అన్వేషించండి

Karthika Deepam 2 Serial August 8th: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్య మిస్సింగ్, బెనిఫిట్ తమకే అంటోన్న జ్యోత్స్న, విడాకులు కోరిన దీప!

Karthika Deepam 2 Serial Episode శౌర్య కనిపించకపోవడంతో దీప కార్తీక్‌కి కాల్ చేయడం కార్తీక్ కంగారుగా ఇంటికి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode లాయర్‌ జ్యోతి దగ్గరకు దీప వస్తుంది. కాళ్లకు చెప్పులు లేక నడవడానికి ఇబ్బంది పడుతూ అదోలా ఉన్న దీపని చూసి జ్యోతి ఏమైందని అడుగుతుంది. నిన్ను చూస్తుంటే ఏదో భయంగా ఉందని చెప్పి కూర్చొపెడుతుంది. దీప లాయర్‌తో తనకు విడాకులు కావాలని అడుగుతుంది. 

దీప: నేను ఏం తప్పు చేయకున్నా ఏన్నో ఓర్చుకున్నాను కానీ ఈ రోజు పడ్డ మాటలు మాత్రం నా జీవితంలో పడలేను మేడమ్. వద్దు మేడమ్ కూతుర్ని ఎలా దక్కించుకోవాలో తెలీక ముందు నన్ను మానసికంగా చంపేయాలి అని చూశాడు. నేను తూలి పడబోతే కార్తీక్ బాబు నా చేయి పట్టుకున్నాడు. దాన్ని కూడా ఓ ఆధారం పెట్టుకొని పట్టపగలు మరో మగాడితో అలా నడిరోడ్డు మీద అని లాయర్ మాట్లాడుతుంటే ఆ మాటలే నన్ను నరికేస్తున్నాయ్ మేడమ్.
జ్యోతి: కేసు గెలవడానికి అవతల వాళ్లు ఇలాంటి మాటలు అని మానసికంగా ఇబ్బంది పెట్టి కేసు గెలవాలి అన్నది వాళ్ల ప్లాన్. 
దీప: ఇక చాలు మేడమ్ మొదటి వాయిదాకే ఇలా చేశాడు అంటే ఇక తర్వాత ఎన్ని అబద్ధాలు చెప్పబోతున్నాడో ఇక ఆ మనిషితో నేను వేగ లేను నాకు విడాకులు కావాలి మేడమ్. మీరు విడాకులకు అర్జీ పెట్టండి నేను చెప్పాల్సింది కోర్టులో చెప్తాను.

సుమిత్ర: నా ప్రాణాలు కాపాడిన దీపకు నేనేం సాయం చేయలేకపోతున్నానండీ.
దశరథ్: నేను అదే ఆలోచిస్తున్నా సుమిత్ర రేపు ఏమైనా జరిగి పాపని నర్శింహకి ఇవ్వాల్సి వస్తే దీప పరిస్థితి ఏంటా అని.
సుమిత్ర: దీప చచ్చిపోతుందండి. దీప బతుకుతుందే శౌర్య కోసం.
పారిజాతం: దీప గురించి నువ్వు ఆలోచించినంత గొప్పగా నీ కన్న కూతురి గురించి ఆలోచించి ఉంటే ఇంకా బాగుండేది. దీపకి శౌర్య అంటే ప్రాణం అని తెలిసిన నీకు జ్యోత్న్సని కార్తీక్ అంటే ప్రాణం అని తెలీలేదు.
సుమిత్ర: అత్తయ్య నేను ఇంతకు ముందు చెప్పాను మళ్లీ చెప్తున్నాను జ్యోత్స్న నా కూతురు కార్తీక్ నా మేనల్లుడు వాళ్లిద్దరి మీద ప్రేమ వేరు దీప మీద ఉన్న అభిమానం వేరు. దీప పరాయిదే కావొచ్చు కానీ కృతజ్ఞత అని ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు మన సమాజం ఉన్న పరిస్థితికి నింద పడిన మగాడిని అయినా క్షమిస్తుంది కానీ ఆడవాళ్లని వదలదు. ఓ అమ్మ మనసుతో ఆలోచించండి అత్తయ్య దీప ఎంత ధీనస్థితిలో ఉందో మీకు అర్థమవుతుంది. 

దీప దీనంగా నడుచుకుంటూ ఇంటికి వస్తుంది. ఇంటి దగ్గర శౌర్య కనిపించకపోవడంతో కంగారు పడుతుంది. దీప పరుగున సుమిత్ర దగ్గరకు వెళ్తుంది. శౌర్యని పిలవమని అంటే బయటే ఆడుకుంటుందని సుమిత్ర చెప్తుంది. దీప లేదని చెప్పడంతో పారిజాతం మీ ఆయనో అత్తో వచ్చి తీసుకెళ్లుంటారని అంటుంది. దాంతో సుమిత్ర దీప దశరథ్‌లు పాపని వెతకడానికి బయటకు వెళ్తారు. దీప కార్తీక్‌కి కాల్ చేస్తుంది. ఇక దీప సెల్ ఛార్జింగ్ అయిపోతే కార్తీక్ కాల్ చేసే సరికి దీప ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో కార్తీక్ కంగారు పడి దీప దగ్గరకు బయల్దేరు తాడు. మరోవైపు జ్యోత్స్న ఫొటోలు తీసుకుంటుంటే పారిజాతం మనవరాలి దగ్గరకు వెళ్తుంది. శౌర్య కనిపించడం లేదని చెప్తుంది. నర్శింహే తనని తీసుకెళ్లుంటాడని జ్యోత్స్న అంటుంది. దీపని దత్తత తీసుకున్న తల్లిదండ్రులుగా మీ అమ్మనాన్నలు మరారని ఇక కార్తీక్ అయితే దీపకు ఏమైనా అయితే ఎగిరి వస్తాడని అంటుంది. 

సుమిత్ర, దీప వాళ్లు కంగారు పడతారు. తనకి నర్శింహ మీద అనుమానంగా ఉందని దీప బయల్దేరుతుంది. ఇంతలో కార్తీక్ ఇంటికి వస్తాడు. శౌర్య కనిపించడం లేదని దీప అంటుంది. ఇంతలో శౌర్య ఇంట్లోని అలమరలో దాక్కోని బయటకు వస్తుంది. దీపకు భయపడొద్దని కార్తీక్ ధైర్యం చెప్తాడు. ఇంతలో శౌర్య వస్తుంది. బూచోడు వస్తాడని తనని తీసుకుపోతాడని అందుకే బీరువాలో దాక్కున్నానని శౌర్య చెప్తుంది. ఇక బూచోడు వస్తాడని జ్యో చెప్పిందని అంటుంది. నాకు నాన్న వద్దమ్మా నేను నీతోనే ఉంటాను అని శౌర్య అంటుంది. ఇక శౌర్య కార్తీక్‌ని ఎక్కడికీ వెళ్లొద్దని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: క్రిష్ వెంటపడుతున్న సత్య, సోనితో రుద్ర అఫైర్, అందరూ శత్రువులయ్యారని మహదేవయ్య ఫైర్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
India vs Bangladesh 1st Test: తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
India vs Bangladesh 1st Test: తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
Jagan About Tirumala: తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
Amazon Great Indian Festival Sale: అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌ -  స్మార్ట్‌ ఫోన్లపై అదిరే  ఆఫర్లు -  రూ.10 వేల కన్నా తక్కువకే
అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌ -  స్మార్ట్‌ ఫోన్లపై అదిరే  ఆఫర్లు -  రూ.10 వేల కన్నా తక్కువకే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Embed widget