అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today August 1st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్‌ను రెచ్చగొట్టిన మను – కోపంతో రగిలిపోయిన రణవీర్‌

Nindu Noorella Saavasam serial Today Episode August 1st:  ఆరు ఏదైనా చేయాలని రణవీర్‌ ఆలోచిస్తుంటే మను వచ్చి మరింత రెచ్చగొడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: బెస్ట్‌ కపుల్‌ కాంపిటీషన్‌ అవార్డుకు అమర్‌, భాగీని ఎంపిక చేస్తారు. దీంతో అందరూ చప్పట్లు కొడుతూ వాళ్లను అభినందిస్తారు. స్టేజీ మీదకు పిలిచి శాలువాతో సత్కరించి చెక్కు, అవార్డు ఇస్తారు అదంతా చూస్తున్న చిత్ర కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వెనకే వినోద్‌ వెళ్లిపోతాడు. ఇద్దరూ ఒక చోట నిలబడి ఉంటారు.

వినోద్‌: ఇంకా ఎంతసేపు ఇక్కడ ఉంటాము చిత్ర ఇంటికి వెళ్దాం పదా

చిత్ర: వెళ్లి భాగీ, బావగారు గెలిచారని అందరూ చిందులు వేస్తూ విందులు చేసుకుంటుంటే.. మనం చూస్తూ ఉండాలా.? అరే ఏంటండి బావగారికి మీరంటే కొంచెం కూడా ప్రేమ లేదా..? మీ కోసం మిమ్మల్ని గెలిపించడం కోసమైనా ఆయన ఓడిపోవచ్చు కదా…?

వినోద్‌: అదేంటి చిత్ర అలా మాట్లాడుతున్నావు అన్నయ్య గెలిచినా.. మనం గెలిచినా.. ఒక్కటే కదా

చిత్ర: అవునా అయితే వెళ్లి  మీ అన్నయ్య గెలిచిన చెక్‌ తీసుకురండి. తీసుకురాలేరు కదా..? మరి ఇలాంటి మాటలు మాట్లాడకండి.. నేనసలే ఒళ్లు మండిపోయి ఉన్నాను. బిజినెస్‌ చేస్తాం డబ్బులు ఇవ్వమంటే ఇవ్వరు.. కాంపిటీషన్‌లో అయినా గెలుద్దం అంటే అక్కడ కూడా ఓడిస్తారు. అసలు మనం ఎలా బతకాలి. వినోద్‌ మనం ఇంటికి వెళ్లి వేరు కాపురం పెడదాం అని చెబుదాం. ఆస్థి బాగాలు పెట్టమని అడుగుదాం. మనం ఇప్పుడు నేరుగా వెళ్లి

వినోద్: చిత్ర వేరు కాపురం అన్న ఆలోచన కూడా రానివ్వకు. ఎందుకంటే నేను అన్నయ్యను పిల్లలను వదిలి ఎక్కడిక రాను. అందరితో కలిసి ఉండటం.. అడ్జస్ట్ అవ్వడం నీకు అలవాటు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు చేసుకో ఎందుకంటే నేను నా ఫ్యామిలీ వదిలి ఎక్కడికి రాను..

అని కరాకండిగా చెప్పి వెల్లి కారులో కూర్చుంటాడు.

చిత్ర: నాకంటే నీకు నీ వాళ్లే ఎక్కువా వినోద్‌ అయితే చూస్తాను. వాళ్లంతట వాళ్లే ఆస్థి బాగాలు పంచి మనల్ని వేరు కాపురం పెట్టేలా చేస్తాను

అని మనసులో అనుకుంటూ వెళ్లి కారులో కూర్చుంటుంది చిత్ర. మరోవైపు ఇంటికి వెళ్లిన అమర్‌, భాగీ డోర్‌ బెల్‌ కొట్టగానే.. కంగారుగా వచ్చి మనోహరి డోర్‌ తీస్తుంది.

మను: హమ్మయ్య అమర్‌ వచ్చేశారా..?

అమర్‌: ఏమైంది మనోహరి ఎందుకు అంత కంగారు పడుతున్నావు

మను: కంగారేం లేదు అమర్‌

భాగీ: ఏమీ లేకపోతే మీరు అంత కంగారు పడరు కదా మనోహరి గారు

మను: అంటే అది పిల్లలను ఒక్కదాన్ని ఎప్పుడూ చూసుకోలేదు కదా..? అందుకే.. పైగా మీరు సడెన్‌గా కాలింగ్‌ బెల్‌ కొట్టారు భయపడ్డాను అంతే తప్పా ఏం లేదు. అమర్‌ రేపు మధ్యాహ్నం వరకు మీరు రారేమో అని కంగారు పడ్డాను

అమర్‌: కాంపిటీషన్‌లో చిన్న ఫైర్‌ యాక్సిడెంట్‌ అయింది .అందుకే కాంపిటీషన్‌ను త్వరగా ఫినిష్‌ చేశారు

మను: సరే అమర్‌ నువ్వు వెళ్లి ఫ్రెష్‌ అవ్వు

అని మను చెప్పగానే అమర్‌ పైకి వెళ్లిపోతాడు. తర్వాత రణవీర్‌ ఇంట్లో కూర్చుని కోపంగా చూస్తుంటే మనోహరి వెళ్తుంది.

మను: నువ్వు వేస్ట్ రణవీర్‌ నువ్వు ఎంత ట్రై చేసినా ఫెయిల్‌ అవుతూ ఉంటావు తప్పితే సక్సెస్‌ అవ్వలేవు ఎందుకంటే ఆరు ఆత్మకు అన్ని శక్తులు ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఇంట్లో నుంచి పోవడం లేదు. అసలు ఏం చేస్తే దాని పీడ వదిలిపోతుందో అసలు అర్తం కావడం లేదు

రణవీర్‌: ఈ సారి ఘోరాలు, అఘోరాలు కాదు. వాళ్లను మించిన శక్తిని పిలిపిస్తాను.

మను: ఎవరు వాళ్లు రణవీర్‌

రణవీర్‌: శంభా..

అంటూ రణవీర్‌ చెప్పగానే మనోహరి సరే ఎవరినైనా పిలిపించు కానీ ఆరు ఆత్మను మాత్రం ఇంట్లోంచి వెళ్లగొట్టేలా చూడు అని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత రణవీర్‌ కొల్‌కతా నుంచి శంభాను తీసుకొచ్చి అమర్‌ ఇంటి దగ్గర వదిలేస్తాడు. శంభా రావడం తెలుసుకున్న గుప్త, ఆరు షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget