అన్వేషించండి

Trinayani Serial Today May 10th: 'త్రినయని' సీరియల్: బంగారు కొబ్బరి కాయ తీసుకొచ్చిన విశాలాక్షి.. నోరెళ్లబెట్టిన కుటుంబ సభ్యులు!

Trinayani Serial Today Episode గాయత్రీ దేవి రహస్యాలు అన్నీ తిలోత్తమకు తెలుసని వాటిని తనకు చెప్తే కోట్లు సంపాదిస్తానని సుమన విక్రాంత్‌కి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode రమణమ్మ బతికే ఉందా అని తిలోత్తమ అంటుంది. వెంటనే విక్రాంత్ అందుకే కదా తనని ఏం చేయొద్దని రాసిందని అంటాడు. దీంతో తిలోత్తమ నోర్ముయ్‌ అని విక్రాంత్‌ని అంటుంది. ఇంతలో విశాల్ విక్రాంత్ రమణమ్మ ఏం చెప్పిందని అడుగుతాడు. 

విక్రాంత్: ఆవిడ మాట్లాడింది నయని వదినతో బ్రో.
నయని: ఆవిడే రమణమ్మ అని నాకు తెలీదు. సాధువుగా ఉంది కదా అని నా బాధని చెప్పుకున్నాను బాబుగారు. వాయు మరణం వెనుక రహస్యం తెలుసుకోవాలి అంటే పూల దండ పసుపు కుంకుమ ఇచ్చింది. 
సుమన: అది అత్తయ్యకు వేయించి పసుపు కుంకుమ అత్తి బాగానే ప్లాన్ చేశావు అక్క.
తిలోత్తమ: గుడ్ ఎవరికి వారు నా గురించి ఆరా తీయాలని చూస్తున్నారు అన్నమాట. విశాల్ నిన్ను కన్న తల్లి ఎక్కడ ఉందో తన గురించి ఆరా తీయకుండా నిన్ను పెంచి తల్లి మీద బాగానే ఫోకస్ చేశావు నాన్న.
విశాల్: నేనే ఏం చేయలేదు అమ్మ. నీ మీద నాకు ఇంకా కృతజ్ఞతాభావం ఉంది. 
హాసిని: అది లేకపోయి ఉంటే ఎప్పుడో అత్తయ్య మెడలో, ఫొటోకి దండ పడుండేది.
తిలోత్తమ: నేను చావను. అని గట్టిగా అరుస్తుంది.
నయని: తెలుసు.
తిలోత్తమ: ఒక్కొక్కరూ నా చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు అని నాకు అర్థమవుతుంది.
పావనా: అపార్థం చేసుకోకు అక్కయ్. రమణమ్మ సంగతి వదిలేయ్. వాయుని ఎందుకు చంపావో ముందు అది చెప్పు. 
తిలోత్తమ: వాయు ఒక రేసు గుర్రం. పరుగు పందాల్లో అది పాల్గొంటే లక్షలు వచ్చేవి. అప్పట్లోనే గాయత్రీ అక్క అపర కోటీశ్వరురాలు అవ్వడానికి అదీ ఒక కారణం అవ్వొచ్చని నా దగ్గర ఉన్న బంగారం అంతా అమ్మి వాయు మీద పందెం కాశాను. ఓటమి ఎరగని వాయు ఆ రోజు ఓడిపోయింది. ఓడిపోవడం జరగదని గాయత్రీ అక్క ఆలోచనలో పడింది.
విశాల్: నువ్వు ఈ పందెం కాసినట్లు అమ్మకి తెలీదా.
తిలోత్తమ: నా పేరు రానివ్వలేదు. మీ నాన్న జగదీష్ గారి పేరు వాడాను. ఆయన సీరియస్ అయితే క్షమించమని కాళ్లు పట్టాను. వాయు ఆరోగ్యం బాలేదు అని విశాలాక్షి అమ్మవారి గుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన పూల దండకు విషాన్ని పూసి వాయి మెడలో వేశాను. పూల దండ తినే అలవాటు ఉండే వాయు ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి.
నయని: మూగ జీవి ప్రాణాలు తీసి ఆనెపాప్ని విశాలాక్షి అమ్మ దయ చూపలేదని నిందించారు. 
విశాల్: రమణమ్మ భర్త వీరన్నకు ఈ భర్తకు ఈ విషయం తెలుసనుకుంటా. ఎస్టేట్‌లో పూలు పూయలేదని ఏడ్చాడు. 
విక్రాంత్: ఆ తర్వాత వీరన్న కనిపించలేదు. రమణమ్మ ఇప్పుడు కనిపించింది.
నయని: అత్తయ్య వారి జాడ తెలుసా.
తిలోత్తమ: తెలీదు. 

సుమన: మీరు తప్పు చేశారండి ఆ లెటర్ మీరు రాయకుండా నాతో రాయించి ఉంటే చాలా విషయాలు బయట పడేవి.
విక్రాంత్: ఆ తర్వాత నువ్వు అమ్మని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించేదానివి అంతే కదా. 
సుమన: బెదిరించడం అంత ఈజీ కాదు. వాయు అనే గుర్రం 20 ఏళ్లు క్రితం లక్షలు సంపాదించి పెట్టిందంట కదా. గాయత్రీ అత్తయ్య విషయంలో అది కోట్లు రాబట్టి ఉంటుందండి.
విక్రాంత్: నువ్వు కరెక్ట్‌గా గెస్ చేశావు కానీ మా అమ్మ పప్పులో కాలు వేసింది.
సుమన: అత్తయ్య బాగానే ప్రయత్నించారండి ఇప్పుడు అత్తయ్య ప్రయత్నించిన దారులు మీరు నాకు చెప్తే చాలు. 
విక్రాంత్: అర్థమైంది నేను దెబ్బలు తిన్నా పర్లేదు కానీ నీకు జాక్ పాకెట్ కావాలి అంతే కదా. 
సుమన:  కన్న కొడుకు కాబట్టి మిమల్ని ఏం చేయదు అత్తయ్య. మీరు గాయత్రీ అత్తయ్యకు తనకు సంబంధించిన ఆస్తి పాస్తులకు బిజినెస్‌లకు  అన్నింటికి మీ అమ్మే సాక్ష్యంగా ఉంది. ఆవిడ ఏం చేసిందో మీ దగ్గర ఆధారాలు ఉంటాయి. అవేంటో నాకు చెప్తే మిగతా కథ నేను చెప్తాను. 
విక్రాంత్: నిజంగా..
సుమన: నన్ను నమ్మారా..
విక్రాంత్: నేను బలి అయిపోతే..
సుమన: అబ్బా బొట్టు లేకుండా నేను ఉండను అని మీకు తెలుసు కదా. 
విక్రాంత్: సరే నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు. నాకు నమ్మకం కలగగానే.. నిన్ను ఇందులో భాగం చేస్తా.. (నిన్ను ఏం చేయాలో నాకు బాగా తెలుసే అందుకే నీ దారిలో నిన్ను పాతాళానికి తీసుకెళ్తా)

పావనామూర్తి గాయత్రీ పాపని ఆడిస్తుంటాడు. ఇంతలో అందరూ అక్కడికి వస్తారు. ఇంతలో విశాలాక్షి చేతిలో ఓ సంచి వేళాడదీసుకొని అక్కడికి వస్తుంది. తిలోత్తమ, సుమన, వల్లభలు ఆ సంచిని చూసి అన్ని గుడులు తిరిగి ప్రసాదం తీసుకొని వచ్చిందని వెటకారం చేస్తారు. 

ఇక విశాలాక్షి అది కొబ్బరి కాయ అని చెప్తుంది. ముందు ఆశపరులకు అవకాశం ఇస్తాను అని మీకు కావాలా అని ఆ ముగ్గురిని అడుగుతుంది. తిలోత్తమ కొబ్బరి చిప్ప అవసరం లేదు అనేస్తుంది. మళ్లీ విశాలాక్షి రెట్టించి అడుగుతుంది. బ్యాగ్ అక్కడ పెడతాను అవసరం అయిన వాళ్లు తీసుకోండి అని అంటుంది. 

విశాల్ ఎందుకు కింద పెట్టావ్ అని అడితే.. అవసరం అయిన వాళ్లు కాళ్లు తల వంచి తీసుకోవాలి అని అంటుంది. ఇక సుమన వల్లభ వాళ్లు విశాలాక్షి కాళ్లు దగ్గర తల వంచాలి అని అలా చేసిందని అంటారు. తిలోత్తమ అది దిష్టి కాయ అయింటుంది అందుకే కింద పెట్టిందని అంటుంది.

ఇక పావనా మూర్తి తాను తీసుకుంటానని వెళ్తాడు. అయితే కొబ్బరికాయ ఉన్న ఆ సంచి విశాలాక్షి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తుంది. పావనా పట్టుకోలేకపోతాడు. అందరూ పట్టుకోలేమని చేతులెత్తేస్తారు. 

ఇంతలో గాయత్రీ పాప సంచి పట్టుకుంటుంది. ఆశ పడకూడదు అర్హత సంపాదించుకోవాలి ముందు అని అర్థమయ్యేలా గాయత్రీ చేసిందని విశాలాక్షి అంటుంది. ఇక నయని ఆ బ్యాగ్ తీసుకొని కొబ్బరి కాయను బయటకు తీస్తుంది. అందులో బంగారం కొబ్బరి కాయ చూసి అందరూ నోరెళ్లబెడతారు. శివుడే తనకు ఇచ్చాడని విశాలాక్షి చెప్తే సుమన వెటకారంగా నవ్వుతుంది. దేవుడి దిగి వచ్చి ఇచ్చాడని చెప్పొద్దని తిలోత్తమ వాళ్లు అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్ ప్రోమో: గాయత్రీ పాప చేతిలో బంగారు కొబ్బరికాయ.. బిత్తరపోయిన విశాల్, నయని!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Embed widget