అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 22nd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: కుప్పకూలిపోయిన మనీషా.. అఖండ జ్యోతిని ఎత్తుకున్న లక్ష్మీ.. దగ్గరుండి నడిపించిన మిత్ర!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మనీషా కళ్లు తిరిగిపడిపోవడం లక్ష్మీ వచ్చి ప్రదక్షిణలు చేయడం మిత్ర లక్ష్మీకి సాయం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా బెల్లం బుట్ట పట్టుకొని ప్రదక్షిణలు చేస్తుంటుంది. బరువు మోయలేక చాలా ఇబ్బంది పడుతుంది. మిత్ర ఇబ్బంది అయితే డ్రాప్ అయిపోమని అంటాడు. కానీ మనీషా తిరుగుతాను ఏం కాదు అని అంటుంది. ఇక మిత్ర మనీషాని తిరగమని పిన్ని, పిల్లలు తాను వెళ్లి మరో మొక్కు తీర్చుతామని.. మనీషాని చూసుకోమని వివేక్‌తో చెప్తాడు. మిత్ర లేకపోతే ఎన్నో కొన్ని చేసి 108 అయిపోయావని చెప్పేయాలి అనుకున్న మనీషాకి తన పక్కన వివేక్ ఉండటంతో తెగ ఇబ్బంది పడుతుంది. మరోవైపు లక్ష్మీ రెడీ అయి మత్తు మత్తు గానే గుడికి బయల్దేరుతుంది. మిత్ర దేవుడి ఎదుట కొబ్బరి కాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటే జున్ను జై శ్రీరామ అని దేవుడి ఎదురుగా దీపాలు వెలిగిస్తాడు. 

జాను: అక్క నీకు మత్తే వదలలేదు ఇలాంటప్పుడు ఎలా మొక్క తీర్చుకుంటావక్కా.
లక్ష్మీ: మొక్కు చెల్లించడం నా బాధ్యత.
జాను: మైకం వదలకుండా లేస్తే ప్రమాదమని డాక్టర్ చెప్తారు.
లక్ష్మీ: నాకు ఏమైనా పర్లేదు మొక్క తీర్చాలి.
జాను: అక్క గుడి వచ్చింది పద.
వివేక్: ఏంటి మనీషా మూడు ప్రదక్షిణలకే ఇలా అయిపోతే ఇంకా 105 ఉన్నాయి. 
జాను: నేను అక్క గుడికి వచ్చాం అండీ మీరు ఎక్కడ ఉన్నారు.
వివేక్: జాను వదినకు ఏమైంది ఎందుకు అలా ఉంది.
జాను: ఇందంతా మీ అమ్మ మనీషా చేసిన కుట్ర. 
లక్ష్మీ: జాను వద్దు.
జాను: ఈ రోజు అక్క గుడికి రాకూడదు అని రాత్రి పాలలో మత్తు మందు కలిపారు. నాకు విషయం తెలీక నేను అక్కతో తాగించేశాను. బావగారికి చెప్దాం అంటే అక్క వద్దు అంటోంది.
వివేక్: అందుకేనా మనీషా ఇందాక ఓవర్ చేసింది.

వివేక్ మిత్రకు విషయం చెప్తాను అంటే లక్ష్మీ వద్దని అంటుంది. ఇక వివేక్ మనీషా మోయలేని భారం మోస్తుందని ఏ క్షణం అయినా పడిపోతుందని అంటాడు. ఇక లక్ష్మీ మిత్ర వాళ్ల దగ్గరకు వెళ్తుంది. మిత్ర పట్టించుకోడు.

