అన్వేషించండి

Chiranjeevi lakshmi sowbhagyavati Serial Today August 29th: ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’ సీరియల్‌: జున్నుకు నిజం చెప్పిన లక్ష్మీ – లక్ష్మీకి కవలలు పుట్టారన్న నిజం తెలుసుకున్న దేవయాని

Chiranjeevi lakshmi sowbhagyavati Today Episode: మిత్రను నమ్మించి మనీషాతో పెళ్లి చేయాలనుకున్న దేవయాని ఆశలపై సంయుక్త నీళ్లు చల్లడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Chiranjeevi lakshmi sowbhagyavati  Serial Today Episode: లక్ష్మీ చేతికి ఉన్న కట్టు చూసి  జున్ను  షాక్‌ అవుతాడు. నిన్న సామ్‌ ఆంటీ చేతికి కూడా సేమ్‌ కట్టు చూశాను. అంటే నువ్వే సామ్‌ ఆంటీవా? అని అడుగుతాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. మీరిద్దరు ఒకటేనా? అని అడుగుతాడు. లేదు మేము ఒక్కటి కాదు అంటుంది లక్ష్మీ.  జున్ను నువ్వు నన్ను మోసం చేశావు. అంటూ బయటకు వెళ్లిపోతాడు.  అర్జున్‌, జున్నుకు నిజం తెలిసిపోయిందని వెళ్లి నిజం చెప్పు అంటాడు. అయితే జున్ను కు అన్ని చెప్తాను. ఒక్కవాళ్ల నాన్నకు తప్పా.. అని జున్ను దగ్గరకు వెళ్తుంది లక్ష్మీ .

లక్ష్మీ: నేను నీకు అబద్దం చెప్పలేదు జున్ను నీ దగ్గర నిజం దాచాను అంతే

జున్ను: నిజం చెప్పకపోవడం అబద్దమే కదా?

లక్ష్మీ: కాదు ఒక మంచి పని కోసం నిజం దాస్తే అది తప్పు కాదు.

జున్ను: అసలెందుకని నువ్వు శామ్‌ ఆంటీలా వాళ్ల ఇంట్లో ఉన్నావు.

 అని జున్ను అడగ్గానే అక్కడ ఒక సమస్య ఉందని అది నేను నేనులా చేయలేను కాబట్టి అలా వెళ్లాను అని చెప్తుంది లక్ష్మీ. జున్నుకు అర్తమయ్యేలా చెప్తుంది. దీంతో జున్ను కన్వీన్స్‌ అవుతాడు. మరోవైపు మనీషా, మిత్ర కలిసి లక్కీని గోపికలా రెడీ చేస్తుంటారు.

మనీషా: మిత్ర ఈ పనులననీ నీకెందుకు లక్కీని నేను రెడీ చేస్తానుగా నువ్వు వెళ్లి రెస్ట్‌ తీసుకో..

మిత్ర: మనీషా రెస్ట్‌ తీసుకోవాల్సింది నువ్వు. నీ చేతికే కదా గాయం అయ్యింది. ఆ నొప్పి ఎప్పుడో మర్చిపోయాను. ఇప్పుడు నా ఆనందం అంతా లక్కీని రెడీ చేయడంలోనే ఉంది మిత్ర.

దేవయాని: మనీషా బంగారం లాంటి మాట చెప్పావు. లక్కీ అంటే ఎంత ప్రేమ. ఎంత శ్రద్ద. రేపు అదృష్టం బాగుండి నీకు మిత్రకు పెళ్లి అయి ఒక పాప పుడితే లక్కీని చూసుకున్నట్లు ఆ పిల్లను చూసుకోవేమో..?

మనీషా: అదేంటి ఆంటీ అలా అంటున్నారు. ఒకవేళ నాకు మిత్రకు పెళ్లైతే నాకు పిల్లలు అవసరం లేదు. నాకు లక్కీ చాలు.

 అని మాట్లాడుకుంటుంటే మిత్ర వింటుంటాడు. తర్వాత మనీషా, లక్కీని తీసుకుని వెళ్లిపోతుంది. మనీషా గురించి దేవయాని మిత్రకు గొప్పగా చెప్తుంది. మరోవైపు గోపికగా మారిన లక్కీని చూసిన అరవింద, జయదేవ్‌ వివేక్‌ చాలా హ్యాపీగా ఫీలవుతారు. చాలా అందంగా ఉన్నావని అందరూ అంటుంటే ఇంతలో మిత్ర వచ్చి ఆ క్రెడిట్‌ అంతా మనీషాది అంటూ వస్తాడు. దేవయాని కూడా మనీషా వల్లే లక్కీ అంత అందంగా రెడీ అయ్యిందని అంటుంది.

    దీంతో మనీషా వల్ల లక్కీకి అందం రాలేదని.. లక్కీకి నాచురల్‌ బ్యూటీ అని అరవింద చెప్తుంది. లక్కీకి ఎంత గెటప్‌ వేసినా ఒక్కటి తక్కువ అయ్యిందని అరవింద అనగానే జయదేవ్‌, వివేక్‌ కూడా ఏదో మిస్‌ అయ్యిందని ఆలోచిస్తుంటారు. ఇంతలో లక్ష్మీ వస్తుంది. పాపిట బిల్ల మిస్‌ అయ్యిందని లక్ష్మీ చెప్పగానే అందరూ అవునని అంటారు. జాను వెళ్లి పాపిటబిల్ల తీసుకురావడంతో లక్ష్మీ పెడుతుంది.   

లక్ష్మీ: సూపర్‌గా ఉన్నావు లక్కీ.. జున్ను కూడా కృష్టుడి గెటప్‌ లో చాలా బాగున్నాడు.

లక్కీ: జున్ను కృష్ణుడి గెటప్‌ వేసుకున్నాడా?

మనీషా: జున్ను కృష్ణుడి గెటప్‌ వేసుకున్నాడని నువ్వెప్పుడు చూశావు. ఈ ఇంట్లో ఉన్న మీకు ఆ ఇంట్లో ఉన్న జున్ను గురించి ఎలా తెలుసు.

దేవయాని: కొంప దీసి నువ్వే జున్నును రెడీ చేశావా ఏంటి?

అని అడగ్గానే ఇంతలో జున్ను కృష్ణుడి గెటప్‌లో వస్తాడు. దీంతో జాను, జున్ను ఇందాకే వచ్చాడని బయటే కలిశాడని చిన్న తప్పు ఉంటే సంయుక్త గారే సరి చేశారని చెప్తుంది. తర్వాత అందరూ కలిసి వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిపోయాక దేవయాని లక్కీ, లక్ష్మీ కూతురని తెలిసిపోయింది కానీ జున్ను కూడా లక్ష్మీ కొడుకేమోనని నాకు డౌట్‌ గా ఉందని చెప్తుంది. లక్ష్మీ డెలివరీ అయిన హాస్పిటల్‌ కు ఫోన్‌ చేసి లక్ష్మీ డెలివరీ డీటెయిల్స్‌ అడుగుతుంది. హాస్పిటల్‌ వాళ్లు కవలలు పుట్టారని చెప్పడంతో దేవయాని షాక్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ‘కార్తీకదీపం 2’ సీరియల్: శౌర్య జబ్బు గురించి తెలుసుకున్న అనసూయ – ఊరిలో ఇల్లు అమ్మేస్తానన్న నర్సింహ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ramana Deekshitulu: తిరుమల లడ్డూ వివాదం - ఐదేళ్లు మహా పాపం జరిగిందని రమణ దీక్షితులు ఆవేదన
తిరుమల లడ్డూ వివాదం - ఐదేళ్లు మహా పాపం జరిగిందని రమణ దీక్షితులు ఆవేదన
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
IND vs BAN : తొలి ఇన్నింగ్స్‌ 376 స్కోర్ తో ముగించిన భారత్,  తొలి ఓవర్ లోనే షాకిచ్చిన జస్ప్రీత్ బుమ్రా
తొలి ఇన్నింగ్స్‌ 376 స్కోర్ తో ముగించిన భారత్, తొలి ఓవర్ లోనే షాకిచ్చిన జస్ప్రీత్ బుమ్రా
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramana Deekshitulu: తిరుమల లడ్డూ వివాదం - ఐదేళ్లు మహా పాపం జరిగిందని రమణ దీక్షితులు ఆవేదన
తిరుమల లడ్డూ వివాదం - ఐదేళ్లు మహా పాపం జరిగిందని రమణ దీక్షితులు ఆవేదన
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
IND vs BAN : తొలి ఇన్నింగ్స్‌ 376 స్కోర్ తో ముగించిన భారత్,  తొలి ఓవర్ లోనే షాకిచ్చిన జస్ప్రీత్ బుమ్రా
తొలి ఇన్నింగ్స్‌ 376 స్కోర్ తో ముగించిన భారత్, తొలి ఓవర్ లోనే షాకిచ్చిన జస్ప్రీత్ బుమ్రా
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Samantha: గుడ్ న్యూస్ చెప్పిన సమంత... ఫుల్ ఖుషీగా సామ్ ఫ్యాన్స్
గుడ్ న్యూస్ చెప్పిన సమంత... ఫుల్ ఖుషీగా సామ్ ఫ్యాన్స్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Ghaati Movie: ‘ఘాటీ’ షూటింగ్ మళ్లీ షురూ చేసిన అనుష్క శెట్టి... హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల షూట్
‘ఘాటీ’ షూటింగ్ మళ్లీ షురూ చేసిన అనుష్క శెట్టి... హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల షూట్
Embed widget