Nindu Manasulu Serial Today March 24th: నిండు మనసులు: ఇందిరతో తన ప్రేమ విషయం చెప్పేసిన సిద్ధూ! కూతుళ్ల కోసం గణకి ఎదురు తిరిగిన రాజశేఖరం!
Nindu Manasulu Serial Today March 24th సిద్ధూ ప్రేరణని ప్రేమిస్తున్నట్లు ఇందిరతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode రాజశేఖరం ఇందిరకు కాల్ చేయాలని ఫోన్ చేస్తాడు. డైల్ చేయగానే ఈశ్వరి వచ్చి ఫోన్ లాక్కుంటుంది. మీరు ఇలాంటిది చేస్తారు అని నాకు తెలుసు.. అది నా ఇంట్లో పనిమనిషిలా ఉంటూ నా కాళ్లు పట్టుకుంది అలాంటి దాన్ని తీసుకొచ్చి నా పక్కన కూర్చొపెడతాను అంటే ఊరుకుంటానా.. అయినా నా కొడుకు ఎక్కడ ఆ దిక్కుమాలిన వాళ్లు ఎక్కడ అని ఈశ్వరి అనడంతో రాజశేఖరం కోపంగా చూస్తాడు. వాళ్లు మా కాలి గోటికి కూడా సరిపోరు.. అలాంటి వాళ్లకి మీరు కాల్ చేసి క్షమాపణ చెప్పి మళ్లీ వాళ్లని ఇక్కడికి తీసుకొస్తారా.. అయినా ఆ తల్లీకూతుళ్లు కలిసి ఎలాంటి ఘనకార్యాలు వెలగబెడుతున్నారో అని ఈశ్వరి అనగానే రాజశేఖరం కొట్టడానికి చేయి ఎత్తుతాడు.
ఈశ్వరి కోపంతో అయితే మీరు ఇప్పుడు చెప్పండి.. మీ మొదటి భార్య నేనా అదా చెప్పండి అని అడుగుతుంది. మరోవైపు ఇందిర ఆయన ఫోన్ చేయడం కలా నిజమా అని అనుకుంటుంది. ప్రేరణ, ఐశ్వర్యలు వచ్చి ఎందుకు ఆయనకు ఫోన్ చేస్తున్నావ్ అని అడుగుతారు. ఆయన నలుగురిలో మన పరువు తీశారు.. ఇప్పుడు ఎందుకు ఆయనతో మాట్లాడాలి అనుకుంటున్నావ్.. వద్దమ్మా వద్దు మాట్లాడకు అని అంటుంది. ఈశ్వరి రాజశేఖరానికి ప్రశ్నిస్తూ ఉంటే గణ వచ్చి ఏమైందని అడుగుతాడు. ఈయన గారికి వాళ్ల మీద ప్రేమ పొంగుకొచ్చినట్లు ఉందిరా.. ఫోన్ చేయడానికి రెడీ అయ్యారు.. నేను ప్రశ్నించడంతో నా మీద చేయి ఎత్తారు అని చెప్తుంది. గణ కోపంగా ఏంటి వాళ్లకి మాకు తేడా మీకు తెలీడం లేదా.. వాళ్ల గురించి ఆలోచించడానికి ఏం లేదు.. ఇక వాళ్లని మర్చిపో వాళ్లు బజారు మనుషులు అంటాడు. ఎవరిని బజారు మనుషులు అని రాజశేఖరం అంటే ఇంకెవరూ వాళ్లే అని గణ అంటాడు. వాళ్లు అలాంటి వాళ్లు కాదు.. వాళ్లని తక్కువ చేస్తే బాగోదు అని అంటాడు. గణ, ఈశ్వరి ఇద్దరూ మీకు వాళ్లు మేం ఒకలా కనిపిస్తున్నామా.. మీకు మాకంటే వాళ్లే ఎక్కువా అని అడుగుతారు. అవును మీ కంటే వాళ్లే ఎక్కువ అని అంటాడు. గణ, ఈశ్వరి షాక్ అయిపోతారు.
