Jagadhatri Serial Today Fabruary 1st: ‘జగధాత్రి’ సీరియల్: సుహాసినికి పిండ ప్రధానం చేసిన సుధాకర్ – సంతోషంలో కేదార్
Jagadhatri Today Episode : ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా గుడికి వెళ్లి సుహాసినికి పిండ ప్రధానం చేస్తాడు సుధాకర్. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri Serial Today Episode: బూచి ఎవరితోనో చాటింగ్ చేస్తూ మెలికలు తిరిగిపోతుంటే.. ధాత్రి, కేదార్ చూస్తారు. ఈ టైంలో ఎవరితో చాటింగ్ చేస్తున్నాడు అనుకుంటారు. కాచికి అన్యాయం చేసేంత చెడ్డోడైతే కాదు కానీ ఏమైనా చేస్తే చూసుకోవడానికి మనం ఉన్నాం కదా అంటాడు కేదార్. ఎవరో చిన్నప్పటి ఫ్రెండ్ అయ్యుండొచ్చు అంటాడు. తర్వాత సుధాకర్ రూంలో బుక్స్ చూస్తుంటే సుహాసినితో దిగిన ఫోటో కనిపిస్తుంది.
సుధాకర్: నేను నీకు చేసిన అన్యాయానికి సంజాయిషీ సరిపోదని తెలుసు. నా వల్ల నువ్వు కేదార్ అవమానాలు పడ్డారు. నిందలు మోసారు. భరించలేని కష్టాలు అనుభవించారు. ఇన్ని తెలిసి మళ్లీ ఇప్పుడు కేదార్కు అన్యాయం చేస్తున్నా..? నా కళ్ల ముందే నా రక్తాన్ని అవమానిస్తున్నా.. నా కొడుకును అవమానిస్తున్నా..? అనకూడని మాటలు అంటున్నా.. విగ్రహం లాగా చూస్తూ ఊరుకున్నాను. అయినా ఈ తండ్రి పరిస్థితిని అర్తం చేసుకున్నాడు కానీ ఏనాడు కేదార్ నన్ను అవమానించలేదు. అదంతా కేదార్కు నీ నుంచే వచ్చింది. మరో జన్మంటూ ఉంటే మళ్లీ నిన్నే ప్రేమిస్తా.. కానీ అప్పుడు ఎంత కష్టం వచ్చినా నీ చెయ్యి వదలను.
అంటూ ఎమోషనల్ అవుతాడు. మరుసటి రోజు ఉదయం సుధాకర్ కంగారుగా బయటకు వెళ్తుంటే.. యువరాజ్ చూసి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. ఎక్కడికి లేదు ఆనంద్ అంకుల్ను కలవడానికి వెళ్తున్నాను .. అంటూ వెళ్లిపోతాడు. ఇంతలో వైజయంతి కాఫీ తీసుకుని వస్తుంది. ధాత్రి, కేదార్ గుడి దగ్గరకు వెళ్తారు.
ధాత్రి: మన వాళ్లు అన్ని రెడీ చేశారు. పిండ ప్రదానం ముగించుకుని వస్తే అన్నదానం మొదలుపెట్టొచ్చు.
కేదార్: సరే ధాత్రి..
ధాత్రి: చూస్తూ ఉండు కేదార్. ఏదో ఒక రోజు మామయ్యగారే అత్తయ్యకు పిండప్రధానం చేస్తారు. ఆరోజు నీ మాటలు తడబడతాయి. మాటలు దొర్లుతాయి. నీ కళ్లు ఆనందంతో చెమ్మగిల్లుతాయి. ఆశ కోల్పోకు కేదార్.
కేదార్: ఓకే.
ధాత్రి: సరే పద.. నమస్తే పంతులు గారు. పిండ ప్రధానం గురించి నిన్న మీతో మాట్లాడాను కదా..?
పంతులు: అవును ఇంకో పంతులు వేరే వాళ్లదే పిండ ప్రధానం చేస్తున్నారు. అది అయిపోయాయ మీది చేద్దాం.
అని చెప్పి పంతుల వెళ్లిపోయాక ధాత్రి, కేదార్ ఒక దగ్గర కూర్చుంటారు. సుహాసిని ఫోటో తీసుకుని చూస్తూ.. కేదార్ ఏడుస్తుంటాడు. వైజయంతి, యువరాజ్, నిషిక తిట్టిన తిట్టు గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంటాడు. ఇంతలో అక్కడికి పంతులు వస్తాడు. సుహాసిని ఫోటో చూస్తాడు.
పంతులు: బాబు ఈ ఫోటో..
ధాత్రి: ఏమైంది పంతులు గారు
పంతులు: ఇప్పుడు పిండ ప్రదానం చేయాల్సింది ఈవిడకేనా..?
కేదార్: అవును పంతులు గారు ఈవిడ మా అమ్మ..
పంతులు: అవునా…? మరి అతనెవరు..?
ధాత్రి: అతనంటే ఎవరు? పంతులు గారు.
పంతులు: ఇప్పుడు మా పంతులు పిండ ప్రదానం చేస్తున్నారు అని చెప్పాను కదా..? అతను కూడా ఈవిడకే పిండప్రధానం చేస్తున్నారు.
కేదార్: ఏంటి మా అమ్మగారికి పిండం పెడుతున్నారా..? ఎవరతను..?
పంతులు: పేరు తెలియదు. ఈ చుట్టు పక్కల ఎప్పుడూ చూడలేదు. పొద్దునే వచ్చి మా పంతులుతో మాట్లాడి పిండ ప్రదానం చేస్తున్నారు.
ధాత్రి: ఆ పిండ ప్రధానం ఎక్కడ చేస్తున్నారు పంతులుగారు.
పంతులు: నది ఒడ్డున చేస్తున్నారు..
అని పంతులు చెప్పగానే.. కేదార్ పరుగెడతాడు. వెనకాలే ధాత్రి పరుగెడుతుంది. అక్కడికి వెళ్లి చూడగానే సుధాకర్ పిండ ప్రధానం చేస్తుంటాడు. సుధాకర్ ను చూసిన కేదార్, ధాత్రి ఆశ్చర్యపోతారు. హ్యాపీగా ఎమోషనల్ అవుతాడు. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