మిత్ర: పొద్దున్న రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చావ్.
లక్ష్మీ: లేవలేకపోయానండీ. మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను.
దేవయాని: నీ మొక్కు మనీషా తీర్చుతుంది. లక్కీ నీ కన్నకూతురు అయితే ఇలా చేసేదానివా. ఊరికే కూతురని చెప్పుకోవడం కాదు బాధ్యత ఉండాలి. 
మిత్ర: తన వల్ల కాకపోయినా మనీషా మొక్కు తీర్చుతుంది తనకున్న బాధ్యత నీకు లేదు. నువ్వు ఇక ఏం చేయాల్సిన అవసరం లేదు మనీషా మొక్కు తీర్చుకుంటుంది. ఇంతలో ఒకావిడ వచ్చి మనీషా ప్రదక్షిణలు చేయలేక పడిపోయిందని చెప్తుంది. దాంతో అందరూ షాక్ అయి మనీషా దగ్గరకు పరుగులు తీస్తారు. 
మనీషా: సారీ మిత్ర నా వల్ల కాలేదు.
దేవయాని: మిత్ర ముందే చెప్పాడు కదా నువ్వే చేశావు.
మిత్ర: పిన్ని తన కనీసం ప్రయత్నించింది కొందరు ఉన్నారు బాధ్యత లేకుండా ఇంట్లో నిద్ర పోయారు. 
పంతులు: అఖండ జ్యోతి కింద పెట్టారేంటి అలా మధ్యలో వదిలేయకూడదు త్వరగా ఎత్తుకోండి.
మనీషా: నా వల్ల కాదు పంతులు గారు. 
పంతులు: అలా ఆపకూడదమ్మా అమ్మవారు ఆగ్రహిస్తారు. ఆవిడ బదులు ఇంకెవరైనా ఎత్తుకొని ప్రదక్షిణలు చేయండి.
లక్ష్మీ: నేను చేస్తాను. 

జాను, వివేక్‌లు వద్దని లక్ష్మీకి చెప్పినా లక్ష్మీ చేస్తాను అని అంటుంది. దేవుడి మీద భారం వేసి మొక్కు చెల్లిస్తానని అంటుంది. దాంతో వివేక్, జానులు జ్యోతిని లక్ష్మీ తల మీద పెడతారు. లక్ష్మీ ప్రదక్షిణలు చేస్తుంది. మనీషాని తీసుకొని దేవయాని పక్కకు వెళ్తుంది. ఎప్పటిలాగే లక్ష్మీ నీ పని పూర్తి చేస్తుందని దేవయాని అంటే సగం మత్తులో సగం స్ఫృహలో ఉన్న లక్ష్మీ ఏం చేయలేదని అనుకుంటారు. ఎలా అయినా మిత్రకు తాను దగ్గరవ్వాలని మనీషా అంటుంది. లక్ష్మీ తిరుగుతూ ఉండగా మత్తుతో సరిగా నడవలేకపోతుంది.

కళ్లు తిరిగి పడిపోతున్నట్లు నడుస్తుంది. మిత్ర చూసి వివేక్‌తో లక్ష్మీ ఎందుకు అలా ఉంది నిజంగా తనకు ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. దాంతో వివేక్ హెల్త్‌ ప్రాబ్లమ్ అని చెప్తాడు. అయినా ఎందుకు వచ్చిందని మిత్ర అంటే మొక్కు  తీర్చుకోవడానికి వచ్చిందని చెప్తాడు వివేక్. ఇక లక్ష్మీ పడిపోబోతే మిత్ర చూసి వెళ్లి లక్ష్మీని పట్టుకుంటాడు. నేను పట్టుకొని నడిపిస్తానని అంటాడు. మనీషా, దేవయానిలు షాక్ అయిపోతారు. మిత్ర లక్ష్మీని పట్టుకొని నడిపిస్తాడు. ప్రదక్షిణలు పూర్తి చేసి అఖండ జ్యోతిని దేవుడి దగ్గర పెట్టి లక్ష్మీ మత్తుతో మిత్ర మీద పడిపోతుంది. మిత్ర లక్ష్మీని దగ్గరకు తీసుకుంటాడు. మనీషా రగిలిపోతాడు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: అసలు నువ్వు ఎవరు? నన్ను పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పారు: త్రినేత్రికి విశాల్ ప్రశ్నలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget