అన్వేషించండి

Nagababu: మనల్ని ఎవడ్రా ఆపేది - 'జబర్దస్త్'లోకి నాగబాబు రీ ఎంట్రీ?... ఈసారి మోత మోగిపోద్ది అంతే...

Jabardasth: బిగ్గెస్ట్ కామెడీ షో 'జబర్దస్త్' 700 ఎపిసోడ్స్‌తో 12 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా సెలబ్రేషన్స్ షురూ చేయగా... మెగా బ్రదర్ నాగబాబు గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు.

Nagababu Re Entry To Jabardasth Comedy Show: అతి పెద్ద టీవీ కామెడీ షో 'జబర్దస్త్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పేరు వింటేనే ఆడియన్స్ ముఖంపై చిరునవ్వు కనిపిస్తుంది. అంతగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ షో తాజాగా 700 ఎపిసోడ్స్‌తో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ఆకట్టుకుంటోంది.

గత దశాబ్ద కాలంగా 'జబర్దస్త్' షో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. నాగబాబు, రోజా ఈ షోకు జడ్జీలుగా వ్యవహరించారు. ఈ షో ద్వారా ఎంతోమంది టాప్ కమెడియన్స్‌ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తమ కామెడీ టైమింగ్, పంచులు, స్కిట్లతో పాపులారిటీ సంపాదించుకున్నారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, సత్య, గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ, షకలక శంకర్, ధన్ రాజ్ ఇలా ఎంతో మంది ఈ షో ద్వారా పరిచయమై సినీ పరిశ్రమలో తమ టాలెంట్‌తో మంచి స్థాయిలో ఉన్నారు.

నాగబాబు రీ ఎంట్రీ

700 ఎపిసోడ్స్‌తో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 'జబర్దస్త్' షో నిర్వాహకులు స్పెషల్ ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో మెగా బ్రదర్, యాక్టర్ నాగబాబు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. 'రావాల్సిన వాళ్లు వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ... ఆశ్చర్యపోతున్నారేంట్రా కుయ్యా... మనల్నెవడ్రా ఆపేది.' అంటూ ఆయన చెప్పడం హైప్ క్రియేట్ అవుతోంది. అయితే... ఈయన సెలబ్రేషన్స్‌కు ఆయన అతిథిగా వచ్చారా?, మళ్లీ జడ్జీగా కొనసాగుతారా? అనే దానిపై క్లారిటీ లేదు. ఆయన జడ్జీగా కొనసాగితేనే బాగుంటుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: ఫిష్ వెంకట్‌కు మరో హీరో ఆర్థిక సాయం - ఫ్యామిలీకి రూ.2 లక్షల చెక్ అందజేత

స్పెషల్ జడ్జెస్ వీరే...

'జబర్దస్త్' షో కామెడీ స్కిట్స్ ఎంత స్పెషలో జడ్జెస్ కూడా అంతే ఫేమస్. మెగా బ్రదర్ నాగబాబు, సీనియర్ హీరోయిన్ రోజా ఈ షోకు ఎన్నో ఏళ్లుగా జడ్జెస్‌గా వ్యవహరిస్తూ వన్నె తీసుకొచ్చారు. ఆ తర్వాత వైసీపీ హయాంలో రోజాకు మంత్రి పదవి రావడంతో షోకు గుడ్ బై చెప్పారు. నాగబాబు సైతం పొలిటికల్‌గా బిజీగా మారడంతో జడ్జి బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత ఈ షోకు ఖుష్బూ, ఇంద్రజ, కృష్ణ భగవాన్, సింగర్ మను జడ్జెస్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం శుక్ర, శనివారాల్లో రాత్రి 9:30 గంటలకు షో టెలికాస్ట్ అవుతుండగా... ఇంద్రజ జడ్జీగా వ్యవహరిస్తున్నారు. 

మళ్లీ ఇన్నాళ్లకు నాగబాబు రీ ఎంట్రీ ఇవ్వడంతో జబర్దస్త్ ఫ్యాన్స్‌తో పాటు షో కమెడియన్స్‌లోనూ జోష్ నెలకొంది. ప్రోమోలో జబర్దస్త్ కమెడియన్లు ఒకరికొకరు పాదాలు కడిగి సన్మానం చేయడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

కనిపించని రోజా

ఈ సెలబ్రేషన్స్‌లో రోజా కనిపించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. నాగబాబు ఉన్నారనే రాలేదా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం నాగబాబు జనసేన ఎమ్మెల్సీగా ఉన్నారు. రోజా వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. దీంతో నిర్వాహకులు ఆమెను ఆహ్వానించలేదా? లేదా ఆమెనే రానని చెప్పారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget