అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ దొంగ అని ఫ్రూవ్‌ చేసిన మనోహరి – మిస్సమ్మను ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్న అమర్‌

Nindu Noorella Saavasam Today Episode: మిస్సమ్మే నగలు దొంగతనం చేసిందని మనోహరి నిరూపించడంతో అమర్ మిస్సమ్మను ఇంట్లోంచి వెళ్లిపోమ్మని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆ ఇంట్లోంచి ఇప్పుడే ఎందుకొచ్చావని అమర్‌ అడగడంతో ఏం మాట్లాడకుండా ఉంటుంది మనోహరి. దీంతో నాకు మౌనంతో కాదు మాటలతో సమాధానం కావాలని అమర్‌ అడుగుతాడు. చెప్తాను అమర్‌ కానీ ఈ ఇంట్లో ఒకర్ని నాలుగు ప్రశ్నలడిగి ఆ తర్వాత నీకు సమాధానం చెప్తాను అంటుంది మనోహరి. కోపంగా మిస్సమ్మను పిలుస్తుంది. మిస్సమ్మ వస్తుంది.

మనోహరి: వావ్‌ మిస్సమ్మ వావ్‌ నీ స్క్రీన్‌ప్లే అదిరిపోయింది. ఇంత ఎక్స్‌ పీరియన్స్‌ ఉన్న నాకే అర్థం కావడానికి చాలా టైం పట్టింది.

మిస్సమ్మ: పొగిడినందుకు థాంక్స్‌. కానీ మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు.

మనోహరి: అర్థం అవుతుంది మిస్సమ్మ.. మెల్లగా ఒక్కోక్కటి అర్థం అవుతుంది. ఫోటో దగ్గర నగలు పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పింది మిస్సమ్మే కదా?

అనగానే మిస్సమ్మ అవును అంటూ నీ దగ్గర ఉన్నవి డూప్లికేట్‌ నగలు అంటూ ప్రూవ్‌ చేయడానికే ఇలా చెప్పానని మిస్సమ్మ చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. దూరం నుంచి  చూస్తున్న అరుంధతి ఆయ్యో మనోహరి ప్లాన్‌ ఇంకా మిస్సమ్మకు అర్థం కాలేదని బాధపడుతుంది. నేను ఎలా ఆపగలను అని ఏడుస్తుంది.

అమర్‌: అసలేం జరిగింది మనోహరి. ఆరు నగలు ఎక్కడున్నాయి. నీ దగ్గరికి ఈ డూప్లికేట్ నగలు ఎందుకొచ్చాయి.

మనోహరి: అది అడగాల్సింది నన్ను కాదు అమర్‌. ప్లాన్‌ చేసి పర్ఫెక్టుగా ఎగ్జిక్యూట్‌ చేసి ఏమీ తెలియనట్టు ఇక్కడ నిల్చున్న ఈ మిస్సమ్మని.

అని మనోహరి చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. నగలకు, మిస్సమ్మకు సంబంధం ఏంటి? అని అమర్‌ అడగ్గానే మిస్సమ్మ, వాళ్ల నాన్న కలిసి అసలు నగలు కొట్టేసి వాటి స్థానంలో డూప్లికేట్‌ నగలు పెట్టారు. అంటూ మిస్సమ్మను వాళ్ల నాన్నను తిడుతుంటే మిస్సమ్మ వాళ్లకు వార్నింగ్ ఇస్తుంది. అమర్‌ కూడా మిస్సమ్మ తప్పు చేసిందంటే నేను నమ్మను అంటాడు.

శివరాం: అమ్మా మనోహరి ఆరోపణలు చేసే ముందు ఆధారాలుండాలి.  

మనోహరి: మీకు కావాల్సింది ఆధారాలే కదా? మూసుకున్న మీ కళ్లు తెరుచుకునేలా వీళ్ల మాయలో బయటపడేలా? నిజాన్ని మీ కళ్లకు కట్టినట్లు చూపిస్తాను రండి.

అని మిస్సమ్మ రూంలోకి వెళ్లి నగలు ఉన్న బ్యాగ్‌ తీసుకొచ్చి అందరికీ చూపిస్తుంది. దూరం నుంచి చూస్తున్న అరుంధతి బాధపడుతుంది. మనోహరి అందరికీ చూపిస్తుంది. ఆ నగలు చూసిన శివరాం, నిర్మల ఇవి అరుంధతి నగలే అని అంటారు.

మనోహరి: మీలో ఎవరికైనా ఇంకా అనుమానం ఉంటే జువ్వెల్లరీ షాపుకు వెళ్లి చెక్‌ చేయిద్దాం..

మిస్సమ్మ: మనోహరి గారు నామీద దొంగ అనే ముద్ర వేయాలని చూడకండి. ఈ నగలు తీసుకునే అవసరం నాకు లేదు.

మనోహరి: నువ్వు తీసుకురాకుండా నువ్వు చేంజ్‌ చేయకుండా డూప్లికేట్‌ నగలు నా దగ్గరకు ఎలా వచ్చాయి. వర్జినల్‌ నగలు నీ రూంలోకి ఎలా వచ్చాయి.  

మిస్సమ్మ: ఎలా వచ్చాయో నాకు కూడా తెలియదు.

మనోహరి: అవునా నగలు నీ రూంలో ఉన్నాయని నీకు తెలుసా? లేదా?

మిస్సమ్మ: తెలుసు కానీ ఎలా వచ్చాయో కానీ తెలియదు.

మనోహరి: విన్నావా అమర్‌ ఉన్నాయని తెలుసట. కానీ ఎలా వచ్చాయో తెలియదట.

 అంటూ నువ్విదంతా ఎందుకు చేశావంటే నువ్వు ఈ పెళ్లి అపాలనుకున్నావు కాబట్టి ఈ తతంగం అంతా నడిపించావు అంటుంది మనోహరి. అమర్‌ ఈ మిస్సమ్మను వెంటనే ఇంట్లోంచి వెళ్లిపోమ్మని చెప్పు అంటుంది. దీంతో మిస్సమ్మ సార్‌ నేను అనగానే  అమర్‌ తప్పు చేశావు మిస్సమ్మ. నీకు ముందే చెప్పాను నాకు అబద్దం అంటే నచ్చదని అనడంతో మిస్సమ్మ ఇక తానే వెళ్లిపోతానని అనడంతో..

మనోహరి: నీలాంటి మోసగాళ్లు, దొంగలు ఈ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండటానికి వీల్లేదు.

అరుంధతి: గుప్త గారు ప్రళయం ముంచుకొస్తుంది. ప్రమాదం మనోహరి రూపంలో వస్తుంది అంటే నాకు అర్థం కాలేదు. నేనే ప్రళయాన్ని సృష్టించడానికి ఒక అవకాశం ఇస్తాననుకోలేదు.

అనగానే గుప్త కోపంగా నేను ముందే చెప్పాను కదా ఆ బాలికకు శక్తుల తోడవుతున్నాయి. అనగానే ఇప్పుడే వెళ్లి మిస్సమ్మకు నిజం ఎంటో చెప్పేస్తాను అనగానే నువ్వు ఇచ్చిన మాట తప్పిన వెంటనే నిన్ను ఈ లోకం నుంచి మా లోకం తీసుకెళ్తాను అని గుప్త చెప్పగానే ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: శ్రద్దాదాస్ అందాల జాతర- శారీలో గ్లామర్ షో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.