,436 మంది కరోనా నుంచి రికవరయ్యారు. 

  • మొత్తం కేసులు: 63,27,194
  • మొత్తం మరణాలు: 1,33,410
  • మొత్తం రికవరీలు: 61,17,560

దిల్లీలో..

దిల్లీలో కొత్తగా 67 కేసులు నమోదుకాగా ఒక్కరు కూడా మరణించలేదు. పాజిటివిటీ రేటు 0.09%గా ఉంది. దిల్లీలో ఒక రోజులో ఎలాంటి కరోనా మరణాలు నమోదుకాకపోవడం సెకండ్ వేవ్ లో ఇది ఐదోసారి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Beetroot for Kidney Patients : కిడ్నీ సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్ తినొచ్చా? లాభాలు, నష్టాలు తెలుసుకోండి
కిడ్నీ సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్ తినొచ్చా? లాభాలు, నష్టాలు తెలుసుకోండి
BP and Diabetes Food Restrictions : బీపీ, షుగర్ కంట్రోల్ కావాలంటే ఏమి తినాలి? ఏవి మానాలి? డాక్టర్ ఇస్తోన్న సూచనలు ఇవే
బీపీ, షుగర్ కంట్రోల్ కావాలంటే ఏమి తినాలి? ఏవి మానాలి? డాక్టర్ ఇస్తోన్న సూచనలు ఇవే
Puffy Face in the Morning : ఉదయాన్నే ముఖం ఉబ్బుతుందా? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.. కారణాలు ఇవే
ఉదయాన్నే ముఖం ఉబ్బుతుందా? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.. కారణాలు ఇవే
Lifestyle Changes After 40 : మహిళలు 40 దాటాక తప్పక మార్చుకోవాల్సిన అలవాట్లు ఇవే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి
మహిళలు 40 దాటాక తప్పక మార్చుకోవాల్సిన అలవాట్లు ఇవే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
CM Revanth Reddy: గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget