అన్వేషించండి

Covid 19 Cases India: మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 42 వేల కేసులు నమోదు

నిన్న 30 వేలకు పడిపోయిన కరోనా కేసులు నేడు అమాంతంగా 42 వేలకు పెరిగాయి. 562 మంది వైరస్ కు బలయ్యారు.

దేశంలో కొత్తగా 42,625 కరోనా కేసులు నమోదుకాగా 562 మంది మృతి చెందారు. 36,668 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 97.37%.గా ఉంది.

దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 4,10,353గాఉంది. మొత్తం కేసుల్లో ఇది 1.29%. 

  • మొత్తం కేసులు: 3,17,69,132
  • మొత్తం రికవరీలు: 3,09,33,022
  • మొత్తం మరణాలు: 4,25,757
  • యాక్టివ్ కేసులు: 4,10,353
  • మొత్తం వ్యాక్సినేషన్: 48,52,86,570 ( గత 24 గంటల్లో 62,53,741)

కేరళలో 23,676 కేసులు..

కేరళలో కొత్తగా 23,676 కేసులు నమోదుకాగా 148 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 34.49 లక్షలకు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 17,103కి చేరింది.

రాష్ట్రంలో సోమవారం 13,984 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వరుసగా 6 రోజుల పాటు 20 వేలపైనే కరోనా కేసులు వెలుగుచూశాయి. సోమవారం నుంచి ఇప్పటివరకు 15,626 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. మొత్తం రికవరీల సంఖ్య 32,58,310కి పెరిగింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,73,221కి పెరిగినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

మహారాష్ట్రలో 6,005 కొత్త కేసులు..

మహారాష్ట్రలో కొత్తగా 6,005 కేసులు నమోదుకాగా 177 మంది వైరస్ తో మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 63,21,068కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 1,33,215కి చేరింది. 6,799 మంది కరోనా నుంచి రికవరయ్యారు. 

రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 61,10,124కి పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 74,318కి చేరింది. రికవరీ రేటు 96.66కి పెరిగింది. మరణాల రేటు 2.1గా ఉంది.
 
ముంబయిలో కొత్తగా 291 కేసులు నమోదవగా ముగ్గురు మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 7,35,657కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 15,911కి చేరింది.

22 లక్షల వ్యాక్సిన్ డోసులు..

ఉత్తర్ ప్రదేశ్ ఒక్కరోజులోనే 22 లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చి రికార్డ్ సృష్టించింది. దేశంలోనే 5 కోట్ల టీకాలను అందించిన మొదటి రాష్ట్రంగా మరో మైలురాయిని అందుకుంది ఉత్తర్ ప్రదేశ్. ఈ విషయంపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని.. కరోనా నుంచి తమను తాము రక్షించుకోవాలని యోగి ఆదిత్యనాథ్ కోరారు. కరోనా టీకాలను సురక్ష కవచాలుగా అభివర్ణించారు. 

దేశంలో థర్డ్ వేవ్ వచ్చేసరికి కరోనా కేసులు అత్యధికంగా రోజుకు లక్ష నుంచి లక్షా 50 వేలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. కరోనా నిబంధనలు తప్పక పాటించాలని సూచిస్తున్నాయి.

ALSO READ:

India Post Raksha Bandhan Initiative: 101 దేశాలకు రాఖీలు పంపనున్న భారత తపాలాశాఖ

Yo Yo Honey Singh: తాగుడు, అమ్మాయిలతో ఎఫైర్లు.. ప్రముఖ సింగర్ పై భార్య సంచలన ఆరోపణలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Rishabh Pant Tristan Stubbs Bowling: స్టంప్ మైక్ దగ్గర నుంచి స్టబ్స్ తో హిందీలో మాట్లాడిన పంత్Raja Singh Ram Navami Shobha Yatra| శ్రీరామనవమి శోభయాత్రలో ఫుల్ జోష్ లో రాజాసింగ్ | ABP DesamBJP Madhavi Latha vs Akbaruddin Owaisi | శ్రీరామ నవమి శోభయాత్రలో పాల్గొన్న మాధవి లత | ABP DesamTruck Hit Motorcycle In Hyderabad  | బైకును ఢీ కొట్టిన లారీ.. పిచ్చి పట్టినట్లు ఈడ్చుకెళ్లాడు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Social Problem in Congress : లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
IPL 2024: ఇద్దరిదీ ఒకే కథ, పైచేయి సాధించేదెవరు ?
ఇద్దరిదీ ఒకే కథ, పైచేయి సాధించేదెవరు ?
Vishal : రాయలసీమ బిడ్డకి దాడులు కొత్త కాదు - ఏపీ నెక్స్ట్ సీఎం ఆయనే: హీరో విశాల్
రాయలసీమ బిడ్డకి దాడులు కొత్త కాదు - ఏపీ నెక్స్ట్ సీఎం ఆయనే: హీరో విశాల్
Embed widget