Nindu Noorella Saavasam Serial Today December 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరు ఆస్థికలు చూసి ఏడ్చిన అంజ – భాగీకి నిజం చెప్పిన రాథోడ్
Nindu Noorella Saavasam Today Episode: మనోహరి స్మశానానికి వెళ్లి ఆరు ఆస్థికలు దొంగింలించబోయిందన్న నిజం రాథోడ్, భాగీకి చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు ఆస్థికల కోసం స్మశానానికి వచ్చిన మనోహరిని చూసి అమర్ షాక్ అవుతాడు. ఇక్కడున్నావేంటని అడుగుతాడు. ఇంతలో సెక్యూరిటీ వచ్చి మనోహరిని తిడతాడు. ఇంతకు ముందే వచ్చి మీ భార్య అస్థికలు ఇవ్వమని అడిగింది. ఇవ్వడం కుదరదని చెబితే దొంగలాగా లోపలికి దూరింది అని చెప్తాడు. అమర్ కోపంగా నిజం చెప్పు మనోహరి ఆరు అస్థికలు ఎందుకు తీసుకోవాలనుకున్నావు అని అడుగుతాడు. తాన అస్థికలే కోసమే వచ్చానని ఘోరాకు విషయం తెలియక ముందే ఆస్థికలు తీసుకుని నదిలో కలపాలనుకున్నట్లు చెప్పి ఏడుస్తుంది మనోహరి. అమర్ సరేలే అంటూ వెళ్లిపోతాడు. గుప్త బాధపడుతుంటాడు.
గుప్త: ప్రభూ గతంలో నేను ఏవో చిన్న చిన్న తప్పిదాలు చేసినందుకు నన్ను ఈ నరకానికి పంపారా..? నాకెందుకు ఈ శిక్ష వేశారు. నేను వద్దంటున్నా నన్ను ఆ బాలిక వెంట పంపిచారు.
ఆరు: గుప్తగారు.. ఏం మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా..? ఎందుకు రాజు గారికి చాడీలు చెప్తున్నారు.
గుప్త: నేను చెప్తున్నది జరిగిన దాని గురించి కాదు. జరగబోయే దాని గురించి బాలిక.
ఆరు: అవునా ఏం జరగబోతున్నది.
గుప్త: నీ పతి దేవుడు నీ ఆస్తికలు తీసుకుని వస్తున్నాడు. అవి తీసుకొచ్చి నీ ఫోటో ముందు పెడతారు.
ఆరు: అలా చేస్తే మిస్సమ్మ నా ఫోటో చూస్తుంది. మిస్సమ్మకు నిజం తెలుస్తుంది. అదే జరిగితే మిస్సమ్మ అందరికీ నిజం చెప్పేస్తుంది. వాళ్లు మిస్సమ్మ మాటలు నమ్మలేదనుకో.. ఆ మనోహరి మిస్సమ్మకు పిచ్చి పట్టిందని నమ్మించి మిస్సమ్మను ఆయనకు దూరం చేస్తుంది.
అంటూ ఆరు బాధపడుతుంటే.. అమర్ ఆస్తికలు తీసుకుని వస్తాడు. అమర్ ను చూసిన గుప్త ఇక అంతా అయిపోయింది. మనం ఇన్నాళ్లు కష్టపడి దాచిపెట్టిన రహస్యం బయటపడుతుంది అని గుప్త భయపడుతుంటాడు. ఆరు మాత్రం వెంటనే కిటికీ దగ్గరకు వెళ్తుంది. మిస్సమ్మ అందరినీ భోజనానికి పిలుస్తుంది. అందరూ భోజనం చేయడానికి రెడీ అవుతుంటే.. ఆస్థికలు తీసుకుని అమర్ వస్తాడు.
అమర్: అమ్మా ఆరు ఆస్తికలు నదిలో కలుపుతున్నాం కదా అప్పటిదాకా ఇంట్లో పెడితే మంచిదని తీసుకొచ్చాను.
నిర్మల: చాలా మంచి పని చేశావు నాన్నా తీసుకెళ్లి నీ గదిలో పెట్టు
అంజు: డాడ్ ఒక్కసారి ముట్టుకోవచ్చా..? ( ఆస్తికలు తీసుకుని) హాయ్ అమ్మా నన్ను చూస్తుంటావు అని స్వామిజీ చెప్పారు. ఇప్పుడు కూడా చూస్తుంటావా..?
అని అంజు ఏడుస్తుంది. పిల్లలు అందరూ వచ్చి ఆస్తికలు ముట్టుకుని ఏడుస్తుంటారు.
అమర్: నువ్వు పోగోట్టుకున్న మీ అక్కను నేను మళ్లీ తీసుకురాలేను మిస్సమ్మ. కానీ ఆఖరి సారిగా మీ అక్క అస్థికలను నువ్వు ముట్టుకునేలా చేస్తాను. ( అని మనసులో అనుకుంటాడు)
ఆస్థికలు మిస్సమ్మకు ఇస్తాడు అమర్. అస్తికలు తీసుకున్న భాగీ ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది.
భాగీ: ఈ ఆస్తికలు తీసుకోగానే.. నా మనసు ఎందుకండి ఇంతలా ఆరాటపడుతుంది.
రాథోడ్: ఎందుకంటే ఆవిడ నీ తొడబుట్టినది కనుక ( అని మనసులో అనుకుంటాడు)
నిర్మల: ఆరుకు నీకు మధ్య ఏ జన్మలో రక్తసంబంధం ఉన్నట్టు ఉంది. అందుకే అమర్కు తను దూరం అవుతూ.. నిన్ను దగ్గర చేసింది మిస్సమ్మ.
శివరాం: మిస్సమ్మ ఆస్తికలు అమర్ రూంలో పెట్టు
అమర్: స్వామిజీ ఆస్తికలు ఆరు ఫోటో ముందు పెట్టి దీపం పెట్టమన్నారు నాన్నా..
అని అమర్ చెప్పగానే ఆరు, మనోహరి, గుప్త షాక్ అవుతారు. ఆరు ఫోటో తీసుకొస్తాను మిస్సమ్మ ఇది పట్టుకో అని అమర్ పైకి వెళ్తాడు. రాథోడ్ కూడా భాగీకి ఏదో చెప్పాలని పక్కకు తీసుకెళ్తాడు. భాగీ ఆస్తికలను అంజు చేతిలో పెట్టి పక్కకు వెళ్తుంది. అమర్ స్టోర్ రూంలోకి వెళ్లి ఆరు ఫోటో తీసుకుని చూస్తూ ఎమోషనల్ అవుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