సిద్ధూ ప్రేరణని ప్రేమిస్తున్నాను అనే విషయం తన తల్లికి ముందు చెప్పి పర్మిషన్ తీసుకొని తర్వాత ప్రేరణకి చెప్పాలి అనుకుంటాడు. సిద్ధూ ఇందిరతో మీతో మాట్లాడాలి అని పక్కకి తీసుకెళ్తాడు. ప్రేరణ, ఐశ్వర్యలు ఏమైందా అని అనుకుంటారు. మంజుల విజయానంద్, సాహితిలకు చెప్తుంది. నా గొంతులో ప్రాణం ఉండగా ఇద్దరినీ పెళ్లి చేసుకోనివ్వను అని మంజుల అంటుంది. సాహితి తల్లితో నువ్వు ముందు అన్నయ్య వాళ్ల నాన్నని పెళ్లి చేసుకున్నావ్ తర్వాత మా నాన్నని చేసుకున్నావ్ ఒక వేళ నాన్న నిన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే అన్నయ్య ఎవరికి పుట్టాడు అని అనుంటే ఏం చేసేదానివి అని అడుగుతుంది. దాంతో విజయానంద్ సాహితిని కొట్టడానికి చేయి ఎత్తుతాడు. ప్రేరణ వాళ్ల నాన్నే వాళ్లని మోసం చేయొచ్చు కదా.. అబద్ధం చెప్పొచ్చు కదా అని అంటుంది. నీకు అర్థం చేసుకొనే వయసు మనసు రెండూ లేవు వాళ్లకి మనకి పోలిక ఏంటి.. వాళ్ల కోసం నీ నాన్నని నన్ను పోల్చుతావా,, మీ నాన్న నన్నుఎందుకు మోసం చేస్తారు అని ఏడుస్తుంది.
సిద్ధూ ఇందిరతో ఆంటీ నేను ఎవరినైనా ప్రేమించినా వాళ్ల తల్లిదండ్రులకు ముందు విషయం చెప్పాలి అనుకున్నా ఆంటీ నేను ప్రేరణని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను.. అని అంటాడు. ఇందిర షాక్ అయిపోతుంది. ప్రేరణని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఆంటీ ఈ విషయం నేను ముందు పెట్టుకున్న రూల్ ప్రకారం మీకు చెప్తున్నాను.. ప్రేరణకు ఈ విషయం చెప్పడానికి నాకు పర్మిషన్ కావాలి అంటాడు. నేను పర్మిషన్ ఇవ్వకపోతే ఏం చేస్తావ్ అని అడుగుతుంది. మీకు ప్రేరణకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటా అని సిద్ధూఅంటే వద్దు బాబు నీకు ప్రేరణకి మధ్య మా గతం అడ్డుగా ఉంటుంది. ప్రేరణ మీద నీకు ఉన్న ప్రేమ వదులుకో బాబు అని అంటుంది. ప్రేరణ కోసం నేను ఎవర్ని అయినా ఎదుర్కుంటా ఎవరినైనా వదులుకుంటా అని సిద్ధూఅంటే మీ అమ్మని కూడానా బాబు.. తనకి చెప్పావా అని అంటే చెప్పాను అని సిద్ధూ అంటాడు. మీ అమ్మ కచ్చితంగా వద్దు అంటారు. ఇప్పుడు చెప్పు ప్రేరణ కోసం మీ అమ్మని వదులుకుంటావా అని అడుగుతుంది. మీ భయం మా అమ్మే అయితే తనని నేను ఒప్పిస్తా.. గతం మా అమ్మకి తెలిస్తే ప్రేరణని మా అమ్మ నా కంటే బాగా చూసుకుంటుంది అని అంటాడు. ప్రేరణని కన్న వాడే మీకు మాకు సంబంధం లేదు అని చెప్పాడు. కన్నవాళ్లు అబద్ధం చెప్పినా నేను మిమల్ని ప్రేరణని నమ్ముతున్నా అని సిద్ధూ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
ట్రెండింగ్ వార్తలు





















