అన్వేషించండి

Ayurvedam: చికెన్ తిన్న తర్వాత పాలు తాగకూడదా? ఆయుర్వేద నిపుణులు ఏం సూచిస్తున్నారు?

మనలో చాలా మందికి నిద్రపోయేటప్పుడు పాలు తాగి పడుకోవడం అలవాటు. అదే అలవాటుతో మాంసాహారం తిన్నా తర్వాత కూడా తాగుతాం.

మనలో చాలా మందికి నిద్రపోయేటప్పుడు పాలు తాగి పడుకోవడం అలవాటు. అదే అలవాటుతో మాంసాహారం తిన్నా తర్వాత కూడా తాగుతాం. రెస్టారెంట్ కి వెళ్ళిన సమయంలో కూడా నాన్ వెజ్ తిన్నా తర్వాత మిల్క్ షేక్ తాగడం లేదా పాలతో తయారు చేసిన పదార్థాలు తినడం చేస్తాం. అలా చెయ్యడం ఆరోగ్యానికి ప్రమాదమని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇది మన జీర్ణ క్రియని దెబ్బ తీయడంతోపాటు అనేక అనారోగ్య సమస్యలని తెచ్చి పెడుతుందని అంటున్నారు. కొన్ని పదార్థాలని కొన్నిటితో కలిపి తినడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు.  సరైన ఆహార పదార్థాల కాంబినేషన్ తోనే మనం తినాలని చెబుతున్నారు. వాత, పిత, కఫాలలో సమతుల్యత లోపిస్తుంది. అవి సరిగా లేకపోతే మన శరీరం అనారోగ్యానికి గురవుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అందుకే మన ఇళ్ళల్లో పెద్ద వాళ్ళు కూడా మాంసాహారం తిన్న తర్వాత పెరుగు తినకూడదని చెప్తారు.   

చికెన్ తిన్న తర్వాత పాలు తీసుకుంటే వచ్చే అనార్థాలు..  

చికెన్ తిన్న తర్వాత పాలతో కూడిన పదార్థాలు తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థకి ఆటంకం ఏర్పడుతుంది. ఎందుకంటే అవి రెండు వేర్వేరు గుణాలని కలిగి ఉండే పదార్థాలు. ఇవి రెండు కలిపి తినడం వల్ల మన పొట్టలో హానికర యాసిడ్స్ ఫామ్ అవుతాయి. అది మన జీర్ణప్రక్రియని దెబ్బతీస్తుంది. దీని వల్ల అరుగుదల సమస్యలు వస్తాయి. అంతే  కాకుండా కడుపులో వికారం, కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, తీవ్రమైన చర్మ సమస్యలు, మల బద్దకం వంటి ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఒక వేళ మీరు మాంసాహారం తిన్న తర్వాత కూడా పాల పదార్థాలు తీసుకోవాలని అనుకుంటే ఆ రెండిటికి మద్య కనీసం రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఈ వాదాన్ని డైటీషియన్స్ కొట్టి పడేస్తున్నారు. అలాంటి సమస్యలేమీ ఉండవని అంటున్నారు. చికెన్ లేదా చేపలు తిన్న తర్వాత పాలు తాగడం వల్ల ఎటువంటి హానికర ప్రభావాలు ఉండవని పోషకాహార నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చికెన్, చేప వంటి పదార్థాలు జీర్ణమయ్యేందుకు కొంత సమయం పడుతుంది. అవి తిన్న తర్వాత లిక్విడ్ తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియను కొద్దిగా మందగించేలా చేస్తుంది. మాంసాహారం తిన్న తర్వాత లిక్విడ్ తీసుకోవడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుందని అంతే కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని పోషకాహార నిపుణులు అంటున్నారు.

Also read: ఈ ఉల్లిపాయ మగవారు తింటే ఆ విషయంలో తిరుగుండదట!

Also read: జనరిక్ మందులు అంటే ఏమిటో తెలుసా? అవెందుకు తక్కువ ధరకే దొరకుతాయంటే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sleep Issues : యువతలో నిద్ర సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎప్పుడు డాక్టర్‌ను కలవాలి?
యువతలో నిద్ర సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎప్పుడు డాక్టర్‌ను కలవాలి?
Gym Headphones : జిమ్‌లో హెడ్‌ఫోన్‌లు వాడుతున్నారా? అయితే మీ చెవులకు ముప్పు తప్పదంటోన్న నిపుణులు
వర్కవుట్ చేస్తున్నప్పుడు ఇయర్‌ఫోన్‌ వాడుతున్నారా? నిపుణులు ఇస్తోన్న ప్రమాద హెచ్చరికలు ఇవే.. 
Grapes Cleaning Tips : ద్రాక్ష పండ్లు ఇలానే శుభ్రం చేసి తినాలి.. లేదంటే పిల్లలకు, పెద్దలకు ప్రమాదమే
ద్రాక్ష పండ్లు ఇలానే శుభ్రం చేసి తినాలి.. లేదంటే పిల్లలకు, పెద్దలకు ప్రమాదమే
Post-Festival Health Guide : హోలీ తర్వాత ఉబ్బరం, షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయా? ఈ టిప్స్​తో శరీరాన్ని రీసెట్ చేసుకోండి
హోలీ తర్వాత ఉబ్బరం, షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయా? ఈ టిప్స్​తో శరీరాన్ని రీసెట్ చేసుకోండి

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget