News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

India Post Raksha Bandhan Initiative: 101 దేశాలకు రాఖీలు పంపనున్న భారత తపాలాశాఖ

కరోనా కారణంగా భారత తపాలా సేవలు చాలా దేశాల్లో నిలిచిపోయాయి. అయితే చాలా దేశాల్లో ఇప్పుడు సేవలు పునఃప్రారంభమయ్యాయి. అయితే ఈ ఏడాది రాఖీ సందర్భంగా 101 దేశాలకు రాఖీలు పంపనుంది భారత తపాలాశాఖ.

FOLLOW US: 
Share:

కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో చాలా కార్యకలాపాలు నిలిచిపోయాయి. గత ఏడాదిగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేందుకు కూడా లేదు. ఆంక్షలతో మాత్రమే కొన్ని విమాన సేవలు నడిచాయి. ఎంతో మంది అక్కాచెల్లెళ్లు విదేశాల్లో ఉన్న తమ సోదరులకు రాఖీ పంపే అవకాశాన్ని కోల్పోయారు. తమ ప్రేమను చూపించే వీలు లేకుండా పోయింది. భారత్ లో ఎంతోమంది అక్కాచెల్లెళ్ల సోదరులు విదేశాల్లో నివసిస్తున్నారు.

రాఖీ పౌర్ణమి వచ్చిందంటే సరిగ్గా సమయానికి చెల్లెళ్లు పంపే రాఖీ అన్నలకు చేరేది. కానీ గత ఏడాది వచ్చిన కరోనా ఆ ప్రేమను దూరం చేసింది. కరోనా కారణంగా విదేశాల్లో పోస్టల్ సర్వీసులు మూతపడ్డాయి. 

ఈ ఏడాది భారత తపాలా శాఖ విదేశాల్లో సేవలను పునరుద్ధరించింది. ఇప్పుడు విదేశాల్లో ఉన్న తమ సోదరులకు రాఖీ పంపించుకునే అవకాశం వచ్చింది. ఈ మేరకు ఇండియన్ పోస్టల్ సర్వీస్ డిపార్ట్ మెంట్ ట్వీట్ చేసింది.

" మీకు దూరంగా ఉన్న సోదరులకు రాఖీ పంపడం మర్చిపోకండి. ప్రపంచంలో ప్రతి మూలకి మీరు పంపే రాఖీని తపాలా శాఖ చేరుస్తుంది. ఏఏ దేశాలకు సేవలను పునరుద్ధరించామో చూడండి.           "
- భారత తపాలాశాఖ 

ప్రపంచంలోని 101 దేశాలకు రాఖీ పంపించడానికి తపాలాశాఖ నిర్ణయించింది. 67 దేశాలకు ఈఎమ్ఎస్ (ఎక్స్ ప్రెస్ మెయిల్ సర్వీస్) ద్వారా రాఖీ పంపించే అవకాశం ఉంది.

దేశాల జాబితా..

అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, బ్రెజిల్, బెల్జియం, డెన్ మార్క్, ఈజీప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, ఇండోనేసియా, ఐర్లాండ్, ఇటలీ, మలేసియా, మాల్దీవులు, నేపాల్, మెక్సికో, ఒమన్, నార్వే, కతార్, రష్యా, సౌదీ అరేబియా, శ్రీలంక, స్విట్జర్లాండ్, యూఏఈ, యూకే, యూఎస్ఏ. ఇలా మొత్తం 101 దేశాలకు ఎయిర్ పార్సిల్స్ ద్వారా కూడా రాఖీలను పంపించనుంది. రాఖీ లేఖలను 99 దేశాలకు పంపించనుంది. 14 దేశాలకు ఐటీపీఎస్ పంపనుంది.

రాఖీ గొప్పదనం..

చిన్నప్పటి నుంచి తమను కంటికి రెప్పలా కాపాడుతోన్న సోదరులకు ఎంతో ప్రేమతో రాఖీ పంపిస్తారు అక్కాచెల్లెళ్లు. జీవితాంతం తమకు తోడుగా ఉండాలని, ప్రతి కష్టసుఖంలోనూ తమ వెంట నిలవాలని సోదరులకు గుర్తుచేయడమే ఈ రాఖీ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాఖీకి ఎనలేని ప్రత్యేకత ఉంది. ఎంత దూరంలో ఉన్నా ఆరోజు తమ తోబుట్టువుల దగ్గరకు వెళ్లాలనుకుంటారు సోదరులు. 

ALSO READ:
 
Published at : 03 Aug 2021 06:24 PM (IST) Tags: Rakshabandhan Rakhi Rakhi in India Postal today Postal Service

ఇవి కూడా చూడండి

Top Headlines Today: బాలకృష్ణకు స్పీకర్ హెచ్చరిక; బస్సు యాత్రకు కోమటిరెడ్డి రెడీ - నేటి టాప్ న్యూస్

Top Headlines Today: బాలకృష్ణకు స్పీకర్ హెచ్చరిక; బస్సు యాత్రకు కోమటిరెడ్డి రెడీ - నేటి టాప్ న్యూస్

సరిహద్దు వివాదంపై చర్చించే ధైర్యం మాకుంది, కాంగ్రెస్‌ సవాల్‌కి రాజ్‌నాథ్ కౌంటర్

సరిహద్దు వివాదంపై చర్చించే ధైర్యం మాకుంది, కాంగ్రెస్‌ సవాల్‌కి రాజ్‌నాథ్ కౌంటర్

JNV: నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!

JNV: నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!

పర్వతాల మధ్య ప్రమాదకర నిచ్చెన, ఎక్కుతూ లోయలో పడిన వ్యక్తి - అక్కడికక్కడే మృతి

పర్వతాల మధ్య ప్రమాదకర నిచ్చెన, ఎక్కుతూ లోయలో పడిన వ్యక్తి - అక్కడికక్కడే మృతి

TSRTC Dasara Offer: దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ - 10 శాతం రాయితీ

TSRTC Dasara Offer: దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ - 10 శాతం రాయితీ

టాప్ స్టోరీస్

రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో టైఫాయిడ్‌తో రిమాండ్‌ ఖైదీ మృతి- చంద్రబాబు భద్రతపై లోకేష్ అనుమానం

రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో టైఫాయిడ్‌తో రిమాండ్‌ ఖైదీ మృతి- చంద్రబాబు భద్రతపై లోకేష్ అనుమానం

Kalki 2898 AD Movie: షేర్ చేస్తే చర్యలే, లీకు వీరులకు వైజయంతి మూవీస్ సీరియస్ వార్నింగ్

Kalki 2898 AD Movie: షేర్ చేస్తే చర్యలే, లీకు వీరులకు వైజయంతి మూవీస్ సీరియస్ వార్నింగ్

Ayyanna : జనసేనతో పొత్తు కోసం త్యాగానికి రెడీ - పోలీసుల తీరుపై అయ్యన్న కీలక వ్యాఖ్యలు !

Ayyanna :  జనసేనతో పొత్తు కోసం త్యాగానికి రెడీ - పోలీసుల తీరుపై అయ్యన్న కీలక వ్యాఖ్యలు !

Akhil Mishra Death : హైదరాబాద్‌లో ప్రమాదవశాత్తూ బాలీవుడ్ యాక్టర్ మృతి

Akhil Mishra Death : హైదరాబాద్‌లో ప్రమాదవశాత్తూ బాలీవుడ్ యాక్టర్ మృతి