అన్వేషించండి

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ప్రవర్తనపై మనోజ్ దేశాయ్ గుర్రు, నేరుగా ఆయన్నే కలిసిన రౌడీ బాయ్!

తనపై తీవ్ర విమర్శలు చేసిన మనోజ్ దేశాయ్ ని విజయ్ దేవరకొండ ముంబైలో కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు పలు విషయాల గురించి చర్చించారు..

మరాఠా మందిర్ సినిమా థియేటర్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ ఇటీవల విజయ్ దేవరకొండ యాటిట్యూడ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి విజయ్ దేవరకొండ నేరుగా ఆయన్ని కలుసుకున్నాడు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మనోజ్ ను కలవడానికి ముంబై వెళ్లాడు విజయ్. లైగర్ హీరో తనతో సమావేశం కావడం పట్ల మనోజ్ దేశాయ్ సంతోషం వ్యక్తం చేశారు. “తన వ్యాఖ్యల మీద ఉన్న అపార్థాన్ని క్లియర్ చేసేందుకు విజయ్ ముంబైకి వచ్చాడు. ఒక స్టార్ గా అతడు మంచి మర్యాదను చూపించాడు. ఇక ముందు మంచి సినిమాలను చేస్తానని హామీ ఇచ్చాడు” అని మనోజ్ దేశాయ్ తెలిపారు.

ఆశించని ఫలితమివ్వని ‘లైగర్’

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల అయ్యింది. ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డులు నెలకొల్పుతుందని అందరూ భావించినా.. తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా ఫ్లామ్ మీద రకరకాల కామెంట్లు వచ్చాయి. పూరి జగన్నాథ్ కథ, కథనం, దర్శకత్వం మీద కొందరు విమర్శలు చేస్తుంటే.. మరికొందరు విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైగర్ సినిమా విడుదలకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.

విజయ్ దేవరకొండకు అహంకారం  

బాయ్ కాట్ బాలీవుడ్ అనే ట్రెండ్ కొనసాగుతున్న వేళ.. విజయ్ కావాలని ఆ వివాదంలోకి వెళ్లాడనేది పలువురి ఆరోపణ. బాయ్ కాట్ చేస్తే చేయనివ్వండి అంటూ ఆయన మాట్లాడిన మాటలు సినిమా పరాజయం మీద భారీ ప్రభావాన్ని చూపించాయని వాదిస్తున్నారు.  ముంబైలో జైటీ గెలాక్సీ, మరాఠా మందిర్ సినిమా థియేటర్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ మండిపడ్డారు. విజయ్ దేవరకొండను అహంకారిగా ఆయన అభివర్ణించారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు. 

" మిస్టర్ విజయ్ దేవరకొండ... నువ్వు అహంకారిగా మారిపోయావు. 'సినిమా చూడండి. మీకు చూడకూడదని అనిపిస్తే మానేయండి' అంటే ఎలా? ఒకవేళ ప్రేక్షకులు చూడకపోతే... తాప్సీ పరిస్థితి ఏమైంది? అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా', అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్' సినిమాలకు ఏమైంది? ఓటీటీలో చూస్తారంటున్న నువ్వు..  థియేటర్లు వదిలేసి తెలుగు, తమిళంలో సీరియళ్లు, ఓటీటీ ప్రాజెక్టులు చెయ్. మా సినిమా బాయ్ కాట్ చేయమని ఎందుకు అంటున్నావ్? తెలివితేటలు చూపించకు. అప్పుడు ఓటీటీల్లో కూడా నీ సినిమాలు ఎవరూ చూడరు "
-మనోజ్ దేశాయ్, మరాఠా మందిర్ సినిమా థియేటర్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
  

దేవరకొండ కాదు... అనకొండ, అనకొండలా మాట్లాడుతున్నాడని మనోజ్ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ ప్రవర్తన థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ మీద తీవ్ర ప్రభావం చూపించిందని ఆయన పేర్కొన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని, ఇప్పుడు అదే జరుగుతుందని మనోజ్ దేశాయ్ అన్నారు. తమకు సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయని, అయితే ఇంటర్వ్యూలలో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు బుకింగ్స్ మీద ఇంపాక్ట్ చూపించాయని మనోజ్ దేశాయ్ తెలిపారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ తెరకెక్కింది. అనన్య పాండే హీరోయిన్ గా చేసింది. పాన్ ఇండియన్  మూవీగా తెరకెక్కిన లైగర్ ను కరణ్ జోహార్, చార్మీ కౌర్, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మించారు.

Also Read : ఎన్టీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్న సకల అస్త్రాలకు అధిపతి

Also Read : తెలుగులో డిజాస్టర్ దిశగా 'లైగర్', హిందీలో బెటర్ - రోజు రోజు విజయ్ దేవరకొండ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Kolkata T20 Updates: అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన అభిషేక్, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన శర్మ, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget