అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today July 19th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: తల్లి పుట్టింటి గురించి తెలుసుకున్న రామ్.. అమ్మమ్మ, మామలను పట్టుకొని ఎమోషనల్..!    

Seethe Ramudi Katnam Serial Today Episode రామ్, ప్రీతిలు తన చెల్లిలి పిల్లలని శివకృష్ణతో పాటు తన ఫ్యామిలీకి తెలియడం సుమతి బతికే ఉందని రామ్‌కి తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode సీత రామ్ కళ్లను మూసి తీసుకొస్తుంది. ఇక రామ్‌ కళ్లు తెరిచి ఎదురుగా ఉంచిన సుమతి ఫొటో చూస్తాడు. షాక్ అవుతాడు. శివకృష్ణ ఫ్యామిలీ అంతా రామ్‌ని చూస్తారు. ఫొటో చూసి మా అమ్మ ఫొటో ఏంటి ఇక్కడుందని రామ్ అంటాడు. అందరూ షాక్ అవుతారు.

సీత: అది మీ అమ్మ ఫొటో కాదు మామ మా అత్తమ్మ ఫొటో. 
రామ్: మా అమ్మ నీకు అత్తమ్మే అవుతుంది కదా.
సీత: కాదు మా అత్తమ్మే మీ అమ్మ అయింది. అర్థం కాలేదా మామ ఆవిడ ముందు నాకు అత్త అయిన తర్వాతే నీకు అమ్మ అయింది. మీ అమ్మ మా నాన్న చెల్లెలు సుమతి. 
రామ్: నువ్వు చెప్పేది నిజమా సీత.

అందరూ చాలా సంతోషిస్తారు. మా మేనల్లుడే మా అల్లుడు అయ్యాడా అని సంబరపడతారు. ఇక సీత ఫోన్‌లో శివకృష్ణ ఫొటో పంపగానే తనకు అర్థమైందని అందుకే ఇద్దరికీ ఒకేసారి సర్‌ఫ్రైజ్ చేశానని అంటుంది. ఇన్నాళ్లు ఈ విషయం ఎందుకు చెప్పలేదని రామ్ అంటే సుమతి ప్రేమ పెళ్లి చేసుకుందని ఎవర్ని చేసుకుందో కూడా తమకు తెలీదని అప్పటి నుంచి రాకపోకలు లేవని శివకృష్ణ చెప్తాడు. ఇక శివ తల్లి మనవడు అనుకుంటూ రామ్‌ని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. ఇక రామ్ శివకృష్ణని హగ్ చేసుకొని మామయ్య అని ఎమోషనల్ అవుతాడు. 

రామ్: ఈ సంతోషంలో మీకు ఓ సాడ్ న్యూస్ చెప్తున్నా. ఫీలవ్వొద్దు. నేను చెల్లి అమ్మని చాలా మిస్ అవుతున్నాం. మేం చిన్నగా ఉన్నప్పుడే అమ్మ ఓ యాక్సిడెంట్‌లో చనిపోయింది.  
సీత: అవును నాన్న అత్తమ్మ చనిపోయిందని అక్కడ అందరూ అనుకుంటున్నారు. కానీ నాకు అది అబద్ధం అని పిస్తుంది.
శివ: అనిపించడం కాదు సీత మీ అత్తయ్య బతికే ఉంది.
రామ్: ఏంటి మామయ్య మా అమ్మ బతికే ఉందా. 
లలిత: అవును బాబు సుమతి వదిన బతికే ఉంది ఈ మధ్య ఇంటికి వచ్చి వెళ్లింది. ఆ రోజు సీతా రాముల కల్యాణానికి వచ్చినప్పుడు మీ అత్తయ్య మాతోనే ఉంది. 
శివ:  కొన్ని కారణాల వల్ల సుమతి మీకు దూరంగా ఉందట. అప్పుడు జరిగిన యాక్సిడెంట్‌లో తీవ్ర గాయాలతో ఉన్న సుమతి కోమాలోకి వెళ్లింది. ఓ ఆశ్రమంలో చాలా ఏళ్లు ఉందట. కోమా నుంచి బయటకు వచ్చాక మా దగ్గరకు వచ్చింది. 

ఇక చెప్పకుండా వెళ్లిపోయిందని తర్వాత రెండు మూడు సార్లు ఫోన్ చేసిందని తనే తిరిగి వస్తాను అని తన కోసం వెతకొద్దని చెప్పిందని శివ చెప్తాడు. ఇక రామ్ తల్లి గురించి టెన్షన్ పడతాడు. ఇక అందరూ సుమతిని వెతికి పట్టుకోవాలని అనుకుంటారు. మరోవైపు మహాలక్ష్మి, జనార్థన్, విద్యాదేవి ఒకే కారులో రావడం అర్చన, గిరిధర్ చూస్తారు. మహాలక్ష్మి జానర్థన్ పక్కన నడవడం చూసిన విద్యాదేవి త్వరలో నీ కాళ్ల కింద భూకంపం వచ్చేలా చేస్తానని తన స్థానాన్ని తాను తీసుకుంటానని అంటుంది. ఇక అర్చన, గిరిధర్‌లు సీత, రామ్‌లు ఊరు వెళ్లారని చెప్తారు. ఇక విద్యాదేవి మాట్లాడుతుంటే మహాలక్ష్మి తన ఫ్యామిలి విషయంలో జోక్యం వద్దని అంటుంది. ఇక అర్చన ఫస్ట్ నైట్ చేసుకోవడానికి వెళ్లిందని మీకు చెప్పుకుంటే చెప్పుకోమని నిర్లక్ష్యంగా అందని చెప్తారు. మహాలక్ష్మి, జనార్థన్‌లు ఎందుకు ఆపలేదు అని అడుగుతుంది. ఇక విద్యాదేవి విషయం అది అయిండదని సీత మిమల్ని ఆట పట్టించడానికి ఇలా చేస్తుందని అంటుంది. ఇక సీత రామ్‌ల ఫస్ట్‌నైట్ ఎందుకు ఆపుతున్నారని విద్యాదేవి అడుగుతుంది. ఇక జనార్థన్ మహాకు చెప్పకుండా వెళ్లడం తప్పని జనా అంటాడు. 

మరోవైపు సీత, రామ్‌లు బయల్దేరుతారు. ఇక సుమతికి ఇష్టమైన పిండి వంటలు అన్నీ సీత రామ్‌ కోసం చేయిస్తుంది. రామ్ శివకృష్ణతో ఈ విషయం మా పిన్ని, డాడీలకు తెలిస్తే ఇంకెలా ఉంటుందని రామ్ అంటాడు. ఇక సీత అయితే మీ పిన్ని గుండె ఆగిపోతుందని సీత సైటెర్లు వేస్తుంది. ఇక రామ్ రెండు ఫ్యామిలీలకు వారసుడు అని అంటే ఇంట్లో అందరూ సీతని తీర్థయాత్రల్లో దొరికావని ఏడిపిస్తారు. ఇక సీత రామ్‌లు ఇంట్లో వాళ్లకి సర్‌ఫ్రైజ్ చేస్తామని అంటారు. ఇక సీత, రామ్‌లు మధు దగ్గరకు వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: వియ్యంకుడిని జైలులో ఉంచాలని మహదేవయ్య ప్లాన్.. బామ్మర్దిని అనుమానించిన క్రిష్, నిజం తెలుసుకుంటాడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అభిమాని మృతి, వారి కుటుంబానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్
అభిమాని మృతి, వారి కుటుంబానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్
Vijayawada: వరద బాధితులకు ఆహార పంపిణీలో రికార్డు! 3 టన్నుల ఆహారం పంపిణీ - ఏపీ సీఎంఓ
వరద బాధితులకు ఆహార పంపిణీలో రికార్డు! 3 టన్నుల ఆహారం పంపిణీ - ఏపీ సీఎంఓ
Telugu News: గుడ్ న్యూస్! విజయవాడ హైదరాబాద్ మధ్య రాకపోకలు పునరుద్ధరణ
గుడ్ న్యూస్! విజయవాడ హైదరాబాద్ మధ్య రాకపోకలు పునరుద్ధరణ
Telangana Death Toll: మృతుల సంఖ్యపై రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు, 31 మంది మృతి చెందారన్న హరీష్ రావు
మృతుల సంఖ్యపై రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు, 31 మంది మృతి చెందారన్న హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

FTL దాటిన హుస్సేన్ సాగర్ .. దిగువ ప్రాంతాల్లో హై అలెర్ట్కృష్ణా నదికి వందేళ్లలోనే అతిపెద్ద వరదవిజయవాడలో ఫుడ్ సప్లై చేస్తున్న డ్రోన్లు!వరద ప్రభావిత ప్రాంతాల్లో జేసీబీ మీద తిరిగిన సీఎం చంద్రబాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అభిమాని మృతి, వారి కుటుంబానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్
అభిమాని మృతి, వారి కుటుంబానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్
Vijayawada: వరద బాధితులకు ఆహార పంపిణీలో రికార్డు! 3 టన్నుల ఆహారం పంపిణీ - ఏపీ సీఎంఓ
వరద బాధితులకు ఆహార పంపిణీలో రికార్డు! 3 టన్నుల ఆహారం పంపిణీ - ఏపీ సీఎంఓ
Telugu News: గుడ్ న్యూస్! విజయవాడ హైదరాబాద్ మధ్య రాకపోకలు పునరుద్ధరణ
గుడ్ న్యూస్! విజయవాడ హైదరాబాద్ మధ్య రాకపోకలు పునరుద్ధరణ
Telangana Death Toll: మృతుల సంఖ్యపై రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు, 31 మంది మృతి చెందారన్న హరీష్ రావు
మృతుల సంఖ్యపై రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు, 31 మంది మృతి చెందారన్న హరీష్ రావు
Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ డెబ్యూపై క్రేజీ అప్ డేట్- ఫ్యాన్స్ కు పూనకాలే!
నందమూరి మోక్షజ్ఞ డెబ్యూపై క్రేజీ అప్ డేట్- ఫ్యాన్స్ కు పూనకాలే!
In Pics: వరద ప్రాంతాల్లోకి రేవంత్ రెడ్డి, సీఎం ముందే ఏడ్చేసిన బాధితులు - ఫోటోలు
వరద ప్రాంతాల్లోకి రేవంత్ రెడ్డి, సీఎం ముందే ఏడ్చేసిన బాధితులు - ఫోటోలు
KTR News: అప్పట్లో మేం ఆపని చేయడం వల్లే వరద ముప్పు తప్పింది - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
అప్పట్లో మేం ఆపని చేయడం వల్లే వరద ముప్పు తప్పింది - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Vijayawada Floods: వరద ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా -  రంగంలోకి నేవీ హెలికాఫ్టర్లు, అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం
వరద ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా - రంగంలోకి నేవీ హెలికాఫ్టర్లు, అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం
Embed widget