Chiranjeevi lakshmi sowbhagyavati Serial Today August 27th: ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’ సీరియల్: మిత్రను కాపాడినట్లు బిల్డప్ ఇచ్చిన మనీషా – తానే లక్ష్మీ అని నిజం చెప్పమన్న అరవింద
Chiranjeevi lakshmi sowbhagyavati Today Episode: మిత్రను రౌడీల నుంచి తానే కాపాడానని మనీషా బిల్డప్ ఇస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Chiranjeevi lakshmi sowbhagyavati Serial Today Episode: మిత్రను సేవ్ చేయడానికి సంయుక్త అక్కడికి రాలేదన్నమాట. అయితే మనీషా ఒక్కతే మిత్రను కాపాడి తీసుకొచ్చిందన్నమాట అని దేవయాని అంటుంది. ఇంతలో సంయుక్త, అర్జున్ ఇంటికి వస్తారు. వాళ్లను చూసిన మనీషా మీరు మిత్రను సేవ్ చేయడానికి అక్కడికి వచ్చారా? నేను మిమ్మల్ని అక్కడ చూడలేదని అడుగుతుంది. నా చేతికి కట్టు ఉన్నట్లే నీ చేతికి కట్టు ఉందేంటి? ఆ దెబ్బ ఎలా తగిలింది. అయినా మీరు అక్కడికి ఎప్పుడు వచ్చారు. నేను రౌడీలను తరిమికొట్టి మిత్రను తీసుకొచ్చారా? అని అడుగుతుంది.
దేవయాని: అంతే అయ్యుంటుంది మనీషా.. సినిమాల్లో హీరో కష్టపడి ఫైట్ చేశాక ఆఖరులో పోలీసులు వచ్చినట్లు నువ్వు మిత్రను కాపాడి తీసుకొచ్చాక వీళ్లు పోలీసుల్లాగా వచ్చినట్టున్నారు.
సంయుక్త: మిత్ర గారు మీరు క్షేమంగా బయటపడినందుకు చాలా హ్యాపీగా ఉంది.
మిత్ర: థాంక్యూ సో మచ్ సామ్..
దేవయాని: మిత్రను కాపాడినందుకు మనీషాకు థాంక్స్ చెప్పవా? సంయుక్త. నీకు తెలుసో లేదో ఇదివరకు మిత్ర ఏ ప్రమాదంలో ఉన్నా.. లక్ష్మీ కాపాడేది. ఇప్పుడు ఆ బాధ్యత మనీషా తీసుకుంది. లక్ష్మీ లేని లోటు మనీషా తీరుస్తుంది. చూశావా మిత్ర దేవుడు నీకు లక్ష్మీ లేని లోటును మనీషాతో తీర్చాడు.
అని దేవయాని చెప్పగానే మిత్ర లోపలికి వెళ్లిపోతాడు. మనీషా వెళ్లిపోతుంది. తర్వాత దేవయాని, మనీషా దగ్గరకు కచ్చితంగా నువ్వు మిత్రను కాపాడలేదు కదా? అని అడుగుతుంది. అవునని మనీషా చెప్తుంది. మరోవైపు అర్జున్, జయదేవ్, అరవింద.. ముగ్గురు కలిసి సంయుక్తను నువ్వు కాపాడి ఆ మనీషా కాపాడింది అని ఎందుకు చెప్పావు అని అడుగుతారు. దీంతో ఎవరు కాపాడిన ఆయన సేఫ్ గా ఉన్నారు కదా అంటుంది.
అయితే తనను కాపాడిందని మిత్ర ఆ మనీషా మీద మంచి ఇంప్రెషన్ పెంచుకుంటే కష్టం కదా అంటాడు జయదేవ్. అయితే మీరంతా ఏదేదో ఊహించుకుంటున్నారని సంయుక్త చెప్తుంది. మరోవైపు సంయుక్త జాగ్రత్త పడితే ఏం చేస్తావు మనీషా అని అడుగుతుంది దేవయాని. జాగ్రత్త పడటం అంటే ఏం చేస్తుంది ఆంటీ.. తను సంయుక్తలా నటిస్తున్న లక్ష్మీ అని నిజం చెప్పేస్తుందా? అంటుంది. మరోవైపు అరవింద, మిత్రకు నువ్వే లక్ష్మీ అని నిజం చెప్పమని చెప్తుంది. మరోవైపు లక్ష్మీ అన్ని ఆలోచించుకుని నిజం చెప్పేలోపు నేను మిత్రకు బెటర్ హాప్ అవుతానని అంటుంది మనీషా. తర్వాత పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తారు.
జయదేవ్: అరవింద వాడే నీ మనవడు..
లక్కీ: నాన్నమ్మా నాన్న వచ్చాడంట కదా ఎక్కడున్నాడు.
అరవింద: పైనున్నాడు లక్కీ వెళ్లు..
లక్కీ: నాన్నా… ఎలా ఉన్నారు..? మీకేం కాలేదు కదా?
మిత్ర: ఏం కాలేదు లక్కీ..
జున్ను వచ్చి నీ చేతికి ఏమైంది అమ్మా అని అడుగుతాడు. జున్నును చూసిన అరవింద వాడు సేమ్ మిత్రలాగే మాట్లాడుతున్నాడు కదండి. అంటే అవునని వాడు మిత్ర రక్తమే కదా అంటాడు జయదేవ్. ఇంతలో జున్ను ఏడుస్తుంటాడు. వాడు కార్చే కన్నీరు తన తల్లికోసమని.. తన తల్లి చిందించిన రక్తం తన తండ్రికోసమని వాడికి తెలియదు అంటుంది అరవింద. ఇంతలో జున్ను నువ్వు ఇంకోసారి ఇలా చేయనని నాకు మాట ఇవ్వు అని సంయుక్తను అడుగుతాడు.
అరవింద: ఇక నా వల్ల కాదండి వాడు బాధపడుతుంది.. వాడి కన్నతల్లి కోసమని ఇప్పుడే వాడితో చెప్పేద్దామండి.
జయదేవ్: నిజం చెప్పాల్సింది నువ్వు నేను కాదు అరవింద.. లక్ష్మీ. తన కొడుకు తనెవరో చెప్పాలి.
అరవింద: అప్పటి వరకు ఆ పసిమనసు అలా బాధపడాల్సిందేనా..?
జయదేవ్: నీ ఆరాటం నాకు అర్థం అయ్యింది. నాన్నమ్మలా వాడిని దగ్గరకు తీసుకో.. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
అని చెప్పగానే అరవింద, జున్నును పిలుస్తుంది. దగ్గరకు తీసుకుంటుంది. ప్రేమగా హగ్ చేసుకుంటుంది. ఇంతలో నేను మిత్ర అంకుల్ ను చూడాలని జున్ను పైకి వెళ్తాడు. మరోవైపు మనీషా తన చేతికి కట్టుకున్న బ్యాండేజ్ చూసుకుంటూ మిత్రను గుర్తు చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మాన్స్టర్ కాదు... రాజశేఖర్ - పవన్ సాధినేని సినిమాకు 1990 సూపర్ హిట్ టైటిల్
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















